
ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీ నియామకంపై సెర్చ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ముగ్గురు సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ నామినీగా డాక్టర్ రామ్కుమార్ కాకాని (డైరెక్టర్, ఐఐఎం రాయ్పూర్), పాలకమండలి నామినీగా ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ (వీసీ, గీతం వర్సిటీ), యూజీసీ నామినీగా ప్రొఫెసర్ అలోక్కుమార్ రాయ్ (వీసీ, యూనివర్సిటీ ఆఫ్ లక్నో బాబుగంజ్, లక్నో) వ్యవహరించనున్నారు. ఈ కమిటీలోని సభ్యులు సమావేశమై ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు గవర్నర్ తుది నియామకం చేయనున్నారు. కాగా, ఎస్కేయూ ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ బి.అనిత ప్రస్తుతం ఉన్నారు. ఇన్చార్జి పాలనలోనే ఏడాది పూర్తయింది. సాధారణ ఉద్యోగిని రిజిస్ట్రార్గా నియామకం చేశారు. కనీసం డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయి అధికారిని నియామకం చేయాల్సి ఉండగా, నిబంధనలు బేఖాతరు చేస్తూ రీసెర్చ్కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ను రిజిస్ట్రార్గా నియామకం చేశారు. ఏడాది కాలంలో వర్సిటీకి ఒక్క యూజీసీ ప్రాజెక్ట్ రాలేదు. కీలక నిర్ణయాలు అన్నీ జాప్యం కావడంతో వర్సిటీ పురోగతి మందగించింది. ఇలాంటి తరుణంలో పూర్తి స్థాయి వీసీ వస్తే వర్సిటీ పురోగతి గాడిన పడుతుందని ఉద్యోగులు, విద్యార్థులు భావిస్తున్నారు.

ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు

ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు