-
విక్రమ్ క్రేజీ మూవీ.. డైరెక్టర్ లేటేస్ట్ అప్డేట్!
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన పా.రంజిత్ సినిమా విడుదలపై స్పందించారు. దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ.. 'తంగలాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్కు దరఖాస్తు చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమా విడుదల చేస్తాం. ఈ సినిమాను సినీ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అని తెలిపారు. కాగా.. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ డిఫెరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి కీలక పాత్రలు పోషించారు. -
సెన్సార్ బోర్డుపై దర్శకుడు ఫైర్.. నా సినిమా అంటే చాలు..
దర్శకుడు పా.రంజిత్ చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అదే సమయంలో సెన్సార్ బోర్డు నుంచి సమస్యలూ ఎదురవుతుంటాయి. తాజాగా ఆయన సొంత బ్యానర్ 'నీలం ప్రొడక్షన్స్' సమర్పణలో తెరకెక్కిన బ్లూస్టార్ మూవీకి ఈ చిక్కులు తప్పలేవు. అశోక్ సెల్వన్, శాంతను, పృథ్వీ పాండియరాజన్, కీర్తిపాండియన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జై కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెల 25న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బ్లూస్టార్కు ఎలాంటి సమస్యలు ఉండవనుకున్నా.. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పా.రంజిత్ మాట్లాడుతూ.. నీలం ప్రొడక్షన్స్ సంస్థ నుంచి చిత్రం వస్తుందంటేనే ఏదేదో ఉంటుందని సెన్సార్ బోర్డు సభ్యులు అలర్ట్ అవుతున్నారని ఫైర్ అయ్యారు. బ్లూస్టార్ చిత్రానికి ఎలాంటి సమస్యలు రావని భావించానని, అయితే ఈ చిత్రం విడుదల కాకూడదని అక్కడే కొందరు అనుకోవడం మొదలెట్టారని చెప్పారు. అది విని తనకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. ఆయనను రౌడీ అన్నారు ఈ చిత్రాన్ని ఎందుకు విడుదల చేయకూడదని ప్రశ్నించగా ఇది ఓ వర్గానికి అనుకూలంగా ఉందని చెప్పారు. నాయకుడు పూవై జగన్ మూర్తియార్ కథలా అనిపిస్తోందన్నారు. ఆయనను ఒక రౌడీగా అభివర్ణించినట్లు తెలిపారు. పూవై మూర్తియార్ తమను చదివించారని, ఆయన పెద్ద నాయకుడు అని, ఆయన్ని ఎలా రౌడీ అంటారని ప్రశ్నించానన్నారు. తాను ఎంత వాదించినా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు చెప్పారు. దీంతో రివైజింగ్ కమిటీకి వెళ్లి అక్కడ చెప్పిన కొన్ని మార్పులు చేసి బ్లూస్టార్ రిలీజ్ చేయగా అదిప్పుడు ప్రేక్షకుల ఆదరణ పొందుతోందన్నారు. సమైక్యతను చాటి చెప్పే చిత్రానికి సెన్సార్ సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. చదవండి: విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక -
కేజీఎఫ్ ప్రజల ప్రేమ అమోఘం: స్టార్ డైరెక్టర్
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా.రంజిత్. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రతిభావంతులైన కొత్త సంగీత కళాకారులను ప్రోత్సహించే విధంగా గత కొన్నేళ్లుగా నీలం కల్చరల్ సెంటర్ పేరుతో మార్గశిర మాసంలో పలు గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనం సంగీత కార్యక్రమాన్ని హోసూరు, చైన్నె, కేజీఎఫ్ ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేజీఎఫ్లోని నగర పరిపాలన మైదానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈనెల 28 నుంచి 30 వరకు చెన్నైలో మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ.. బుద్ధుని ఆశీస్సులతో ఈ జన సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేజీఎఫ్ ప్రజల ప్రేమాభిమానాలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు. ఇకపై కూడా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానన్నారు. సంగీత కళాకారులతో కలిసి బాబా సాహెబ్ అంబేడ్కర్ మార్గంలో మనమంతా పెద్ద విప్లవాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు దినేష్, కలైయరసన్, రచయిత తమిళ్ ప్రభ, దర్శకుడు దినకర్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై పలువురు కళాకారులు జన సంగీత కళలను ప్రదర్శించి ఆహుతులను ఆలరించారు. We are all set at kgf, come join us today and celeberate a music festival straight from the roots✨🎊🥁 Welcome you All! Entry Free! Today at 3pm. Location: Municipality Ground, Robertsonpet. Kolar Gold Fields,Karnataka.@beemji @Neelam_Culture @NeelamSocial @KoogaiThirai pic.twitter.com/qfwusQKKdB — Margazhiyil Makkalisai (@makkalisai) December 23, 2023 రు. -
తంగలాన్ గురించి బిగ్ సీక్రెట్ రివీల్ చేసిన విక్రమ్
చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ కోసం సౌత్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన తంగలాన్ టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. టీజర్లో విక్రమ్ చాలా వైల్డ్గా కనిపించాడు. ఇందులో ఎలాంటి డైలాగ్స్ లేకుండా టీజర్ను చూపించారు. కానీ యాక్షన్ సీన్స్,బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని చెప్పవచ్చు. టీజర్లో పామును పట్టుకుని చేతితోనే విక్రమ్ రెండు ముక్కలు చేస్తాడు.. ఈ సీన్ భారీగా వైరల్ అవుతుంది. టీజర్ విడుదల చేసిన తర్వాత తంగలాన్ గురించి విక్రమ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఆయన రివీల్ చేశాడు. ఈ సినిమాలో ఎక్కడా కూడా విక్రమ్కు డైలాగ్స్ ఉండవట. గతంలో శివపుత్రుడు చిత్రంలో కూడా ఆయనకు ఎలాంటి డైలాగ్స్ లేవు కానీ తన నటనతో సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లాడు. ఆ సినిమాతోనే తెలుగులో ఆయనకు క్రేజ్ పెరిగింది. టాలీవుడ్ గురించి విక్రమ్ ఇలా అన్నాడు. 'తెలుగు అభిమానులకు సినిమా అంటే ఎంత అభిమానమో నాకు తెలుసు.. కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా వారు ఆదరిస్తారు. దానికి నిదర్శనమే శివపుత్రుడు. ఆ సినిమాను వారు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నాకు ఎంతపేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తంగలాన్ కూడా అంతే పేరు తెస్తుంది. ఈ చిత్రంలో నాకు ఎలాంటి డైలాగ్స్ లేవు.. అంతా అరవడమే. దానికి కారణం ఉంది. అదేంటో సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. శివపుత్రుడు మాదిరే తంగలాన్లో కూడా ఎలాంటి డైలాగ్స్ ఉండవు.' అని విక్రమ్ తెలిపాడు. -
తంగలాన్ టీజర్.. పామును రెండు ముక్కలు చేసిన విక్రమ్
పొన్నియిన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ సిరీస్ల తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్ కోసం సౌత్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్లో ఎలాంటి డైలాగ్స్ లేకున్నా విజువల్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో దుమ్ములేపాడు. ఇందులో విక్రమ్ను చాలా భయంకరంగా చూపించారని తెలుస్తోంది. యుద్ధంలో కత్తి పట్టుకొని యోధుడిలా చేతికి దొరికిన వారందరినీ హతమారుస్తు కనిపించాడు. ఓ సీన్లో కోబ్రా లాంటి పాముని చేతపట్టుకుని రెండు ముక్కలుగా చేసి కింద పడేస్తాడు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఒక డిఫరెంట్ కథనంతో తంగలాన్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. -
విక్రమ్ తంగలాన్ అప్డేట్ వచ్చేసింది
పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రక కథా చిత్రం తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్. నటి పార్వతి, మాళవిక మోహన్, పశుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. చిత్ర పోస్టర్లను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని విక్రమ్ గెటప్ చాలా డిఫరెంట్గా ఉండి తంగలాన్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. ఇక ఈ చిత్రంపై నటి మాళవిక మోహన్ చాలా ఆశలు పెట్టుకుంది. కాగా తంగలాన్ చిత్రం అప్డేట్ను సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ వెల్లడించారు. ఆయన తన ట్విట్టర్లో తంగలాన్ సంభవం చిత్ర టీజర్ అతి త్వరలో అని పేర్కొన్నారు. ఇది విక్రమ్ అభిమానులకు తీపి వార్తే అవుతుంది. కాగా తంగలాన్ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దిగడానికి నిర్మాత సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా నటుడు విక్రమ్ నటించిన మరో చిత్రం ధృవ నక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. నటి రీతూ వర్మ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోందని తెలిసింది. -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టండి చూద్దాం? ఇలా తయారైందేంటి!
దాదాపు హీరోయిన్లు అందరూ వీలైనంత గ్లామర్ చూపించేందుకు తహతహలాడుతుంటారు. కుదిరితే సినిమాల్లో.. లేదంటే సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా బ్యూటీస్ అందరూ ఫొటోషూట్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఆ బాపతే. కాకపోతే ఆమె, ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఎక్కువసేపు సస్పెన్స్ ఉంచకుండా చెప్పేస్తున్నాం. పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరేవరో కాదు మాళవిక మోహన్. కేరళకు చెందిన ఈమె.. దాదాపు పదేళ్ల నుంచి సినిమాలు చేస్తోంది. 2013లో 'పట్టం పోలే' అనే మలయాళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అలా ఓ ఆరేళ్లపాటు మలయాళంలో మూడు, కన్నడ-హిందీలో తలో మూవీ చేసింది. 2019లో రజినీకాంత్ 'పెట్టా'లో నటించడం ఈమె కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) సూపర్స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించిన తర్వాత మాళవిక మోహనన్కు దళపతి విజయ్ 'మాస్టర్', ధనుష్ 'మారన్' చిత్రాల్లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగా ఆడినప్పటికీ ఈమెకు ఓ మాదిరి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈమె, ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. చియాన్ విక్రమ్ 'తంగలాన్'లోనూ ఈమెనే కథానాయిక. ఈ చిత్రంలోని ఈమె ఫస్ట్లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఫొటోలో మాళవికని చూస్తే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఒంటిపై పచ్చబొట్లు, చేతిలో ఓ ఆయుధం, మెడ-నడుము-తల చుట్టూ తాళ్ల లాంటివి ఉన్నాయి. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో మాళవిక.. ఆరతి అనే పాత్రలో కనిపించబోతుంది. నార్మల్గా హాట్ అండ్ గ్లామర్గా కనిపించే ఈ బ్యూటీని ఇలా మార్చేయడం చూసి ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఏదేమైనా మాళవిక లేటెస్ట్ లుక్ మాత్రం క్రేజీగా ఉంది. Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb — pa.ranjith (@beemji) August 4, 2023 (ఇదీ చదవండి: ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!) -
ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!
కోలీవుడ్ హీరో విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం 'తంగలాన్'. ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. వినూత్నమైన కథా నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మాళవిక మోహనన్ కనిపించనుండగా.. పార్వతి, పశుపతి, డేనియల్ కాల్టకిరోన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. (ఇది చదవండి: ఉప్పెన హీరోయిన్కు వేధింపులు.. ఏకంగా స్టార్ హీరో! ) అయితే ఈ ఏడాది తమిళంలో తెరకెక్కుతోన్న సినిమాల్లో భారీ అంచనాలు నెలకొన్న చిత్రమిది. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో లేదా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్లో తంగలాన్ చోటు దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నాడు. అయితే ఆస్కార్ రేసుకు సంబంధించిన ఇంకా ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు. ఆస్కార్ బరిలో నిలిచేందుకు ఈ సినిమాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం కోలార్ గోల్డ్ తవ్వకాల్లోని కార్మికులు తమ అధికారం కోసం పోరాడే నేపథ్యంలో సాగే కథా చిత్రం అన్నది తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ స్వరాలు సమకుర్చారు. (ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్తో మళ్లీ కనిపించిన హీరోయిన్!) -
పా.రంజిత్కు నేను వ్యతిరేకిని కాదు: దర్శకుడు
తాను దర్శకుడు పా. రంజిత్కు వ్యతిరేకిని కాదని దర్శక నిర్మాత మోహన్ జి పేర్కొన్నారు. ఇంతకుముందు పళయ వన్నారపేటై, ద్రౌపది, రుద్రతాండవం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం బకాసురన్. దర్శకుడు సెల్వ రాఘవన్ కథానాయకుడు. నట్టి, రాధా రవి, కే రాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఫరూక్ చాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్రం యూనిట్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సెల్వ రాఘవన్ మాట్లాడుతూ.. ప్రతిభ లేకపోతే ఎవరూ కథానాయకులుగా సక్సెస్ కాలేరన్నారు. మోహన్ జి కఠిన శ్రమజీవి, ప్రతిభావంతుడు అని, సినిమాపై ఎంతో మర్యాద, నమ్మకం కలిగిన మంచి దర్శకుడు అని ప్రశంసించారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన దర్శకుడు మోహన్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. చిత్ర దర్శక నిర్మాత మోహన్.జీ మాట్లాడుతూ.. బకాసురం చిత్రం చాలా మంది ప్రశంసించారని, అందుకు తనతోపాటు పనిచేసిన అందరూ కారణమని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్, చాయాగ్రాహకుడు ఫరూక్ ముఖ్యమైన వారన్నారు. సెల్వ రాఘవన్ సైలెంట్గా ఉంటారని.. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని తెలిపారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను సెల్వరాఘవన్ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన కాదల్ కొండేన్ చిత్రాన్ని చూసిన తర్వాతే తనకు దర్శకుడు కావాలన్న కోరిక కలిగిందని చెప్పారు. లేకపోతే తాను ఒక వర్గానికి సంబంధించిన కథా చిత్రాలనే చేస్తానని ప్రచారం ఉందన్నారు. అందుకోసం తాను సినిమాలోకి రాలేదని స్పష్టం చేశారు. దర్శకుడు పా.రంజిత్ బడుగు వర్గాల ఇతివృత్తాలతోనూ, తాను ఓబీసీ ప్రజల కోసం చిత్రాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, అయితే సినీ పరిశ్రమలో తాను ఎవరిని వ్యతిరేకులుగా భావించడం లేదని, ముఖ్యంగా దర్శకుడు పా.రంజిత్కు తాను వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు. బకాసురన్ అందరి చిత్రం అని దర్శక నిర్మాత మోహన్.జి పేర్కొన్నారు. చదవండి: నా మనసు నిండా, ప్రతి ఆలోచనలోనూ నువ్వే.. శృతిహాసన్ పోస్ట్ వైరల్ -
మరో విభిన్నమైన పాత్రలో విక్రమ్.. మేకప్కే 4 గంటలు!
ఎంచుకునే పాత్రల్లో వైవిధ్యం చూపించ డానికి హీరో విక్రమ్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. సరికొత్త పాత్రలను చాలెంజ్గా తీసుకుని ఎంతో కష్టపడుతుంటారు. ‘శివపుత్రుడు’, ‘ఐ’, ‘కోబ్రా’ వంటి సినిమాల్లో విక్రమ్ చేసిన పాత్రలే ఇందుకు ఉదాహరణ. కాగా ప్రేక్షకులను మరోసారి అబ్బురపరిచేందుకు విక్రమ్ మరో సవాల్లాంటి ΄ాత్ర చేస్తున్నారు. విక్రమ్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. పీరియాడికల్ ఫిల్మ్గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాత్ర కోసం విక్రమ ప్రోస్థటిక్ మేకప్ వేసుకుంటున్నారు. ఈ మేకప్కి నాలుగు గంటలు పడుతోందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. తదుపరి షెడ్యూ ల్ను కర్ణాటకలో ప్లాన్ చేశారు. పార్వతీ మీనన్, మాళవికా మోహనన్, పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. -
అవన్ని పుకార్లే.. ఒక్క పోస్ట్తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
తమిళసినిమా: ఇప్పుడున్న హీరోయిన్లు హీరోలకు ఏమాత్రం తగ్గడం లేదు. చాలా వరకు గ్లామర్ పాత్రలకు పరిమితమైన హీరోయిన్లు ఇప్పుడు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందు కోసం రిస్క్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇటీవల యశోద చిత్రం కోసం నటి సమంత చాలా రిస్కీ ఫైట్స్లో నటించారు. అదే విధంగా ఇండియన్–2 చిత్రం కోసం నటి కాజల్ అగర్వాల్ గుర్రపు స్వారి, కత్తి సాము వంటి విద్యల్లో శిక్షణ పొందారు. నటి మాళవిక మోహన్ కూడా ఇప్పుడు అదే బాట పట్టింది. పా .రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తంగలాన్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రాచీన కథాంశాలతో కూడిన చిత్రంలో మాళవిక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈమె నటన దర్శకుడు పా.రంజిత్కు సంతృప్తి కలిగించలేదని, దీంతో ఆమెను చిత్రం నుంచి తొలగించాలన్న ఆలోచనతో ఉన్నట్టు ఇటీవల వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. కారణం తంగలాన్ చిత్రంలోని తన పాత్ర కోసం నటి మాళవిక మోహన్ సిలంబాట్టం అనే ప్రాచీన ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతోంది. తను శిక్షణ పొందుతున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేసింది. అందులో సిలంబం అనే అద్భుతమైన ప్రపంచంలోకి తొలి అడుగు వేశానని నటి మాళవిక మోహన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) చదవండి: మాజీ దంపతులు ఐశ్వర్య-ధనుష్ తనయులతో సరదాగా రజనీ, ఫొటో వైరల్ పెళ్లయిన డైరెక్టర్ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు -
ఆ హీరోయిన్ విషయంలో తప్పు చేసినట్లు ఫీలవుతున్న డైరెక్టర్
తమిళసినిమా: బహుభాషా నటిగా రాణిస్తున్న మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహన్. మలయాళంలో కథానాయికగా పరిచయమైన ఈమె రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో శశికువర్కు భార్యగా నటించిన మాళవిక మోహన్ నటనకు ప్రశంశలు లభించాయి. ఆ తర్వాత విజయ్తో మాస్టర్ చిత్రంలో నటింంది. ఆచిత్రంలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా హిట్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ధనుష్ సరసన మారన్ చిత్రంలో నటింంది. అలాంటిది తాజాగా విక్రమ్కు జంటగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇందులో ముఖ్యపాత్రల్లో పార్వతి, నటుడు పశుపతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆ మధ్య ప్రారంభమైంది. కాగా ఈ చిత్రం విషయంలోనే నటి వళవిక మోహన్ గురించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సాధారణంగా దర్శకుడు పా.రంజిత్ చిత్రాల్లో కథానాయికలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇక తాజా చిత్రం తంగలాన్ను చారిత్రక కథా నేపథ్యంలో రూపొందిస్తున్నారు. కాగా ఇందులో నటి మాళవిక మోహన్ నటన సంతృప్తి కలిగించడం లేదని, దీంతో పొరపాటున ఆమెని ఈ చిత్రానికి ఎంపిక చేశామా? అంటూ ఆయన తల కొట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెను చిత్రం నుంచి తొలగించాలనే ఆలోచన వచ్చినట్లు, ఆ పాత్రకు మరో నటిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు టాక్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. వాస్తవం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. -
బాలీవుడ్లో దూసుకెళ్తున్న కోలీవుడ్ డైరెక్టర్స్.. స్టార్ హీరోలతో సినిమాలు!
బాలీవుడ్ హీరోలు కొందరు తమిళం నేర్చుకునే పనిలో ఉన్నారు. కానీ వారు తమిళ సినిమాల్లో నటించడం లేదు. మరి ఎందుకు భాష నేర్చుకుంటున్నారంటే తమిళ దర్శకులతో సెట్స్లో కమ్యూనికేషన్ కోసం అన్నమాట. ఎందుకంటే ఆ తమిళ దర్శకులతో ఈ హీరోలు ‘వాంగ వణక్కం’ (రండి.. నమస్కారం) అంటూ హిందీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్లు–బాలీవుడ్ హీరోల కాంబినేషన్ చిత్రాల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ ప్రస్తుతం మూడు (పఠాన్, జవాన్, డంకీ) సినిమాలు చేస్తున్నారు. వీటిలో ‘జవాన్’ సినిమాకు అట్లీ దర్శకుడు. తమిళంలో ‘రాజా రాణి’, ‘తేరి’, ‘మెర్సెల్’, ‘బిగిల్’ వంటి హిట్ చిత్రాలను అట్లీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హిందీలో అట్లీకి ‘జవాన్’ తొలి చిత్రం. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా అగ్రతార నయనతార నటిస్తున్నారు. హిందీలో నయనతారకు కూడా ‘జవాన్’ తొలి చిత్రం కావడం ఓ విశేషం. ‘జవాన్’ చిత్రం వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ కానుంది. (చదవండి: మారుతి, ప్రభాస్ సినిమా షురూ.. టైటిల్ ఇదేనా?) ఇంకోవైపు తమిళ దర్శకుడు శంకర్తో సినిమాకి సై అన్నారు రణ్వీర్ సింగ్. 2005లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) మంచి విజయం సాధించింది. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లుగా ప్రకటించారు దర్శకుడు శంకర్. ఈ సినిమా షూటింగ్ ఈపాటికే ఆరంభం కావాల్సింది కానీ ‘అన్నియన్’ హిందీ రీమేక్ హక్కుల విషయంలో చిన్న వివాదం నడుస్తోంది. ప్రస్తుతం కమల్హాసన్తో శంకర్ ‘ఇండియన్ 2’, రామ్చరణ్తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చాక శంకర్ ‘అన్నియన్’ హిందీ రీమేక్ను ఆరంభిస్తా రని ఊహించవచ్చు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత హిందీలో శంకర్ చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ‘ఒకే ఒక్కడు’ని హిందీలో ‘నాయక్’ (2001)గా తెరకెక్కించారు శంకర్. ఇక 2017లో విడుదలైన ‘విక్రమ్ వేదా’ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. పుష్కర్–గాయత్రి ద్వయం ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ అయ్యింది. సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించారు. తమిళ ‘విక్రమ్ వేదా’కు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే హిందీ రీమేక్నూ తెరకెక్కించారు. పుష్కర్– గాయత్రి ద్వయానికి హిందీలో ఇదే తొలి సినిమా. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల కానుంది. మరోవైపు తక్కువ టైమ్లో కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ హిందీలో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్తో లోకేశ్ కనగరాజ్ ఓ సినిమా (తమిళ సినిమా ‘మాస్టర్’ హిందీ రీమేక్) చేయాల్సింది. కానీ కుదర్లేదు. అయితే సల్మాన్తో లోకేశ్ వేరే ఓ సినిమా చేయనున్నారని కోలీవుడ్ టాక్. ఇంకోవైపు రజనీకాంత్తో ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పా. రంజిత్ హిందీలో ఓ సినిమా కమిట్ అయ్యారు. జార్ఖండ్కు చెందిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ‘జై భీమ్’ సినిమాతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ రాజా హిందీలో ఓ సినిమా చేయనున్నారు. ‘దోసా కింగ్’గా చెప్పుకునే పి. రాజగోపాల్ జీవితంలోని ముఖ్య ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. రాజగోపాల్, జీవ జ్యోతి శాంతకుమార్ల కోర్టు కేసు ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందనుంది. వీరితోపాటు మరికొందరు తమిళ దర్శకులు హిందీలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
స్కిన్ షోలతో అవకాశాలు పొందడం ఇష్టం లేదు: హీరోయిన్
నేటితరం హీరోయిన్లు అవకాశాలు పొందాలన్నా, కెరీర్ నిలబెట్టుకోవాలంటే వారి ముందున్న ఒకే ఒక ఆప్షన్ గ్లామర్.. స్టార్ హీరోయిన్లు సైతం స్కిన్ షోలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే యువనటి దుషారా స్కిన్ షోలతో అవకాశాలు పొందడం తనకు ఇష్టం లేదని, అలాగని తాను గ్లామర్కు వ్యతిరేకిని కాదని అంటోంది. బోదై ఏరి బుద్ధి మారి చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈ అచ్చ తమిళ ఆడపడుచు తొలి చిత్రంతోనే తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో ఆర్యకు జంటగా సర్పట్ట పరంపరై చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్రంలో పల్లెటూరి యువతిగా పరిణితి చెందిన నటనతో మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు పా.రంజిత్ దర్శకత్వంలో రెండోసారి నటించే లక్కీ ఛాన్స్ను దక్కించుకుంది. అదే నచ్చత్తిరం నగర్గిరదు నీలం ప్రొడక్షన్స్, యాళ్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాళిదాస్ జయరాంకు జంటగా దుషారా నటించింది. తెన్మా సంగీతం అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 31వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి దుషారాతో సాక్షి ముచ్చటించింది. ఆమె మాట్లాడుతూ పా.రంజిత్ దర్శకత్వంలో రెండోసారి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. ఆయన చిత్రాల్లో కథానాయికలకు నటించడానికి అవకాశం ఉంటుందని చెప్పింది. నచ్చిత్తిరం నగర్గిరదు చిత్రంలో తనది చాలా ధైర్యం కలిగిన యువతి పాత్ర అని, సమకాలీన రాజకీయాలతో కూడిన ప్రేమ కథా చిత్రమని తెలిపింది. ముఖ్యంగా లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ అంశాలను చర్చించే విభిన్న కథాచిత్రమని చెప్పింది. ఇందులో కాళిదాస్ జయరాంతో నటించడం మంచి అనుభవం, ఇద్దరం పోటీ పడి నటించినట్లు తెలిపింది. తనకు చాలెంజింగ్ రోల్ పాత్రలో నటించడం చాలా ఇష్టమని పేర్కొంది. ఎన్ని చిత్రాలు చేశాం అనే దాని కంటే ఎన్ని మంచి పాత్రలు చేశామన్నదే తనకు ముఖ్యమని అంటోంది ఈ ముద్దుగుమ్మ. -
శిష్యులకు దారిచూపుతున్న స్టార్ డైరెక్టర్.. సొంత సంస్థలో..
తమిళ సినిమా: సామాజిక అంశాలను ఇతివృత్తంగా చిత్రాలు తెరకెక్కించడంలో దర్శకుడు పా రంజిత్ దిట్ట. నీలం ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించి తన శిష్యులకు దర్శకులుగా అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నీలం ప్రొడక్షన్స్, లెమన్ లీఫ్ క్రియేషన్స్ సంస్థ అధినేత గణేశమూర్తితో కలిసి ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు అశోక్ సెల్వన్, శాంతను భాగ్యరాజ్, పృథ్వీ పాండియరాజన్, కీర్తి పాండియన్, దివ్య దురైస్వామి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా పా.రంజిత్ శిష్యుడు జైకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు వివరిస్తూ.. క్రికెట్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. స్నేహానికి ప్రాధాన్యతను ఇస్తూ కమర్షియల్ అంశాలతో కూడిన ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. చిత్ర షూటింగ్ను అరక్కోణం పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. గోవింద్ వసంత సంగీతం, తమిళగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చదవండి: Prabhas: ప్రభాస్ సినిమాకు నిర్మాత మారనున్నాడా? -
ఓటీటీలో రిలీజ్ కానున్న అమలాపాల్ విక్టిమ్
వినూత్న ప్రయోగాత్మక చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తరువాత నిర్మాతలకు మరింత లిబర్టీ లభిస్తుందనే చెప్పాలి. దర్శకుల భావాలను స్వేచ్ఛగా ఆవిష్కరించే అవకాశం లభిస్తోంది. ఆ విధంగా రూపొందుతున్న వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఒక సరికొత్త ప్రయోగమే విక్టిమ్ వెబ్ సిరీస్. నాలుగు ఎపిసోడ్స్తో రూపొందిన ఈ ఆంథాలజీ సిరీస్ను నలుగురు ప్రముఖ దర్శకులు రూపొందించడం విశేషం. ఒకే కాన్పెప్ట్ను నలుగురు దర్శకులు కలిసి తెరకెక్కించారు. దర్శకుడు వెంకట్ ప్రభు కన్ఫెషన్ పేరుతోనూ, పా.రంజిత్ దమ్మమ్ పేరుతోనూ, శింబుదేవన్ మొట్టై మాడి సిద్ధర్ పేరుతోనూ, ఎం.రాజేష్ విరాజ్ పేరుతోనూ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఫైనల్గా విక్టిమ్ పేరుతో రిలీజవుతోంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకులు వెంకట్ ప్రభు, పా.రంజిత్, సింబుదేవన్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ముందుగా దర్శకుడు శింబుదేవన్ మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. దానికి రూపమే ఈ వెబ్ సిరీస్ అని తెలిపారు. దర్శకులు అందరం మాట్లాడుకుని ఒకే కాన్సెప్ట్ తమ ఆలోచనల మేరకు రూపొందించాలని అనుకున్నామన్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా సాగే సిరీస్ అని, ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అవుతారని పేర్కొన్నారు. పా.రంజిత్ మాట్లాడుతూ ఈ కాన్సెప్ట్ గురించి తనకు చెప్పగానే తాను నిజ జీవితంలో చూసిన సంఘటనకు దగ్గరగా ఉందని భావించానన్నారు. తాను రూపొందించిన దమ్మమ్ ప్లాట్ తనను నిజజీవితంలో ఇన్స్పైర్ చేసిన సంఘటన అని తెలిపారు. కాగా ఇందులో నటుడు ప్రసన్న, ప్రియా భవాని శంకర్, అమలాపాల్, నట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: స్టార్ హీరోకు ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే! వచ్చే నెల నుంచి కొత్త వీపీఎఫ్ చార్జీలు అమలు! -
కేజీయఫ్ 3లో ‘రాఖీభాయ్ ’కాకుండా మరో హీరో!
కేజీయఫ్ అనగానే కళ్లముందుకు రాఖీభాయ్ వచ్చేస్తాడు. సలాం రాఖీభాయ్ అనే కటౌట్ కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో హై వోల్డేజ్ ఎలివేషన్స్ కనిపిస్తాయి. ఇప్పటికీ రెండు భాగాలు వస్తే.. రెండింటినీ సూపర్ డూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. కేజీయఫ్2 అయితే ఊహించని స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టింది. ఇదే జోష్తో దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ హీరో యశ్ మూడో భాగాన్ని తీసుకొస్తారని కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు కేజీయఫ్ ఫ్యాన్స్. ఈసారి రాఖీ భాయ్ మరింత రెచ్చిపోతాడని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కేజీయఫ్3 లో రాఖీభాయ్ కాకుండా మరో హీరో నటించబోతున్నాడు. పార్ట్ 3లోకి చియాన్ విక్రమ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్ గా తమిళ దర్శకుడు పా. రంజిత్ తో కొత్త సినిమాను ప్రారభించాడు విక్రమ్. త్రీడీ ఫార్మాట్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 1800 సంవత్సరంలో దళితులపై జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది. అది సరే, ఈ సినిమాకు, కేజీయఫ్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా... ఇండిపెన్డెన్స్కు ముందు నరాచిలో జరిగిన ఆచారకాలపైనే పా.రంజిత్ దృష్టిపెడుతున్నాడని సమాచారం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది ప్రశాంత్ నీల్ చూపించాడు. ఇప్పుడు స్వాతంత్య్రం రాకముందు కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది పా.రంజిత్ చూపించబోతున్నాడట. (చదవండి: పుష్ప-2లో పాపులర్ బాలీవుడ్ నటుడు) మరోవైపు కేజీయఫ్ 3 పై ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. త్వరలోనే పార్ట్ 3తో తిరిగొస్తామని అభిమానులకు మాట ఇచ్చాడు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. ముందు ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత టైగర్ తో ప్లాన్ చేస్తోన్న మూవీ కంప్లీట్ కావాలి. ఆ తర్వాతే కేజీయఫ్ 3 తీసుకొస్తానంటున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ లోపే విక్రమ్ కేజీయఫ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. -
క్రేజీ కాంబినేషన్.. ‘విక్రమ్ 61’ ప్రారంభం
తమిళసినిమా: చియాన్ విక్రమ్, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్లో భారీ చిత్రం శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం విక్రమ్కు 61వ సినిమా కానుంది. దీనిని స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా, నీలం ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఇది స్టూడియో గ్రీన్ సంస్థ 22వ చిత్రం. ఇంకా టైటిల్ నిర్ణయించని దీనికి కథ, కథనాన్ని తమిళ్ ప్రభ అందించారు. జి.ప్రకాష్కుమార్ సంగీతాన్ని, కిషోర్కుమార్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాల్లో నటుడు శివకుమార్, ఆర్య, నిర్మాత టి.శివ, ఎస్.ఆర్.ప్రభు, అభినేష్ ఇళంగోవన్, సంతోష్ పి.జయకుమార్, సీవీ కుమార్ హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన కోబ్రా ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. తదుపరి మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్ తొలి భాగం సెప్టెంబర్ 30న తెరపైకి రానుంది. చదవండి: Aaditi Pohankar: ఒకప్పుడు రాష్ట్రస్థాయి అథ్లెట్.. ఇప్పుడు స్టార్ నటి.. -
పా. రంజిత్ డైరెక్షన్లో విక్రమ్ సినిమా.. త్రీడిలోనూ చిత్రీకరణ
Chiyaan 61: Vikram And Pa Ranjith Movie In 3D Version: విభిన్నమైన పాత్రలతో, సినిమాలతో అటు కోలీవుడ్నే కాకుండా ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో చియాన్ విక్రమ్. వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ అందులో జీవించేస్తారు. ఇటీవల కొడుకు ధ్రువ్తో కలిసి మహాన్ మూవీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్ 'కోబ్రా', 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1' సినిమాల్లో నటిస్తున్నారు. ఇవే కాకుండా విక్రమ్ హీరోగా మరో క్రేజీ సినిమా రానుంది. దర్శకుడు పా. రంజిత్ కాంబినేషన్లో విక్రమ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్ను ఈ నెలలోనే ఆరంభించాలనుకుంటున్నారు. 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట. ఈ సినిమాను దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంతేకాదు.. త్రీడీ వెర్షన్ను కూడా చిత్రీకరించాలనే యోచనలో ఉన్నట్లు చిత్రనిర్మాత జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్లోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని కూడా జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు. చదవండి: తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. టైటిల్ ఫిక్స్ నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్ -
‘విరాట పర్వం’ మూవీపై తమిళ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్టాక్తో దూసుకుపోతుంది. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం కావడంతో ప్రేక్షకులను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది. అందులోనే 1990లో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన సరళ అనే యువతి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా విరాట పర్వం రూపొందింది. చదవండి: ‘విక్రమ్’ మూవీలో విలన్స్తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా? రానా కామ్రేడ్ రవన్న పాత్ర పోషించగా.. సాయి పల్లవి లీడ్రోల్లో కనిపించింది. ఇక ప్రియమణి, నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో రానా, సాయి పల్లవిల నటలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలు ఈ మూవీని కొనియాడారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ సైతం విరాట పర్వం మూవీపై స్పందించడం విశేషం. ప్రముఖ తమిళ డైరెక్టర్ పా రంజిత్ సోషల్ మీడియా వేదికగా విరాట పర్వం మూవీపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో విరాట పర్వం అత్యుత్తమైంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు ప్రశంసలకు అర్హులు. రానా వంటి స్టార్ హీరో ఇలాంటి పాత్రను అంగీకరించి చేసినందుకు అతడిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఇక సాయి పల్లవి అయితే చాలా అద్భుతంగా నటించింది. ఇలాంటి మంచి సినిమాను అందించిన మూవీ టీమ్కు స్పెషల్ థ్యాంక్స్’ అంటూ రాసుకొచ్చాడు. కాగా, విరాట పర్వం చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబులు సంయుక్తంగా నిర్మించారు. #Viraataparvam is the best Telugu film I've watched in recent times. Producers & dir @venuudugulafilm deserve much appreciation for making this film without any compromises.Special appreciations to @RanaDaggubati for accepting &doing this role & @Sai_Pallavi92 has done superbly👏 — pa.ranjith (@beemji) June 19, 2022 -
సార్పట్టా డైరెక్టర్తో విక్రమ్ సినిమా.. స్టోరీ లైన్ అదే
నటుడు విక్రమ్, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందబోతున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్ నటించిన కోబ్రా, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న భారీ చిత్రంలో విక్రమ్ నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా పా.రంజిత్ ప్రస్తుతం ‘‘నక్షత్రం నగర్గిరదు’’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే విక్రమ్ హీరోగా నటించే చిత్రం ప్రారంభం కానుంది. పా.రంజిత్ ఇంతకుముందు ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సార్పట్టా పరంపరై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విక్రమ్ హీరోగా రూపొందించనున్న చిత్రం కూడా పూర్తిగా క్రీడా నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. దీనికి మైదానం అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. -
దళిత రచనలతోనే సినీ ప్రయాణం ప్రారంభించాను: పా.రంజిత్
సాక్షి, చెన్నై: దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని దర్శక, నిర్మాత పా.రంజిత్ పేర్కొన్నారు. తన చిత్రాల ద్వారా సమాజంలోని అసమానతలు, అణగారిన జీవితాలను ఆవిష్కృతం చేసే దర్శకుడీయన. అలా తనకంటూ ప్రత్యేక బాటను ఏర్పరచుకుని సక్సెస్ఫుల్గా పయనిస్తున్న పా.రంజిత్ తన నీలం ఫౌండేషన్ ద్వారా ఏప్రిల్ నెల అంతా దళిత చరిత్ర మాసం పేరుతో చెన్నైలో సాంస్కృతిక కళలు, ఫొటో ఎగ్జిబిషన్, చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అందులో భాగంగా మదురైలో శుక్ర, శనివారాల్లో దళితుల రచయితల కోసం దళిత సాహితీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని తెలిపారు. దళితుల ఉన్నతికి దళిత సాహితీవేత్తలే దిశా నిర్దేశం చేశారని పేర్కొన్నారు. 1990 ప్రాంతంలో దళిత సాహిత్యం మొదలైనప్పుడు పలు ప్రశ్నలు ఎదురయ్యాయని అన్నారు. ఇప్పుడు దళిత సాహిత్యం ఎంతో అభివృద్ధి చెందిందని పా.రంజిత్ పేర్కొన్నారు. -
మీడియా సమావేశంలో రైటర్ చిత్ర యూనిట్
చెన్నై సినిమా: తన భావాలతో ఏకీభవిస్తేనే ఎవరికైనా తన కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని దర్శక నిర్మాత పా.రంజిత్ అన్నారు. 'అట్టకత్తి'తో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత మద్రాస్, కబాలి, కాలా, సర్పట్టా వంటి విజయవంత చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే విధంగా నిర్మాతగానూ నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నవ దర్శకులకు అవకాశం కల్పిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను నిర్మిస్తున్నారు. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రాటీయో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం 'రైటర్'. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఇనియా నాయికగా నటించారు. ఈ చిత్రం ద్వారా ఫ్రాంక్లిన్ జాకోబ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోవింద్ వసంత సంగీతాన్ని అందించిన 'రైటర్' చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియో సమావేశంలో పా.రంజిత్ మాట్లాడుతూ.. సమాజంలోని సమస్యలను ఆవిష్కరించే విధంగా తన చిత్రాలు ఉంటాయన్నారు. -
ఏమ్మా నీకు అంత పొగరా? అడగడంతో ఖంగుతిన్నా..
సాక్షి, చెన్నై: ఏమ్మా నీకు అంత పొగరా? అని అడగడంతో ఖంగుతిన్నానని చెప్పారు సార్పట్ట కథానాయిక దుషారా విజయన్. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘దిండుగల్ జిల్లా కన్యాపురం గ్రామానికి చెందిన నేను ప్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో బోదై ఏరి బుద్ధిమారి చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాను. ఐదేళ్ల కష్టానికి ఫలితంగా పా.రంజిత్ దర్శకత్వంలో సార్పట్ట చిత్రం అవకాశం వచ్చింది. ఓ రోజు రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మరుసటిరోజు ఆఫీసుకు రావాల్సిందిగా చెప్పారు. అయితే నేను ఆ ఫోన్కాల్ను నమ్మలేదు. రెండో రోజు మళ్లీ పోన్ చేసి నీకు అంత పొగరా? పా.రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే రాలేదే అని ప్రశ్నించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాను. అడిషన్లో సెలెక్ట్ కావడంతో నటించే అవకాశం లభించింద’ని చెప్పుకొచ్చారు. -
‘సార్పట్ట’ మూవీ రివ్యూ
టైటిల్ : సార్పట్ట జానర్ : పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : ఆర్య, దుషారా విజయన్, పశుపతి, అనుపమ కుమార్, జాన్ కొక్కెన్ తదితరులు నిర్మాణ సంస్థలు : నీలం ప్రొడక్షన్స్, కె9 స్టూడియో నిర్మాతలు : షణ్ముగం దక్షన్ రాజ్ దర్శకత్వం : పా.రంజిత్ సంగీతం : సంతోష్ నారాయణ్ సినిమాటోగ్రఫీ : మురళి.జి ఎడిటర్ : సెల్వ ఆర్.కె విడుదల తేది : జూలై(22), 2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) సూపర్ స్టార్ రజనీకాంత్తో ‘కబాలి’, ‘కాలా’లాంటి చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ పా.రంజిత్. వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్, కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆర్య. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘సార్పట్ట’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? బాక్సర్గా ఆర్య ఎలా నటించాడు? ఈ చిత్రంతోనైనా పా.రంజిత్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడా? లేదా? రివ్యూలో చూద్దాం. కథ ఈ సినిమా కథ అంతా ఎమర్జెన్సీ కాలం(70వ దశకం)లో నడుస్తుంది. ఉత్తర చెన్నైలోని ఓ హార్బర్లో హమాలి కూలీగా పనిచేసే సమర అలియాస్ సామ్రాజ్యం(ఆర్య)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్కి డుమ్మా కొట్టి మరీ బాక్సింగ్ పోటీలు చూడడానికి వెళ్లేవాడు. కొడుకు బాక్సింగ్ పోటీలకు వెళ్లడం మాత్రం తల్లి భాగ్యం(అనుపమ కుమార్)కు అస్సలు నచ్చదు. కానీ సమర మాత్రం తల్లి కళ్లు కప్పి బాక్సింగ్ పోటీలను చూసేందుకు వెళ్లేవాడు. కట్ చేస్తే.. ఒకరోజు బాక్సింగ్ క్రీడకు మారుపేరైన సర్పట్టా, ఇడియప్ప మధ్య జరిగిన బాక్సింగ్ పోటీలో సార్పట్ట ఓడిపోతుంది. దీంతో సార్పట్ట తరపున బాక్సింగ్ చేసి గెలుస్తానని సమర ప్రత్యర్థులకు సవాల్ విసురుతాడు. తన తల్లి మాటను పక్కన పెట్టి ఇడియప్ప పోటీదారైన వేటపులి(జాన్ కొక్కెన్)తో పోటీ పడేందుకు సిద్దమవుతాడు. అసలు సమర బాక్సర్ అవడానికి అతని తల్లికి ఎందుకు ఇష్టం లేదు? బాక్సింగ్ బరిలోకి దిగిన సమరకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమింగే గురువు రంగా కోసం సమర ఎలాంటి సహసం చేశాడు? బాక్సింగ్ పోటీల్లో రారాజుగా వెలుగొందుతున్న వేటపులిని సమరా ఓడించాడా? లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు బాక్సర్గా ఆర్య అద్భుతంగా నటించాడు. సమర పాత్ర కోసం ఆర్య పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. బాక్సింగ్పై ఇష్టం ఉన్న యువకుడిగా, తల్లిమాటని జవదాటని కొడుకుగా తనదైన యాక్టింగ్తో అదరగొట్టేశాడు. అలాగే చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తిగాను ఆకట్టుకునే నటనను కనబరిచాడు. ఇక ఆర్య తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర పశుపతిది. గురువు రంగా అలియాస్ రంగయ్య పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమాకు ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. సమర భార్య పాత్రలో దుషారా విజయన్ సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంది. వేటపులిగా జాన్ కొక్కెయ్ అదరగొట్టేశాడు. డాడీ పాత్రలో జాన్ విజయ్ అలరించాడు. అనుపమ కుమార్, షబ్బీర్ తదితురలు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ క్రీడా నేపథ్య చిత్రాలు ఇండియాలో ఇప్పటికే చాలా వచ్చాయి. ఆ కథలన్నింటిని ఒక్కసారి పరిశీలిసే.. ముందుగా హీరో సాధారణ వ్యక్తిగా ఉంటాడు. అతనిపై ఎవరికి ఎలాంటి అంచానాలు ఉండవు. కానీ ఏదో ఒక సంఘటన వల్ల హీరో ఆ క్రీడా రంగంలోకి సడెన్గా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు అతనిలోని మరో కోణం బయటపడుతుంది. ఒక ప్లాష్బ్యాక్... లక్ష్యం వెళ్తున్న హీరోకి అడ్డంకులు, చివరకు హీరో విజయం. ఇదే ప్రతి సినిమా నేపథ్యం. ‘సార్పట్ట’కూడా కొంచెం అటు,ఇటుగా అలాంటి కథే. బాక్సింగ్కి 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను జోడించి చెప్పడం ఈ సినిమా స్పెషల్. అప్పటి బాక్సింగ్ సంస్కృతి ఎలా ఉండేదో తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు పా.రంజిత్. ఇతర విషయాల జోలికి వెళ్లకుండా నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు. బాక్సింగ్ అంటే ఇష్టపడే ఒక యువకుడు తల్లి కోసం ఆ ఆటకు దూరంగా ఉండటం, అనుకోని సంఘటన వల్ల బాక్సర్గా మారి, ప్రత్యర్థులు చేసే కుట్రలను తిప్పికొడుతూ గురువుగారి మాట నిలబెట్టటం తదితర సన్నివేశాలను ఆసక్తిగా తీర్చిదిద్దాడు. అయితే క్రీడా నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ‘భావోద్వేగం’అతి ముఖ్యమైనది. అదే సినిమా జయాపజయాలను నిర్ణయిస్తాయి. సార్పట్టలో ఆ ‘ఎమోషన్’మిస్సయింది. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కూడా పెద్దగా లేవు. సినిమా ఆరంభంలో కాస్త ఆసక్తికరంగానే అనిపించినా... కథలో, పాత్రల్లో ఒక నిలకడ లేకపోవడం ప్రతికూల అంశమే.సెకండాఫ్లో సాగదీత సీన్స్ సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తాయి. అలాగే ఒక్కసారి కూడా బాక్సింగ్ కోచింగే తీసుకొని హీరో.. ఉన్నట్లుండి గ్లవ్స్ వేసుకొని అత్యుత్తమ బాక్సర్ని చితక్కొట్టడం కొంచెం అతిగా అనిపిస్తుంది. అన్నింటికీ మించి తెలుగు ప్రేక్షకులు ఇది మన సినిమా అని ఫీలయ్యే అవకాశం ఎక్కడా లేదు. కానీ ‘కబాలి’,‘కాలా’లాంటి విభిన్న చిత్రాలను అందించిన పా.రంజిత్.. ఈ సారి భిన్నంగా స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకొని, దానికి పీరియాడికల్ టచ్ ఇచ్చి తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఇక సాంకెతిక విషయానివస్తే.. స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని లీనం చేయడంలో నేపథ్య సంగీతాన్ని కీలక పాత్ర. ఆ విషయంలో సంతోష్ నారాయణ్ సక్సెస్ అయ్యాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కానీ పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. మురళి.జి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన లోపం సెల్వ ఆర్.కె ఎడిటింగ్. సెకండాఫ్లో చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫస్టాఫ్లో ఉన్న జోష్.. సెకండాఫ్లో ఉంటే ‘సార్పట్ట’ మరోస్థాయిలో ఉండేది. మొత్తంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి ‘సార్పట్ట’నచ్చుతుంది. ప్లస్ పాయింట్స్ ఆర్య, పశుపతి నటన నేపథ్య సంగీతం దర్శకత్వం ఫస్టాప్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్లోని సాగదీత సీన్స్ సినిమా నిడివి ఊహకందే క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement