రిలయన్స్ రిటైల్ నుంచి ఎర్త్2 స్మార్ట్ఫోన్
ముంబై: రిలయన్స్ రిటైల్ తాజాగా లైఫ్ బ్రాండ్ కింద రెండో స్మార్ట్ఫోన్.. ఎర్త్2ను సోమవారం ఆవిష్కరించింది. దీని ధర రూ.19,999. 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ముందు.. వెనుక 13 ఎంపీ కెమెరాలు ఇందులోని ప్రత్యేకతలు. వాయిస్ కమాండ్స్పై పనిచేసే కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సర్, రెటీనా ఆధారిత అన్లాకింగ్ టెక్నాలజీ మొదలైనవి ఈ ఫోన్లోని అదనపు ఆకర్షణలని రిలయన్స్ రిటైల్ ప్రెసిడెంట్ (డివెజైస్ వభాగం) సునీల్ దత్ తెలిపారు. ఈ సందర్భంగా ఎర్త్2 టీవీ ప్రకటనను కూడా ఆవిష్కరించారు.