'30 రోజుల్లో 2.5 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తాం'
గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళిగిరి మున్సిపాలిటీలో సోమవారం ఆ జిల్లా మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13 జిల్లాల్లోని వ్యర్థాలతో 13 ఎనర్జిటిక్ పవర్ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.
30 రోజుల్లో రెండున్నర లక్షల మరుగుదొడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మరుగుదొడ్ల నిర్మాణం సెల్ఫ్-హెల్ఫ్ గ్రూపుల ద్వారా ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.