శారదాపీఠాధిపతులకు ఆహ్వానం

స్వరూపానందేంద్ర సరస్వతితో మాట్లాడుతున్న ఈవో త్రినాథరావు  - Sakshi

సింహాచలం: సింహగిరిపై వచ్చే నెల 2న జరిగే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం, 23న జరిగే చందనోత్సవాలకు హాజరు కావాలని శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతిలకు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆహ్వానించారు. శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతిని ఈవో బుధవారం కలిశారు. స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, చందనోత్సవానికి సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను ఈవో స్వామీజీకి వివరించారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని, వేసవి కాలం కావడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఈవోకు స్వామీజీ సూచించారు. దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుడు వారణాసి దినేష్‌రాజ్‌ ఈవో వెంట ఉన్నారు.




 

Read also in:
Back to Top