-
దళితుల భూపంపిణీకి ఎన్నికల జోష్
సాక్షి, హైదరాబాద్: దళితుల భూపంపిణీ పథకంపై ఎన్నికల ప్రభావం పడింది. రెండేళ్లుగా ఈ పథకానికి కేటాయింపులు తగ్గుతున్న క్రమంలో ఈసారి అతి తక్కువ లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో కేవలం 159 మంది లబ్ధిదారులకు భూపంపిణీ చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇందుకుగాను రూ.4.06 కోట్లు అవసరమని ప్రణాళికలో పేర్కొంటూ ప్రభుత్వానికి సమర్పించారు. కానీ, అనూహ్యంగా ఎన్నికల సీజన్ వచ్చిన దళితుల భూపంపిణీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 1,900 మంది రైతులకు భూపంపిణీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి రూ.407.32 కోట్లు కేటాయించింది. ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళికను ఆమోదిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భూమి ఎక్కడ ? గతంలో ఎన్నడూ లేనంత పెద్దమొత్తంలో ప్రభుత్వం దళితుల భూపంపిణీకి నిధులు కేటాయించినప్పటికీ, లక్ష్య సాధన సులువు కాదనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్థి రంగం పుంజుకుంది. దీంతో భూముల ధరలు పెరిగిపోయాయి. ప్రాజెక్టులు, కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం సేకరిస్తున్న భూమికి ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దళితుల భూపంపిణీ పథకానికి ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేయడం ఎస్సీ కార్పొరేషన్కు కష్టంగా మారింది. అన్ని వసతులతోపాటు సాగుకు యోగ్యమైన భూమినే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. ఎకరాకు రూ.7లక్షలు మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మొత్తంతో భూమి కొనుగోలు చేయడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా నిర్దేశించిన లక్ష్యం తాలూకు సాధనే కష్టమైందని ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు. -
భూ పంపిణీ డౌటే!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితుల భూ పంపిణీ పథకం ఇంకా బాలారిష్టాలు పడుతోంది. భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల చొప్పున భూమిని పంచుతామని సర్కారు ప్రకటించింది. ఈ నెల 15న ఈ పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితులను చూస్తే పంపిణీ సాధ్యమయ్యేటట్లు లేదు. మొదట మండలానికో గ్రామాన్ని యూనిట్గా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సర్వే కూడా నిర్వహించారు. భూమి కొనుగోలు చేయడానికి వీలుకాని పటాన్చెరు, రామచంద్రాపురం మండలాలు మినహా మిగతా 44 మండలాల్లో ప్రాథమిక సర్వే చేశారు. అయితే తగినంత సమయం లేకపోవడం, భూ కొనుగోలు సమస్యగా మారటంతో నియోజకవర్గానికో గ్రామం గా సవరించారు. దీంతో ఆశలు పెంచుకున్న దళితులు నిరాశకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఆ క్షణం కోసం ఎదురుచూపు.. కచ్చితంగా ప్రతి దళిత కటుంబానికి మూడు ఎకరాల భూమి ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ చె ప్తున్నప్పటికీ,. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న తొలి సంక్షేమ ఫలం ఇది. సహజంగానే దళిత ప్రజలు దీనిపై ఆశలు పెంచుకున్నారు. ఇంతకాలం వలసలతో కాలం గడిపిన దళితులకు జీవితంలోనే మొదటిసారి మూడు ఎకరాల భూమికి ఆసామి అవుతున్నామనే ఆనందంలో ఉన్నారు. ఇలాంటి మధుర ఫలాలు అనుకున్న సమయంలో చేరితేనే దానికి సార్థకత ఉంటుంది. ఇదిగో వచ్చే.. అదిగో ఇస్తున్నామని ఊరించి... ఉడికించి ఇవ్వడం వల్ల ప్రభుత్వం పలుచన అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆలస్యం కావచ్చు... పథకం ప్రారంభానికి కేవలం 13 రోజులే ఉన్నప్పటికీ ఇప్పటివరకు అధికారులు ఒక్క ఎకరం భూమి కూడా సేకరించలేదు. భూ పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వం కేవలం రూ.25 లక్షల నిధులను మాత్రమే మంజూరు చేసింది. ప్రస్తుతం కేవలం 10 గ్రామాల్లో మాత్రమే పథకాన్ని అమలుచేస్తున్నారు. అక్కడ కూడా ప్రాథమిక సర్వే మాత్రమే పూర్తిచేశారు. తుది లబ్ధిదారుల జాబితా ఇంకా ఎంపిక చేయనేలేదు. ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. ఎంపిక చేసిన గ్రామాలివే.... నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కిష్టాపూర్, దుబ్బాకలో లక్ష్మీనగర్, మెదక్లో సూరారం, సంగారెడ్డిలో మాడిపెల్లి, పటాన్చెరులో నల్లవల్లి, అందోల్ నియోజకవర్గంలో అంతారం, జహీరాబాద్లో గోడిగర్గపల్లి, నర్సాపూర్లో మూసాపేట్, సిద్దిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడక, గజ్వేల్ నియోజకవర్గంలో అంకిరెడ్డిపల్లి గ్రామాలను తొలి విడతలో ఎంపిక చేశారు. ఈ పది గ్రామాల్లో మొత్తం 921 దళిత కుటుంబాలను గుర్తించారు. తదుపరి సర్వేలో అర్హులను గుర్తించి తుది లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తారు. లక్ష్యం సరే... తొలి విడతలో కనీసం 500 ఎకరాల భూమి కావాల్సి ఉంది. కానీ అధికారులు ఇప్పటివరకు ఎకరా కూడా సేకరించలేదు. కనీసం 200 ఫీట్లు బోర్లు వేస్తే నీళ్లు పడే సాగుకు యోగ్యమైన భూమిని సేకరించి దళిత కుటుంబాలకు అందిస్తామని మంత్రి హరీష్రావు హామీ ఇచ్చారు. ఒకే చోట సాగుకు యోగ్యమైన భూమి ఏకమొత్తంలో దొరకటం సాధ్యం కావటం లేదు. పైగా నాణ్యమైన భూమికి.. ఎకరాకు రూ. 4 లక్షల నుంచి ఆపైనే పలుకుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ 2. లక్షల నుంచి రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు గ్రామాల్లో మినహా మిగిలిన గ్రామాల్లో భూమి ఎక్కడ దొరుకుతుందో కూడా వివరాలను సేకరించలేదు. ఈ మొత్తం పక్రియ పూర్తయి లబ్ధిదారునికి భూ పత్రాలు చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement