వరద నీటితో శబరి కళకళ | - | Sakshi
Sakshi News home page

వరద నీటితో శబరి కళకళ

Jul 4 2025 3:52 AM | Updated on Jul 4 2025 3:52 AM

వరద నీటితో శబరి కళకళ

వరద నీటితో శబరి కళకళ

చింతూరు: నిన్నటివరకు ఇసుక తిన్నెలతో కనిపించిన శబరినది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో జలకళ సంతరించుకుంది. మంగళవారం నుంచి కురుస్తున్న భారీవర్షాల కారణంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు సీలేరు నది ద్వారా వస్తున్న వరదనీరు చేరడంతో గురువారం ప్రవాహం పెరిగింది. చీకటివాగు ఎగపోటుకు గురై పొలాల్లోకి ఎగదన్నింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటితో సోకిలేరువాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. శబరినది మరింత పెరిగితే సోకిలేరు వాగు వరదనీరు చింతూరు, వీఆర్‌పురం రహదారిపై ప్రవహించే అవకాశముంది. పొల్లూరులోని టెగ్రిస్‌ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. శబరినదిలో కొత్తనీరు చేరడంతో విరివిగా చేపలు వలలకు చిక్కి జాలర్ల పంట పండుతోంది. గురువారం చింతూరులో 12 నుండి 15 కిలోల బరువు కలిగిన చేపలను రెండు నుంచి 3 క్వింటాళ్ల వరకు విక్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement