-
ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండానే పంటపోలాల్లో కరెంట్ హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారంటూ ఉండవల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్ లైన్ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్ లైన్ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. హైటెన్షన్ లైన్ ఏర్పాటు వ్యతిరేకంగా రైతులు పురుగుల మందు తాగేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉండవల్లి పొలాల్లో ఉద్రిక్తత
-
తాడేపల్లి మండలం ఉండవల్లిలో హైటెన్షన్
-
ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండానే పంటపోలాల్లో కరెంట్ హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారంటూ తాడేపల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్ లైన్ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్ లైన్ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కరెంట్ తీగలు అమర్చి..నీలుగాయి హతం
జన్నారం : కరెంటు తీగలు అమర్చి నీలుగాయిని హతమార్చిన ఏడుగురు గిరిజనులను ఫారెస్టు అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మాంసం కోసి కుప్పలు వేస్తుండగా అధికారులు ఒక్కసారిగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ సంఘటన జన్నారం అటవీ డివిజన్లోని అలీనగర్ బీట్ పరిధిలో జరిగింది. జన్నారం రేంజ్ అధికారి నిజామొద్దీన్ తెలిపిన వివరాలివీ..అలీనగర్ గ్రామంలో జొన్నచేలకు వన్యప్రాణుల బెడద ఉందని గిరిజనులు విద్యుత్ తీగలు అమర్చారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆ తీగలకు తగిలి ఓ నీలుగాయి మృతిచెందింది. దీంతో 20 మంది గిరిజనులు నీలుగాయిని ఊళ్లోకి తెచ్చి కోశారు. మాంసాన్ని కుప్పలు వేస్తుండగా సమాచారం అందుకున్న డివిజన్ మొబైల్ పార్టీ సిబ్బంది డీఆర్వో లక్ష్మీకాంతరెడ్డి సిబ్బందితో అక్కడికి వెళ్లడంతో కొంతమంది పారిపోయారు. అధికారులు మాంసం, సామగ్రితోపాటు నీలుగాయి హతమార్చడానికి కారణమైన అలీనగర్కు చెందిన పెంద్రం లక్ష్మణ్, సుభాష్, మడావి నర్సింగరావు, కృష్ణ, సిడాం నగేశ్, కుర్సింగ భీంరావు, విజయకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. మరో 13 మంది పరారయ్యారు. వారిని డివిజన్ కార్యాలయానికి తరలించారు. ఇందులో ముగ్గురు 14 సంవత్సరాలలోపు పిల్లలు ఉండటం గమనార్హం. అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరుపరుస్తామని రేంజ్ అధికారి తెలిపారు. ఈ దాడిలో మామిడిపెల్లి సెక్షన్ అధికారి శ్రీరాం, బీట్ అధికారులు భూమన్న, శంకర్, ఐలయ్య, ఏబీవో మక్బూల్ పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన లేకే.. అడవుల్లో నివసించే గిరిజనులకు చట్టాలపై అవగాహన లేక వన్యప్రాణుల వేటకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తినడానికి తిండి లేని గిరిజనులు వన్యప్రాణులను వేటాడి అనవసరంగా కటకటాల పాలవుతున్నారు. శుక్రవారం జరిగిన సంఘటన చూస్తే గ్రామంలో చాలా మంది మాంసం పంచుకునేందుకు వచ్చారే తప్పా, వన్యప్రాణులను చంపితే చర్యలుంటాయని వారికి తెలియదు. గ్రామంలోని మైనర్ బాలురు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే వారిలో అవగాహన లోపమేనని స్పష్టమవుతోంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement