బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వడంతో... | - | Sakshi
Sakshi News home page

బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వడంతో...

May 31 2023 1:00 AM | Updated on Jun 3 2023 12:56 PM

చికిత్స పొందుతున్న బ్రాండిక్స్‌ కార్మికురాలు  - Sakshi

చికిత్స పొందుతున్న బ్రాండిక్స్‌ కార్మికురాలు

అచ్యుతాపురం (అనకాపల్లి): బ్రాండిక్స్‌ ఆవరణలో పనులు ముగించుకొని ఇళ్లకు వెళుతున్న కార్మికుల బస్సులు పరస్పరం ఢీకొనడంతో పది మందికి పైగా గాయపడ్డారు. గురువారం జరిగిన ఈ ఘటనతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. గాయపడిన సత్య, కుమారి, రామలక్ష్మి, ధన, నాగలక్ష్మి, దేవి తదితరులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఒక బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని సీఐటీయూ నాయకుడు ఆర్‌.రాము డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement