నవంబర్ 19, 20, 27ల్లో ఎస్ఐ తుది పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కేటగిరీల్లో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)ల నియామకానికి సంబంధించి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు తుది రాత పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 19, 20, 27 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్ఎఫ్వోలతోపాటు కమ్యూనికేషన్, పీటీవో కేటగిరీల్లో ఎస్ఐ పోస్టులకు ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ జారీ అవగా రాత పరీక్షలు, మెజర్మెంట్, ఎఫీషియన్సీ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి.