breaking news
Satyanarayan (35)
-
రైల్వే ప్లాట్ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!
Satyanarayan Nuwal Success Story అత్యంత తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించి బిలియనీర్గా అవతరించిన వ్యాపారవేత్తల విజయగాథల గురించి చాలానే విన్నాం. అయితే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, ఎన్న సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ఏకంగా రూ.72000 కోట్ల ఆస్తికి యజమాని అయిన సక్సెస్ స్టోరీ విన్నారా? చేతిలో చిల్లి గవ్వ లేని స్థితి నుండి.. రైల్వే ప్లాట్ఫారమ్పై పడుకునే స్థాయి నుండి మొదలై.. పట్టుదలతో దేశంలోనే అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచిన సత్యనారాయణ్ నువాల్ జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. పదండి ఈ వివరాలేంటో తెలుసుకుందాం.రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అతని పేరే 72 ఏళ్ల సత్యనారాయణ్ నువాల్ (Satyanarayan Nuwal). సుమారు రూ. 45,650 కోట్ల నికర ఆస్తితో నాగ్పూర్లోని అత్యంత ధనవంతుడు. సత్యనారాయణ్ నువాల్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేసాడు. 18-19 ఏళ్లకే వివాహం, బాధ్యతలు నెత్తినపడ్డాయి. రాజస్థాన్లోని భిల్వారాలో పట్వారీగా పనిచేసిన అతని తండ్రి 1971లోనే రిటైర్ అయ్యారు. తాతగారు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవారు, సపోర్ట్ చేయడానికి ఎలాంటి కుటుంబ వ్యాపారం లేదు. 18 ఏళ్ల వయసులో సిరా (Ink) తయారీ యూనిట్ను ప్రారంభించినా అది విఫలమైంది. దాంతో బతుకుదెరువు కోసం కొత్త ప్రాంతానికి వచ్చాడు.చేతిలో పైసా లేకుండా, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చేరుకున్నాడు. 1977లో, మహారాష్ట్రలోని బల్హార్షా రైల్వే స్టేషన్కు చేరాడు. ఆ రాత్రి అతనికి ఆశ్రయం ఆ రైల్వే ప్లాట్ఫారమే అయింది. ఆ రాత్రి ప్లాట్ఫారమ్పై పడుకున్నప్పుడు, భవిష్యత్తులో తన జీవితం ఎలా మారబోతోందో అతనికి కనీసం ఊహ కూడా లేదు.ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా ఆయన దగ్గర తగినంత డబ్బు ఉండేది కాదు. దీంతో ఆయన చాలా రాత్రులు రైల్వే స్టేషన్లోనే గడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం ఆయన ఫౌంటెన్ పెన్నులు కూడా అమ్మేవారు.చిన్న అడుగుతో మొదలైన వ్యాపారంబల్హార్షాలో నువాల్కు అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ పరిచయమయ్యారు. ఆయన బావులు తవ్వడానికి, రోడ్లు వేయడానికి, బొగ్గు గనులకు ఉపయోగించే పేలుడు పదార్థాల (Explosives) వ్యాపారి. నువాల్ దీనిని ఒక అవకాశంగా మలుచుకున్నాడు. నెలకు వెయ్యి రూపాయల అద్దె చెల్లించి అబ్దుల్ సత్తార్ లైసెన్స్ను ఉపయోగించుకుని వ్యాపారం ప్రారంభించాడు. 25 కేజీల పేలుడు పదార్థాలను రూ. 250కి కొని, రూ.800కి అమ్మేవాడు. లాభాలు తక్కువే అయినా, అది నిజాయితీతో కూడిన శ్రమ.#WATCH | Solar Group Chairman Satyanarayan Nuwal receives Padma Shri award from President Droupadi Murmu for his contribution to India's defence manufacturing ecosystem pic.twitter.com/xEuTePY74k— ANI (@ANI) May 25, 2026త్వరలోనే ఆయన కష్టపడే తత్వాన్ని, నిజాయితీని బ్రిటిష్ కంపెనీ 'ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్' అధికారులు గుర్తించారు. ఇది ఆయనకు వ్యాపారంలో సరికొత్త తలుపులు తెరిచింది. ఒక చిన్న వ్యాపారిగా ఉన్న నువాల్, ఎక్స్ప్లోజివ్స్ బిజినెస్లోని మెళకువలను లోతుగా నేర్చుకున్నాడు.'సోలార్ ఇండస్ట్రీస్' అద్భుత ప్రగతి1995లో, తన 37వ ఏట నువాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.60 లక్షల రుణం తీసుకుని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా (Solar Industries India) పేరుతో ఒక చిన్న తయారీ యూనిట్ను ప్రారంభించారు. చాలామంది ఇది పెద్ద రిస్క్ అనుకున్నారు, కానీ నువాల్ తనపై నమ్మకంతో ముందడుగు వేశారు.2006 IPOఐపీఓ (IPO)కి వెళ్లే సమయానికి రూ.78 కోట్ల టర్నోవర్, రూ.11 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో, 29 నగరాల్లో తయారీ కేంద్రాలను కలిగి ఉంది. వీటితో పాటు జాంబియా, ఘనా, నైజీరియా, టర్కీ, టాంజానియా మరియు సౌత్ ఆఫ్రికాలలో 6 విదేశీ యూనిట్లను నడుపుతోంది.రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర2010లో భారతదేశ రక్షణ దళాలకు (Defence Forces) వార్హెడ్ల కోసం పేలుడు పదార్థాలను తయారు చేసే లైసెన్స్ను భారత ప్రభుత్వం నుండి పొందిన మొదటి ప్రైవేట్ కంపెనీగా సోలార్ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది.'మేక్ ఇన్ ఇండియా' మిషన్లో భాగంగా కంపెనీ ఎక్స్ప్లోజివ్స్, ప్రొపెల్లెంట్స్, గ్రెనేడ్లు, డ్రోన్లు మరియు వార్హెడ్ల తయారీని ప్రారంభించింది. పినాకా (Pinaka) రాకెట్లు: ఈ రాకెట్ల కమర్షియల్ ప్రొడక్షన్ కంపెనీకి ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రక్షణ రంగం నుంచి అంతర్జాతీయ ఆర్డర్లు భారీగా పెరుగుతున్నాయి. కంపెనీ రాబడిలో మెజారిటీ భాగం ఎగుమతుల (Exports) ద్వారానే వస్తోంది.2026 జులై నాటికి సోలార్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ,1.69 లక్షల కోట్లకు చేరుకుంది. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం పొందిన నువాల్ ఆస్తి విలువ సుమారు రూ.7.5 బిలియన్ డాలర్లు (రూ.72,000 కోట్లకు పైగా).ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిపద్మశ్రీ పురస్కారం2026, మే 25న రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంపొందించినందుకు గాను సత్యనారాయణ్ నువాల్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'పద్మశ్రీ' అవార్డును ప్రదానం చేశారు. ఇంతఎత్తుకు ఎదిగినా ఆయన తన మూలాలను మరచిపోలేదు. నాగ్పూర్ పరిసర ప్రాంతాలలో విద్య, సమాజ అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు విస్తృతంగా విరాళాలు అందిస్తూ గొప్ప దాతగా పేరు గాంచారు.ఇదీ చదవండి: వీకెండ్ క్లాస్లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా -
అప్పులే..ముప్పుగా మారాయి..!
పదకొండురోజుల్లో జిల్లాలో ఇద్దరు రైతుల ఆత్మహత్యలు కరువు కోరల్లో మెతుకు జిల్లా కరువు ప్రాంతంగా {పకటించి అన్నదాతలను ఆదుకోవటమే మార్గం మెదక్ రూరల్ : దేశానికి అన్నం పెట్టే రైతు.. బతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు.. పది మందికి అన్నం పెట్టే రైతన్నలు 11 రోజుల తేడాలో మెదక్ మండలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాలం పోయి కరువు కోరల్లో చిక్కుకున్న రైతుకు ఎవరూ భరోసా ఇవ్వటంలేదు. మెదక్ మండలంలో చెరువులు, కుంటలు తప్ప చెప్పుకోదగిన సాగునీటి ప్రాజెక్టులు, నీటివనరులు లేవు, దీంతో ఈ ప్రాంత రైతులు పూర్తిగా చెరువులు, కుంటలు, బోరుబావులపై ఆధారపడి ఆరుతడి పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. కాగా గత రెండు సంవత్సరాలుగా చెప్పుకోతగిన వర్షాలు కురియక పోవటంతో చెరువులు, కుంటలు నెర్రెలు బారటంతోపాటు బోరుబావుల్లో నీటి ఊటలు పూర్తిగా అడుగంటాయి. దీంతో రైతులు ఆత్మహత్య ఒక్కటే మార్గమని ఉసురు తీసుకుంటున్నారు. పంటచేతికందని స్థితిలో.. మండల పరిధిలోని మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన రాజెల్లిపేట సత్యనారాయణ (35) అనే యువరైతు ఈనెల 6న ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణ, లక్ష్మి దంపతులకు 8 సంవత్సరాలలోపు ఇద్దరు సంతానం ఉన్నారు. రెండెకరాల వ్యవసాయ పొలం ఉన్న సత్యనారాయణ రెండు సంవత్సరాల క్రితం దుబాయి వెళ్లాడు. ఏడాది పాటు పనిచేసిన సత్యనారాయణను అక్కడి వారు వెనక్కి పంపారు. దీంతో సత్యనారాయణ దుబాయ్ వెళ్లేందుకు చేసిన అప్పులను తీర్చకుండానే తిరిగి సొంత ఊరికి వచ్చి బోరువద్ద ఉన్న రెండెకరాల పొలంలో ఎకరం నాటు వేశాడు, మరొక ఎకరం బీడుగానే ఉంది. కాగా బోరుబావిలో నీటి ఊటలు తగ్గిపోయాయి. పంట సాగుకోసం చేసిన అప్పులు, ఒకవైపు, దుబాయి వెళ్లేందుకు చేసిన అప్పులు బాధించడంతో ఈ నెల 6న ఆత్మహత్యచేసుకున్నాడు. మొక్కజొన్న తోటలోనే.. ఇదే మండలం రాజ్పల్లి పంచాయతీ పరిధిలోని తిమ్మక్కపల్లి పెద్దబాయి తండాకు చెందిన మాలావత్ బన్సీ(40) మీరి దంపతులకు 20 సంవత్సరాల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి మూడెకరాల పొలం ఉంది. అందులో సాగునీటి కోసం రెండు బోర్లను తవ్వారు. చుక్కనీరు కూడా రాకపోవడంతో పిల్లలతో పట్టణానికి వలస వెళ్లారు. అక్కడ అడ్డా కూలీలుగా పనిచేసి, కూతురు పెళ్లి చేశారు. కాగా ఏదో సమస్య వచ్చి కూతురుకు విడాకులయ్యాయి. ఈ యేడు ముందుగా మురిపించిన వర్షాలకు బన్సీ, మీరీలు పట్టణం నుంచి తండాకు వచ్చి అప్పు చేసి మక్క పంట వేశారు. చినుకు జాడలేకపోవటంతో పంట ఎండిపోయింది. ఫలితంగా చేసిన అప్పులు ముప్పయ్యాయి. దీంతో ఈనెల 17వ తేదీ రాత్రి బన్సీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒక్కమెదక్ మండలంలోని పరిస్థితే కాదు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి.


