యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు | - | Sakshi
Sakshi News home page

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు

Dec 4 2025 8:34 AM | Updated on Dec 4 2025 8:34 AM

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ మంజూరైంది. రూ.200 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న జీవో జారీ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌ పర్యటన నేపథ్యంలో ప్రతిష్టాత్మక స్కూల్‌ మంజూరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు కేజీ టు పీజీ వరకు ఒకే చో ట నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు మూడు మంజూరు కాగా తాజాగా నాలుగోది ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి మంజూరైంది. ఈ పాఠశాల నిర్మాణం కోసం పట్టణంలోని నిషాన్‌ఘాట్‌లో 30 ఎకరాల స్థలాన్ని అధికారులు ఇది వరకే గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదననలు పంపించిన విష యం విదితమే. పాఠశాల మంజూరుపై ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement