breaking news
nagalamadaka
-
నాగుపాము మృతి
పావగడ : నాగలమడక అంత్య సుబ్రహ్మణ్యంస్వామి ఆలయంలోకి ప్రవేశించిన నాగుపాము ఆదివారం మృతి చెందింది. స్వామి సన్నిధిలో కొలువుదీరి సాక్షాత్తు శంకరుని మెడలోని నాగుపామే దిగి వచ్చి ఆలయంలో సాక్షాత్కరించిందా అనే విధంగా భక్తులకు దర్శనమిచ్చిన పాము చనిపోయింది. నాగుపామును దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. అయితే పాము మృతి చెందిన వార్త విని శోకంలో మునిగిపోయారు. ఆ పాముకు ఆలయ ఆవరణలోని నాగులకట్ట వద్ద దహన సంస్కారాలు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు బదరీనాథ్ తెలిపారు. -
కార్తికేయుని సన్నిధిలో నాగుపాము
పావగడ : పావగడలోని నాగలమడక అంత్య సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంలోని గర్భగుడి ఎదురుగా ఉన్న నవ గ్రహ విగ్రహాల వద్దకు ఓ నాగుపాము చేరుకుంది. వారం రోజులుగా అక్కడే ఉండిపోయింది. అత్యంత ప్రీతిపాత్రమైన నాగుపాము స్వామి వారి సన్నిధిలో ఉండడంతో ఆశ్చర్యానికి గురైన భక్తులు ఎంతో భక్తితో పూజలు చేస్తున్నారు. పాముకు ఆహారంగా పాలు పోసి కొలుస్తున్నారు. ఈ వింత సంఘటనను చూడటానికి చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు తరలి వస్తున్నారు. భక్తులు పామును వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా పాము కదలక పోవడం విశేషం.