breaking news
pregnant woman killed
-
బంధువుల ఇంటికెళ్లిందని గర్భిణి భార్యను..
సాక్షి, న్యూఢిల్లీ : చెప్పకుండా బంధువుల ఇంటికెళ్లిందనే కోపంతో గర్భిణి భార్యను గొంతు నులిమి చంపేశాడో కిరాతపు భర్త. ఈ ఘటన సౌత్ఢిల్లీ దక్షిణపురిలోని అంబేద్కర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణపూరికి చెందిన విజయ్ భార్య హేమలతతో కలిసి నివాసం ఉంటుంన్నాడు. హేమలత ఐదు నెలల గర్భిణి. కాగా శనివారం రోజు తన భర్తకు చెప్పకుండా ఆమె విజయ్ సోదరి ఇంటికి వెళ్లింది. అదే రోజు సాయంత్రం విజయ్.. నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లాడు. అతను వచ్చేసరికి భార్య ఇంట్లో లేదు. ఆమె ఇంటికి తిరిగొచ్చాక.. విజయ్ కోపంతో ఊగిపోయాడు. తనకు చెప్పకుండా ఎందుకు వెళ్లావని ఆమెను ప్రశ్నిస్తూ గొడవకు దిగాడు. దీంతో ఇరువురి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ప్రాణాల మీదకు తెచ్చింది. సహనం కోల్పోయిన విజయ్.. సోమవారం తెల్లవారుజామున కట్టుకున్న భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల ఎదుట విజయ్ లొంగిపోయాడు. తానే హేమలతను చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నిండు చూలాలు దారుణ హత్య
సాక్షి, పరిగి: నిండు చూలాలును దారుణంగా హతమార్చి రోడ్డు పక్కన పడేసిన సంఘటన పరిగి మండలం రంగంపల్లి శివారులో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. రంగంపల్లి శివారులోని హైదరాబాద్– బీజాపూర్ రహదారి పక్కన గుంతల్లో కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. పరిగి డీఎస్పీ రవీంద్రారెడ్డి, ఎస్ఐ చంద్రకాంత్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఒక్క ఎడమకాలి పాదం మినహా పూర్తిగా ఆమె శరీరం కాలిపోయి ఉంది. 20 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతి అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాళ్లకు మెట్టెలు, మెడలో మంగళసూత్రంలాంటివి లేకపోవడం, ఆమె జననాంగాలకు ఆనుకుని గర్భస్థ శిశువు పడి ఉంది. ఎక్కడో హత్య చేసిన దుండగులు బుధవారం రాత్రి ఇక్కడ పడవేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను తప్పుతోవ పట్టించేందుకే ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారా..? అని భావిస్తున్నారు. వాహనం తచ్చాడిన గుర్తులను బట్టి కారులో తీసుకువచ్చి పడేసి ఉంటారని గుర్తించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు.. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పరిగి లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఆయా పోలీస్స్టేషన్లకు పంపించి మిస్సిం గ్ కేసుల విషయంలో ఆరా తీస్తున్నారు. చుట్టు పక్కల పోలీస్స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అబార్షన్ వికటించిందా..? లభ్యమైన మృతదేహం గర్భవతి కావడంతో పాటు అవివాహితగా అనుమానిస్తున్న పోలీసు లు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాం పక్కన ఆస్పత్రిలో పేషెం ట్లకు కప్పే బట్ట లభ్యం కావడం సంఘటన వెనక మరో కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో గుట్టుగా అబార్షన్ చేయిం చేందుకు ప్రయత్నించి అది వికటించడంతో యువతి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. మృతి చెందాక మృతదేహాన్ని, శిశువును తీసుకువచ్చి ఇక్కడ పడేసి నిప్పంటించి పరారై ఉంటారా...? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కనిపించకుండాపోయిన వారు ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. 94406 27360, 94406 27275లలో తమను సంప్రదించాలని సూచించారు. -
ప్రసూతి ఆస్పత్రిలో గర్భిణి మృతి
- కుటుంబసభ్యుల ఆందోళన హైదరాబాద్ : నగరంలోని కోఠి ప్రసూతి వైద్యశాలలో గర్భిణి మృతి చెందడంతో మృతురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. రంగారెడ్డి జిల్లా మాధపురం గ్రామానికి చెందిన మమత(25) పురిటినొప్పులతో సోమవారం సాయంత్రం కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ఆమె మంగళవారం ఉదయం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మమత చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు.