breaking news
Alimineti madhava reddy
-
ఎలిమినేటి మాధవరెడ్డి గురించి అసెంబ్లీ లో వై.ఎస్.ఆర్
-
ఎలిమినేటి మాధవ రెడ్డి గురించి అసెంబ్లీలో వై.ఎస్.ఆర్
-
ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి నిప్పు
చిట్యాల(నల్లగొండ): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడులో మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. గ్రామంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఆ విగ్రహాన్ని ఇంకా ఆవిష్కరించలేదు. ఈ నేపథ్యంలోనే విగ్రహానికి ఉన్న ముసుగుకు బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించటంతో నల్లగా కాలి మసకబారింది. విగ్రహానికి ఎటువంటి నష్టం కలగలేదు. కాగా, విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరణ చేసేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పరిటాల హత్యపై విచారణకు సిద్ధమా?
-
పరిటాల హత్యపై విచారణకు సిద్ధమా?
హైదరాబాద్: టీడీపీ నేతలు కన్నుమూసినా, తెరిచినా వారికి వైఎస్సార్ కాంగ్రెస్సే కనిపిస్తోందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు చిత్తశుద్ధితో ఏనాడూ వ్యవహరించలేదని విమర్శించారు. ఏ అవకాశం దొరికినా వైఎస్సార్సీపీపై బురదజల్లడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి హత్య విషయంలో చంద్రబాబు చేస్తున్నవి సిగ్గులేని ఆరోపణలని కొట్టిపారేశారు. చాలామంది నేతలు పరిటాల రవికి దగ్గరవుతున్న బాధతో చంద్రబాబే హత్యచేయించారని అనుమానాలున్నాయని అన్నారు. పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకోవడానికి పరిటాల రవిని చంద్రబాబే హత్యచేయించారనే ఆరోపణలున్నాయన్నారు. చంద్రబాబు అన్నీ ఇలాంటి రాజకీయాలే చేస్తారన్నారు. ఎన్టీఆర్ను పదవి నుంచి దించడానికి కూడా అలాంటి రాజకీయాలే చేశారన్నారు. మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, ఇంద్రారెడ్డిల మరణాలపై సీబీఐ దర్యాప్తుకు చంద్రబాబు సిద్ధమా అని శ్రీకాంత్రెడ్డి సవాల్ చేశారు. చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రతిష్ట నానాటికీ దిగజారిపోతుందని అన్నారు.