today starts
-
నేటి నుంచి రబీ సేద్యం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో శనివారం నుంచి రబీ వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలపై రబీ ఆధారపడి ఉంది. ఖరీఫ్ దెబ్బతీయడంతో ‘అనంత’ రైతులు రబీపై ఆశలు పెట్టుకుని రంగంలోకి దిగుతున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రబీ పరిగణలోకి తీసుకోగా ఈ మూడు నెలల కాలంలో 155.5 మి.మీ వర్షం పడాల్సి ఉంది. అందులో అక్టోబర్లోనే 110.7 మి.మీ, నవంబర్లో 34.7 మి.మీ, డిసెంబర్లో 9.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఒక్కోసారి నవంబర్లో సంభవించే తుఫాన్ల వల్ల అధిక వర్షం పడిన దాఖలాలు ఉన్నాయి. ఖరీఫ్లో సాగు చేసిన కంది, ఆముదం, పత్తి వంటి పంటలకు కూడా రబీలో కురిసే వర్షాలే ప్రధానం. మొత్తమ్మీద ఈ రబీలో 1,45,704 హెక్టార్లలో పంటలు సాగులోకి రానున్నాయని అధికారులు అంచనా వేశారు. అందులో వర్షాధారంగా 94,710 హెక్టార్లు, నీటి వసతి కింద 50,994 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని అంచనా వేశారు. రబీ ప్రధానపంటగా పప్పుశనగ 77,567 హెక్టార్లలో సాగులోకి రావచ్చన్నారు. నీటి వసతి కింద వేరుశనగ పంట 19,330 హెక్టార్లుగా గుర్తించారు. వరి 10 వేల హెక్టార్లు, జొన్న 6,700 హెక్టార్లు, మొక్కజొన్న 6 వేల హెక్టార్లు, పొద్దుతిరుగుడు 4,600 హెక్టార్లు, ఉలవ 3,800 హెక్టార్ల విస్తీర్ణంలో వేసే అవకాశం ఉందని అంచనా వేశారు. 35 మండలాల్లో పప్పుశనగ : విడపనకల్లో 15 వేల హెక్టార్లు, వజ్రకరూరు, ఉరవకొండ మండలాల్లో 10 వేల హెక్టార్ల చొప్పున విస్తీర్ణంలో పప్పుశనగ వేసే అవకాశం ఉందంటున్నారు. అధికారులు. బెళుగుప్ప, కనేకల్లు, బొమ్మనహాల్, పుట్లూరు, తాడిపత్రి, యల్లనూరు, పెద్దపప్పూరు, గుంతకల్లు, యాడికి, రొద్దం, డి.హీరేహాల్ మండలాల్లో పప్పుశనగ ఎక్కువగా సాగులోకి రావచ్చని అంచనా. 35 మండలాల్లో పప్పుశనగ పంట వేస్తున్నట్లు అంచనా వేశారు. వేరుశనగ జిల్లా అంతటా వేసే అవకాశం ఉన్నా 20 మండలాల్లో ఎక్కువగా సాగు చేసే పరిస్థితి ఉంది. తాడిపత్రి, పుట్లూరు, యాడికి, యల్లనూరు, డి.హీరేహాల్, పెద్దపప్పూరు, బొమ్మనహాల్, ఎన్పీ కుంట, అమడగూరు మండలాల్లో పొద్దుతిరుగుడు పంట ఎక్కువగా వేయవచ్చని పేర్కొన్నారు. రబీలో పంటల వారీగా సాధారణ సాగు విస్తీర్ణం ఇలా ఉంది. ––––––––––––––––––––––––––––––––––––––––––––– పంట సాధారణం (హెక్టార్లలో) పంట సాధారణం (హెక్టార్లలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పప్పుశనగ 77,564 వేరుశనగ 19,330 వరి 10,074 జొన్న 6,672 మొక్కజొన్న 5,926 పొద్దుతిరుగుడు 4,673 ఉలవ 3,855 రాగి 939 ఉల్లి 407 ప్రత్తి 392 పెసర 344 ఆముదం 341 పొగాకు 194 మినుములు 157 చెరకు 141 కుసుమ 126 -
‘మూల్యాంకనం’ ప్రశ్నార్థకం
– నేటి నుంచి మండల కేంద్రాల్లో 5 శాతం జవాబు పత్రాల మూల్యాంకనం – ఎంపికకాని టీచర్లు – సాధ్యాసాధ్యాలు గాలికి – అయోమయంలో ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్ : నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో భాగంగా జరుగుతున్న సమ్మేటివ్–1 పరీక్షల మూల్యాంకనం ప్రశ్నార్థకం అవుతోంది. 6–10 తరగతులకు సంగ్రహణాత్మక మూల్యంకనాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ, అన్ని తరగతుల్లోనూ 5 శాతం జవాబు పత్రాలను మండలస్థాయి కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక బందం ద్వారా సోమవారం నుంచి మూల్యాంకనం ప్రారంభించాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మండల స్థాయిలో జరిగే మూల్యాంకనానికి ఇప్పటిదాకా సబ్జెక్టు టీచర్లను ఎంపిక చేయలేదు. అసలు కమిటీల్లో ఉన్న సభ్యులకే చాలాచోట్ల సమాచారం లేదు. మరోవైపు ఈ నెల 22న తెలుగు పరీక్ష జరిగింది. చాలా స్కూళ్లలో పాఠశాల స్థాయి మూల్యాంకనం జరగనేలేదు. కొన్ని స్కూళ్లలో 6–10 తరగతుల విద్యార్థులు 1000 మంది దాకా ఉన్నారు. ఒక ప్రశ్నకు పలురకాల జవాబులు రాసింటారు. ఈ పరిస్థితుల్లో›ప్రతి ›జవాబు పూర్తిస్థాయిలో చదివితే తప్ప మార్కులు వేయలేని పరిస్థితి. ఇందుకు అధిక సమయం పడుతుంది. పైగా తెలుగు, సోషియల్ సబ్జెక్టుల్లో టీచర్ల కొరత అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో షెడ్యూలు ప్రకారం మండల స్థాయిలో మూల్యాంకనం అనుమానమేనని ఉపాధ్యావర్గాలంటున్నాయి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల అనుమానాలు... –––––––––––––––––––––––––––––––––––– – సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న పాఠశాలలు, దీర్ఘకాలిక సెలవు, మెటర్నటీ సెలవులో ఉన్న టీచర్ల పాఠశాలలో ఆయా సబ్జెక్టుల జవాబుపత్రాలు ఎవరు మూల్యాంకనం చేయాలి. సమయం కూడా చాలా తక్కువగా ఉండడంతో ఎలా చేయాలో అధికారులే చెప్పాలి? – సీసీఈ విధానంలో జవాబుపత్రం దిద్దాలంటే రోజుకు సగటున 30 పేపర్లకంటే మించి దిద్దే అవకాశం లేదు. గడువులోగా ఇది సాధ్యమా? – విద్యార్థులు అతి తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి మండల కేంద్రాల్లో సాగే మూల్యాంకనానికి 5 శాతం ఎలా తీయాలి? – 30 నుంచి దసరా సెలవులు ప్రకటించారు సెలవు దినాల్లో పని చే యించుకుంటే ప్రత్యేక భతి ఇస్తారా? దీనిని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయా? – ఒక టీచరు జవాబుపత్రం దిద్ది మార్కులు వేసిన తర్వాత మరో టీచరుతో అదే పేపరు దిద్దించాల్సిన అవసరం ఏముంది? –––––––––––––––––––– డీఈఓ అంజయ్య ఏమంటున్నారంటే... షెడ్యూలు ప్రకారం సోమవారం నుంచి మండల కేంద్రాల్లో 5 శాతం జవాబుపత్రాలు మూల్యాంకనం జరుగుతుంది. ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా కమిటీలను ఆదేశించాం. ఒకట్రెండు రోజులు ఆలస్యమైనా ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం.