breaking news
vehicle thief
-
వాహనాల దొంగ అరెస్ట్
మరిపెడ : వాహనాలను చోరీ చేసిన దొంగను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ రాజమహేందర్నాయక్ తెలిపారు. స్థానిక పీఎస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన చోరీకి సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. మరి పెడ మండల కేంద్రానికి చెందిన అక్కినపల్లి విజయ్కుమార్ వివిధ ప్రాంతాల నుంచి 16 ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. మరిపెడ ఎస్సైలు నరేష్, నందీలు శనివారం ఉద యం మండల కేంద్రంలోని రాజీవ్గాంధీ విగ్రహం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో విజయ్ కుమార్ గ్లామర్ వాహనంపై తడబడుతూ కనిపించాడు. అప్రమత్తమై న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మరో 15 వా హనాలు చోరీ చేసినట్లు వెల్లడించా డు. దీంతో ఆ వాహనాలను అతడి ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. 16 వాహనాలకు ఒకే తాళం.. చోరీ చేసిన వాహనాలన్నింటికి నిం దితుడు ఒకే తాళం ఉపయోగించినట్లు డీఎస్పీ తెలిపారు. విజయ్కుమార్ గతంలో ద్విచక్రవాహన మెకానిక్గా పనిచేశాడు. అతడు ఏ ద్విచక్ర వాహనం తాళమైనా తీసేటట్లు ఓ తాళం చెవిని సృష్టించి ఈ చోరీలకు పాల్పడ్డాడు. మరిపెడ ప్రాంతంలో ఇంతపెద్ద ఎత్తున వాహనాలు దొరకడం ఇదే ప్రథమం. ఈ బైక్లను మరిపెడ మండలంతోపాటు పాటు తొర్రూరు, కురవి, కొడకండ్ల మండలాలతోపాటు ఖమ్మం జిల్లా కేంద్రం లో వాహనాలు దొంగిలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఎస్సైలను అభినందించిన ఎస్పీ.. ఒక్కరోజులోనే నిందితుడితోపాటు 16 వాహనాలు స్వాధీనం చేసుకున్న సీఐ శ్రీనివాస్తోపాటు ఎస్సైలు నరేష్, నం దీప్, ఏఎస్సై రాంజీ, హెడ్కానిస్టేబుల్ చంద్రయ్య, అఫ్జల్, బిచ్చానాయక్, పీసీలు సమ్మలాల్, కరుణాకర్, శంకర్, రమేష్ తదితరులను ఎస్పీ అభినందించారని, వారికి రి వార్డులు అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
ముగ్గురు వాహన దొంగలు అరెస్టు
- 15 బైక్ లు స్వాధీనం విజయవాడ ద్విచక్ర వాహనా చోరీలకు పాల్పడుతునన ముగ్గురు దొంగలను విజయవాడ నగరంలో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగరంలో ద్విచక్ర వాహనాల మాయంపై ఫిర్యాదులు పెరుగుతుండడంతో కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల సందర్భంగా బొండు నాగ మోహన్ (40), కిరణ్(19)తోపాటు ఓ జువైనల్ను పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తాము ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్టు వెల్లడించంతో... వారి నుంచి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
రూ.10 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం
వాహనాలు దొంగతనం చేసే.. నలుగురు సభ్యుల దొంగల ముఠాను వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన ట్రాక్టర్ ఇంజిన్, ట్యాంకర్లు, ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా కలమల, వల్లూరు, కమలాపురం, కాజీపేట ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ట్రాక్టర్లతోపాటు ట్రాలీలు, నీటి ట్యాంకర్లను ఎత్తుకుపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు మండలంలోని కలమలపూడిలో ఉంచిన మూడు నీటి ట్యాంకర్లు, ఆరు ట్రాక్టర్ ట్రాలీలతోపాటు ఒక ట్రాక్టర్ ఇంజిన్ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని దొంగతనంగా తీసుకు వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్కు పంపినట్లు సీఐ రాజేంద్రప్రసాద్, కలమల ఎస్సై హేమాద్రి తెలిపారు.