-
తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీ నేతకే బీజేపీ పగ్గాలు అంటూ ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాల్లో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. సామాజిక వర్గాల ప్రకారం మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అదే సామాజికవర్గానికి చెందిన అర్వింద్కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటున్నాయి పార్టీ వర్గాలు.మరోవైపు, ఈసారి సంఘ్ పరివార్ క్షేత్రాల ప్రతినిధికి ఇవ్వాలనే వాదన ఉంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావుకు కేటాయించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. లోకల్బాడీ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష నియామకంపై ఢిల్లీ జాతీయ నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.ఇప్పటికే కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్రఅధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు ఇస్తారా? లేదా? అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా ఇద్దరు సీఎంలను ఢీకొట్టి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో పార్టీ పగ్గాలు బీసీ నేతలకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి నియామకం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెలాఖరులోగా ఈ టెన్షన్కు తెరపడే చాన్స్ ఉంది. -
పద్దులపై చర్చ.. సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి: స్పీకర్ గడ్డం ప్రసాద్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గత ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పిందిరైతులను రారాజు చేస్తామని చెప్పి మోసం చేసింది.వడ్లు వేయాలని చెప్పి.. కొనుగోళ్లు మాత్రమే చెయ్యలేదు.పత్తి వేయొద్దని.. గత ప్రభుత్వం చెప్పింది..అదే ఏడాది పత్తి రేట్లు భారీగా పెరిగింది నిన్న 18 గంటలు...19 పద్దుల పై చర్చ జరిగింది: స్పీకర్ గడ్డం ప్రసాద్పద్దుల పై వరుసగా ఒకేసారి సభ్యులు మాట్లాడాలిసమయాన్ని దృష్టిలో పెట్టుకొని వరుసగా అన్ని పద్దుల పై మాట్లాడాలిసభ సజావుగా జరిగేందుకు నిన్న అందరూ సహకరించారు.ఇవాళ సైతం 19 పద్దుల పై చర్చ జరగాలి.. సభ్యులు సహకరించాలిప్రారంభమైన తెలంగాణ శాసన సభఆరో రోజు శాసన సభ సమావేశాలుప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసిన సభస్కిల్ యూనివర్సిటీ పై మొదలైన చర్చస్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుఅసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమం..వ్యవసాయ ఉత్పత్తులతో వేధికను అలంకరించిన వ్యవసాయ శాఖలక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం 6 వేల 191 కోట్ల నిధులు కేటాయింపురెండో విడుత నిధులు విడుదల చేయనున సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క17 మంది రైతులకు రుణమాఫీ చెక్కు లను అందజేయనున్న సీఎంసాక్షి, హైదరాబాద్: కాసేపట్లో ఆరో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదో రోజు(సోమవారం) 17 గంటలకు పైగా జరిగిన శాసనసభ.. వేకువ జామున 3 గంటలల వరకు కొనసాగింది. 19 పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్శిటీ బిల్లు రానుంది. మంత్రి శ్రీధర్బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. నేడు అసెంబ్లీ వేదికగా రూ.లక్షన్నర రుణాల వరకు మాఫీ ప్రకటన చేయనున్నారు.తెలంగాణ శాసనసభ మూడో విడత సమావేశాల్లో ఐదోరోజు 2024–25 వార్షిక బడ్జెట్ పద్దులపై సోమ వారం సుదీర్ఘ చర్చ జరిగింది. సమయపాలన పాటించి డిమాండ్లకు పరిమితమై మాట్లాడాల్సిందిగా స్పీకర్ సభ ప్రారంభమైన వెంటనే కోరారు. డిమాండ్లపై చర్చకు సంబంధించి ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలపాటు సమయం కేటాయిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.మధ్యాహ్నం మూడు గంటల వరకు చర్చ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రశ్నోత్తరాలు లేకుండానే సోమవారం ఉదయం 19 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే నేరుగా పద్దులపై చర్చ ప్రారంభమైంది. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 19 పద్దులను సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించారు.అయితే సభ్యులు తమకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ సేపు ప్రసంగించడం, ఒకేరోజు 19 పద్దులను చర్చించి ఆమోదించాల్సి ఉండటంతో సోమవారం అర్ధరాత్రి దాటినా చర్చ కొనసాగింది. -
సీఎం అబద్ధాలకు అంతేలేదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో పాలక పక్షం ఆత్మరక్షణలో పడినప్పుడల్లా సీఎం రేవంత్రెడ్డి సభా నాయకుడిగా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని అబద్ధాలతో చర్చలను పక్కదారి పట్టిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ఆదర్శంగా ఉండాల్సిన సభా నాయకుడు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ అబద్ధాలు మాట్లాడుతున్నారని, వరుస అబద్ధాలతో సభ ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారని విమర్శించారు. సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్న తీరుపై ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చామని, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇస్తామని తెలిపారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అన్నీ అబద్ధాలే‘ప్రస్తుత అసెంబ్లీ తొలి సమావేశంలో మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని రిటైర్డు ఇంజనీర్లు చెప్పిన అంశంపై రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు. ప్రస్తుత సమావేశాల్లో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అంశంలో తమకు అనుకూలంగా ఉన్న వాక్యాన్ని మాత్రమే చదివి అందులోని కొన్ని పదాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ మంత్రులపై రేవంత్రెడ్డి అసత్యాలు చెప్తున్నారు.పులిచింతల ప్రాజెక్టు విషయంలో నాటి కాంగ్రెస్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి పెదవులు మూసుకున్నారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా 2005లో ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేశారు. ఎల్ఆర్ఎస్ కింద ఎలాంటి రుసుము లేకుండా క్రమబద్ధీకరణ చేయాలని కోర్టుకు వెళ్లిన కోమటిరెడ్డి.. ఇప్పుడు డబ్బులు వసూలు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై ద్వంద్వ విధానంతో వ్యవహరిస్తున్నారు..’అని హరీశ్రావు విమర్శించారు. 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్కు గుండు సున్నా‘బీఆర్ఎస్ పని అయిపోయిందని అధికార పక్షం అంటోంది. కానీ దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఒక్క ఎంపీ సీటూ దక్కలేదు. 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏనాడూ సొంత బలంతో కేంద్రంలో అధికారంలోకి రాలేదు. 28 పారీ్టలతో ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్కు వచ్చింది 22 శాతం ఓట్లు, 99 సీట్లు మాత్రమే. తెలంగాణలో రెండు పర్యాయాలు కాంగ్రెస్ను ఓడించింది బీఆర్ఎస్ పారీ్టయే..’అని మాజీమంత్రి గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో పెదవులు మూసుకున్న రేవంత్ ‘తెలంగాణ ఉద్యమ సమయంలో పదవుల కోసం రేవంత్రెడ్డి పెదవులు మూసుకున్నారు. ఉద్యమంలో భాగంగా మేం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే.. రేవంత్ కనీసం రాజీనామా పత్రం జిరాక్స్ కాగితం కూడా ఇవ్వలేదు. ఉద్యమకారుల బలిదానానికి ఇలాంటి నేతలే కారణం. ఉద్యమకారులపైకి రైఫిల్తో వెళ్లిన రేవంత్.. ఇప్పుడు తనకు తాను తెలంగాణ చాంపియన్గా చెప్పుకుంటున్నారు. కేసీఆర్ తెచి్చన తెలంగాణ వల్లే రేవంత్ సీఎం అయ్యారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి తనకు తాను జాతీయవాదిగా చెప్పుకున్నారు. రేవంత్ను ఆయన పురుగులా చూసేవారు. తాను జీవించి ఉన్న కాలంలో ఎన్నడూ రేవంత్ను కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు..’అని హరీశ్ అన్నారు. -
‘విద్యుత్’ ఒప్పందాల కథ వెలికితీస్తాం..
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యతారహిత నిర్ణయాల వల్ల విద్యుత్శాఖ రూ.వేల కోట్లు నష్ట పోయిందని శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సోమ వారం ఆయన ‘విద్యుత్’అంశంపై చర్చను ప్రారంభించారు. ఉచిత విద్యుత్ తీసుకొచి్చన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనని..గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించబట్టే విద్యుదుత్పత్తి పెరిగిందన్నారు.గత పదేళ్లు ఇష్టానుసారం విద్యుత్ నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి సభలో లేకపోవడం దురదృష్టకరమని మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. కేసీఆర్ సభకు రాకూ డదనుకుంటే ప్రతిపక్ష నేత హోదా వదులుకోవాలన్నారు. విద్యుత్ రంగంలో జరిగిన దోపిడీపై విచారణ జరుగుతుందని, ఒప్పందాల కథ వెలికితీస్తామని చెప్పారు. ఈ విద్యుత్ ఒప్పందాలు ఎందుకు? ‘‘భద్రాద్రి ప్లాంట్ నిర్మాణం ప్రారంభించే నాటికే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దాన్ని కాదని ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇండియాబుల్ వాళ్ల ప్లాంట్ కోసం తయారు చేసిన టర్బన్ బాయిలర్ వాడటం వల్ల భద్రాద్రి ప్లాంట్ పనిచేయని దుస్థితి ఏర్పడింది. ఎప్పుడూ ఏదో ఒక యూనిట్ ఆగిపోతోంది. అది పదేళ్ల కిందటి పాత ప్లాంటులా ఉందని చీఫ్ ఇంజనీర్ నివేదిక కూడా ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ ప్లాంట్ వ్యయం రూ.7,200 కోట్ల నుంచి రూ.10 వేలకోట్లకు పెరిగింది..’’అని రాజగోపాల్రెడ్డి ఆరోపించారు.బీహెచ్ఈఎల్కు నామినేటెడ్ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వడం, ఆ తర్వాత సివిల్ పనులు బీఆర్ఎస్ నేతల బినామీలకు ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తుంటే అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ప్రయతి్నస్తోందని మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రంలో కుటుంబ పాలన నడిచిందని, ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న చరిత్ర వారిదని రాజగోపాల్రెడ్డి మండిపడ్డారు. -
‘విద్యుత్’ను బలోపేతం చేసిందే మేము
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో విద్యుత్ రంగం బలోపేతమైందని.. కేసీఆర్ ముందు చూపు కారణంగానే అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు జి.జగదీశ్రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో తీవ్రంగా ఉన్న విద్యుత్ కొరతను తీర్చేందుకే కొనుగోళ్లు చేశామని.. కొత్త ప్లాంట్ల ఏర్పాటును చేపట్టామని వివరించారు. కానీ కాంగ్రెస్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.సోమవారం జగదీశ్రెడ్డి శాసనసభలో ‘విద్యుత్’పద్దుపై బీఆర్ఎస్ తరఫున మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సీలేరు ప్రాజెక్టును కొట్టేయడానికే ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలను చంద్రబాబు కుట్రపూరితంగా తీసుకున్నాడు. మనకు ఇవ్వాల్సిన విద్యుత్ వాటా ఇవ్వకపోగా.. మేం కొనుగోలు చేద్దామనుకున్నా ఇవ్వకుండా ప్రైవేటు ప్లాంట్ల వాళ్లను బెదిరించాడు. ఆ పరిస్థితుల్లో విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం. బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకుంటే.. ఏదో జరిగిందని ప్రచారం చేయడం ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వొచ్చు. అదే సమయంలో ఏపీలో నాటి చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు నామినేషన్ పైనే ఇచి్చంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు కోసం మేం ఇచ్చింది యూనిట్కు రూ.3.90 మాత్ర మే. ఇప్పుడు ఎనీ్టపీసీ నుంచి రూ.5.70 చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ సర్కారు కూడా నామినేషన్పై బీహెచ్ఈఎల్కు కాంట్రాక్టులు ఇస్తే మేం మద్దతిస్తాం. ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాల్లో ఏదో వెదుకుతామని చూడటం. పక్క రాష్ట్రంలో తమ బాస్ చేస్తే మాత్రం కరెక్ట్ అనడం ఏమిటి? మా హయాంలోనే విద్యుత్ వ్యవస్థ బలోపేతం మేం విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం పెంచాం. 400 కేవీ, 220కేవీ, 132 కేవీ, 33 కేవీ సబ్స్టేషన్లు పెరిగాయి. విద్యుత్ ట్రాన్స్మిషన్, పంపిణీ లైన్లు పెరిగాయి. సౌర విద్యుత్ పెరిగింది. డిస్కమ్ల ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేయడానికి ఉదయ్ పథకంలో చేరాలని కేంద్రం కోరితేనే చేరాం. బిల్లులు వసూలుకాని ప్రాంతాల్లోని సమీప విద్యుత్ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు పెట్టాం. ఉదయ్ పథకం కింద రూ.9 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై వేసుకున్నాం. తల తెగిపడినా రైతులకు మీటర్లు పెట్టనివ్వలేదు. అప్పుల వాదన అర్థరహితం.. మా హయాంలో అప్పులు అయ్యాయనే వాదన అర్థరహితం. మేం అధికారంలోకి వచ్చేప్పటికే విద్యుత్ రంగంపై రూ.24 వేల కోట్ల అప్పులున్నాయి. అయినా రైతులు, అన్నివర్గాల ప్రయోజనం కోసమే విద్యుత్ రంగాన్ని అప్పులు చేసి అయినా బలోపేతం చేశాం. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది.అదానీకి ఇవ్వాలనేదే మీ ఆలోచనవిద్యుత్ పనులు బీహెచ్ఈఎల్కు వద్దని, అదానీకే ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. ఓల్డ్సిటీలో విద్యుత్ సరఫరా బాధ్యతను అదానీకి అప్పగించే అంశంపై ఎంఐఎం సభ్యులు ప్రశ్నించినప్పుడు.. కాంగ్రెస్ సర్కారు తేలుకుట్టిన దొంగల్లా గమ్మున ఉండిపోయారు. సబ్ కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకోవాలో మీకు తెలిసిన విద్య. మా చుట్టాలెవరూ కాంట్రాక్టు పనులు చేయలేదు. మంత్రివర్గంలో, వారి చుట్టాల్లో ఎందరో కాంట్రాక్టర్లు ఉన్నారు.తప్పుదారి పట్టించే ప్రయత్నాలు..సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అంటూ ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం తెచి్చన మెమో ప్రకారం.. సోలార్ విద్యుదుత్పత్తి జరిగేప్పుడు సూపర్ క్రిటికల్ ప్లాంట్లు సైతం ఉత్పత్తిని 50 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. దానితో సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోతుంది. ఎన్జీటీ కేసులు, కరోనాతోనే యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణం ఆలస్యమైంది. వెనుకబడ్డ నల్లగొండ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే యాదాద్రి ప్లాంట్ చేపట్టాం.కానీ కొందరు నల్లగొండ జిల్లా నేతలు జిల్లాలో ప్లాంట్ వద్దని మాట్లాడారు. వారి సంగతిని ప్రజలే చూసుకుంటారు. విద్యుత్ సరఫరా సమస్యలపై హెల్ప్లైన్కు ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలుకు çపంపుతున్నారు. వారి ఇళ్లకు లైన్మెన్లు పోయి సోషల్ మీడియాలో పోస్టులు తీసేయాలని బెదిరిస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టుపెట్టిన మహిళా జర్నలిస్టు రేవతిపై కేసు పెట్టారు..’’అని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.ముందే మాట్లాడుకుని జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్! జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి భూకబ్జాదారుడంటూ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, వీహెచ్ ఆందోళన చేశారని.. అలాంటి వ్యక్తిని విచారణ కమిషన్ చైర్మన్గా ఎలా నియమించారని జగదీశ్రెడ్డి తప్పుబట్టారు. దీనిపై మంత్రి శ్రీధర్బాబు జోక్యం చేసుకుని.. కమిషన్ చైర్మన్ వ్యక్తిగత విషయాలను, న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలను సభలో మాట్లాడరాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు సీఎం ఈ అంశంపై ఎలా మాట్లాడారని జగదీశ్రెడ్డి నిలదీశారు.ప్రభుత్వం వేసింది న్యాయ విచారణ కాదని వ్యాఖ్యానించారు. ‘‘విద్యుత్ ఒప్పందాలపై విచారణ మొత్తం పూర్తయిందని.. జరిగిన నష్టాన్ని అంచనా వేయడమే మిగిలిందని జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం, జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుకునే కమిషన్ వేసినట్టు మాకు అర్థమైంది. ఈ అంశంలో కేసీఆర్ వాదన కరెక్ట్ అని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా మీరు తప్పుదోవపట్టిస్తున్నారా?’’అని జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. -
కేసీఆర్కు క్లీన్చిట్ రాలేదు
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్’విషయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు క్లీన్చిట్ ఏమీ రాలేదని.. విద్యుత్ కమిషన్ చైర్మన్ను మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు, హై కోర్టు తిరస్కరించాయని గుర్తుచేశారు. కానీ బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి కోర్టు నిర్ణయాన్ని వక్రీకరిస్తూ మాట్లాడారని, అలా చేస్తే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుందని హె చ్చరించారు.శాసనసభలో విద్యుత్ పద్దుపై సోమ వారం జరిగిన చర్చలో రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడంతోపాటు గత బీఆర్ఎస్ సర్కారు నిర్ణయాలపై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది.విద్యుత్ కొనుగోళ్లపై బీఆర్ఎస్ కోరితేనే విచారణకు ఆదేశించాం. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడికి వారసుడన్నట్టు జగదీశ్రెడ్డి మాట్లాడుతున్నారు. కానీ విచారణ కమిషన్తో వారి అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు కోర్టుకు వెళ్లారు. కానీ విచారణ ఆపాలని కోర్టు చెప్పలేదు. సుప్రీంకోర్టు సలహా మేరకు కమిషన్ చైర్మన్ను మారుస్తున్నాం. కొత్త వ్యక్తిని త్వరలో నియమిస్తాం. గతంలోని కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలతోనే.. విద్యుత్ ఉత్పత్తి తమ హయాంలోనే పెరిగిందని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే హైదరాబాద్ నగరానికి ఆదాయం పెరిగింది. విభజన తర్వాత విద్యుత్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ వ్యవహరించింది. అప్పటి కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి దీనికోసం కృషి చేశారు. అసెంబ్లీ ఈ వాస్తవాలు చెప్పేందుకు తాను ప్రయతి్నస్తే.. కేసీఆర్ సర్కార్ అవకాశం ఇవ్వలేదు. మార్షల్స్ను పెట్టి గెంటేయించారు. పేరుకే బీహెచ్ఈఎల్.. కాంట్రాక్టులు బినామీలకా? బీహెచ్ఈఎల్కు కాంట్రాక్టులు ఇస్తే తప్పేంటని, అవినీతికి ఆస్కారం ఎక్కడిదని జగదీశ్రెడ్డి చేస్తున్న వాదన అర్థరహితం. బీహెచ్ఈఎల్కు కేవలం ఎలక్రో్ట, మెకానికల్ పనులు చేసే సామర్థ్యమే ఉంటుంది. సివిల్ పనులు చేసే శక్తి లేదు. అందుకే బీహెచ్ఈఎల్కు విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్టు ఇచ్చి ఆ సంస్థ నుంచి సివిల్ కాంట్రాక్టులను బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు, బినామీలకు, పార్టీ మారిన అప్పటి ఎమ్మెల్యేలకు ఇప్పించారు.ఇందులో వేల కోట్ల దోపిడీ జరిగింది. నిజానికి జార్ఖండ్లో 2,400 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ కోసం టెండర్లు పిలిస్తే.. బీహెచ్ఈఎల్, ఎల్అండ్టీ, కొరియన్ సంస్థలు ముందుకొచ్చాయి. బీహెచ్ఈఎల్ 18% తక్కువకు టెండర్ వేసింది. అలా తెలంగాణలో టెండర్లు పిలిస్తే.. ఇక్కడా బీహెచ్ఈఎల్ 18 శాతం తగ్గించేది. కానీ అలా చేయకుండా వేలకోట్ల నష్టానికి కారణమయ్యారు. వేల కోట్లు చేతులు మారాకే.. నిజానికి ఇండియాబుల్స్ సంస్థ గతంలోనే సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు కోసం బీహెచ్ఈఎల్కు ఆర్డర్ ఇచ్చింది. ఆ యూనిట్లు సిద్ధమవుతున్న తరుణంలోనే.. కేంద్రం సూపర్ క్రిటికల్ పరిజ్ఞానంతో ప్లాంట్లు కట్టాలని చట్టం చేసింది. దీంతో ఆ సబ్ క్రిటికల్ యూనిట్లు తమకు వద్దని ఇండియాబుల్స్ సంస్థ చెప్పగా.. అప్పటికే తయారీ పూర్తయిందని బీహెచ్ఈఎల్ స్పష్టం చేసింది. ఇక్కడే వేల కోట్లు చేతులు మారాయి. గత ప్రభుత్వం కాలం చెల్లిన ఆ సబ్ క్రిటికల్ యూనిట్లతో తెలంగాణలోని భద్రాద్రి ప్లాంట్ పెట్టి.. ఇండియాబుల్స్ సంస్థను గట్టెక్కించింది. పైగా విద్యుత్ కోతలు నివారించడానికే ఇలా చేశామంటూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు మాటలు చెప్తున్నారు. అడ్డగోలుగా వ్యయం పెంచి.. రామగుండంలో ఎనీ్టపీసీ 2016లో 1,600మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించి 2024 ఫిబ్రవరిలో పూర్తి చేసింది. ఆ ప్లాంట్ వ్యయం ఒక్కో మెగావాట్కు రూ.7.38 కోట్లు అయితే.. భద్రాద్రి వ్యయం రూ.9.73కోట్లకు, యాదాద్రి వ్యయం రూ.8.64కోట్లకు పెరిగింది. యాదాద్రి పూర్తయ్యేసరికి రూ.10కోట్లకు పెరుగుతుంది. యాదాద్రిలో ఒక్కో మెగావాట్కు రూ.2.5 కోట్లు చొప్పున మొత్తం రూ.10వేల కోట్లు మింగింది ఎవరో? భద్రాద్రిలో మింగింది ఎవరో తేల్చడానికే విచారణ కమిషన్ ఏర్పాటు చేశాం. నష్టం వద్దనే ఎనీ్టపీసీ ఒప్పందానికి దూరం ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకుంటే మరో ఐదేళ్లలో ఆ ప్లాంట్ పూర్తవుతుంది. రూ.8–9కి యూనిట్ చొప్పున విద్యుత్ లభిస్తుందని లెక్కలు వేశాం. ప్రస్తుతం మార్కెట్లో రూ.5 నుంచి రూ 5.30కే యూనిట్ విద్యుత్ లభిస్తోంది. అందుకే ఎనీ్టపీసీతో ఒప్పందం చేసుకోలేదు. పాపం తగిలి మీ ఇళ్లలోని వారూ జైలుకెళ్తున్నారు ఓ టీవీ చానల్కు సీఈఓగా ఉన్న మహిళా జర్నలిస్టుపై ఎస్సీ, ఎస్టీ కేసుపెట్టి అరెస్టు చేసి టీవీ చానల్ను గుంజుకున్నారు. నేను నా న్యాయవాదిని పెట్టి ఆమెకు బెయిల్ ఇప్పించా. ఆడపిల్లను జైలుకు పంపిన పాపం ఊరికే పోదు. మంది పిల్లలను జైలుకు పంపిస్తే.. మీ ఇళ్లలో కూడా జైలుకుపోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఫామ్హౌస్ కట్టారని బయటపెట్టినందుకు నన్ను 16 రోజులు చర్లపల్లి జైలులో పెట్టారు’’అని సీఎం రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కోరుకుంటే ఆగస్టు 1, 2 తేదీల్లోనూ అసెంబ్లీ నిర్వహించి.. గత పదేళ్ల పాలనపై రాత్రింబవళ్లు చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఆ తప్పులకు మీరే బాధ్యులు..‘‘నాడు చంద్రబాబుతో అంటకాగి 610 జీవోనే వద్దని, మానవ వనరులు ఎక్కడున్నా వాడుకోవాలని చెప్పింది మీ నాయకుడు కేసీఆర్ కాదా? మీరు (హరీశ్రావు) కనీసం వార్డు మెంబర్ కూడా కాకపోయినా మంత్రిగా అవకాశం ఇచ్చింది వైఎస్ ప్రభుత్వం. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నది నాయిని నరసింహారెడ్డే కదా. చంద్రబాబు, వైఎస్సార్ పంచన చేరి ఊడిగం చేశారు. ఆ తప్పిదాలకు మీరే బాధ్యులు’’అని బీఆర్ఎస్ నేతలపై రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఎవరో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేస్తే వారి శవాల మీద అధికారంలోకి వచ్చారని విమర్శించారు. -
దొంగతనాలు చేసినోడివి.. సంచులు మోసి జైలుకెళ్లినోడివి..!
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డిలకు.. మాజీ మంత్రి జగదీశ్రెడ్డికి మధ్య మాట ల యుద్ధం జరిగింది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో సభ వేడెక్కింది. కిరాయి హత్యలు, దొంగతనాలు, జైలుకు వెళ్లడాల నుంచి రాజీనామాల సవాళ్ల దాకా వెళ్లింది. సోమవారం సభలో విద్యుత్ పద్దుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జోక్యం చేసుకుని జగదీశ్రెడ్డిని ఉద్దేశిస్తూ..‘‘ఆయనలో ఉక్రోషం చూస్తుంటే.. చర్లపల్లి జైలులో ఉన్నట్టుగా ఉంది’’అని వ్యాఖ్యానించారు.దీనికి జగదీశ్రెడ్డి కౌంటర్ ఇస్తూ.. ‘‘చర్లపల్లి జైలు జీవితం ఆయనకు (రేవంత్కు) అనుభవం. కాబట్టే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ తాను అక్కడికే వెళతానని భావి స్తున్నారేమో! నాకైతే ఉద్యమకాలంలో చంచల్గూడకు వెళ్లి న జైలు జీవితం గుర్తుకొస్తోంది. సీఎంకు మాత్రం చర్లపల్లి జైలులో గడిపినదే గుర్తుకొస్తోంది’’అని కామెంట్ చేశారు. మిల్లులో దొంగతనం చేస్తే ఏం చేశారో తెలుసు! జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. ‘‘సూర్యాపేట బియ్యం మిల్లులో దొంగతనం చేస్తే మిల్లర్లు ఎవరిని పట్టుకుని చెట్టుకు కట్టేశారో.. నిక్కరేసుకున్న పిల్లాడ్ని అడిగినా చెప్తాడు..’’అని వ్యాఖ్యానించారు. మంత్రి వెంకట్రెడ్డి మరిన్ని వివరాలు చెప్తారన్నారు. వెంటనే మంత్రి వెంకట్రెడ్డి లేచి జగదీశ్రెడ్డిని ఉద్దేశిస్తూ.. ‘‘ఈయన గ్రామానికి చెందిన సమితి మాజీ అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి హత్య కేసులో ఏ–2 నిందితుడు. భిక్షం అనే వ్యక్తి హత్య కేసులో ఈయన, వాళ్ల నాన్న ఏ–6, ఏ–7 నిందితులు.రామిరెడ్డి హత్య కేసులో ఏ–3 నిందితుడు. ఆ సమయంలో నల్గొండ జిల్లా నుంచి బహిష్కరించారు కూడా. ఇక మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ పెట్రోల్ బంక్లో జరిగిన దొంగతనం కేసులోనూ ఉన్నారు. మద్య నిషేధం సమయంలో కర్ణాటక నుంచి దొంగతనంగా మ ద్యం తెప్పించినందుకు మిర్యాలగూడ పోలీసుస్టేషన్లో ఇ ప్పటికీ కేసు ఉంది. దొంగతనాలు, కిరాయి హత్యలు తప్ప ఉద్యమాలు చేశాడా?’’అంటూ ఆరోపణలు గుప్పించారు. నిరూపించు.. లేకుంటే ముక్కు నేలకు రాయి! కోమటిరెడ్డి వ్యాఖ్యలతో విపక్ష బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహంగా సీట్ల నుంచి లేచి నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలో జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆయన (కోమటిరెడ్డి) మాటలను రికార్డుల నుంచి తొలగించాలి. లేదా ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. అలా చూపిస్తే.. ఇదే సభలో ముక్కు నేలకు రాస్తా. రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా.రుజువు చేయకపోతే కోమటిరెడ్డితోపాటు సీఎం కూడా ముక్కునేలకు రాసి రాజీనామా చేయాలి’’అని సవాల్ విసిరారు. దీనితోపాటు ‘‘చెత్తగాళ్ల మాటలు.. చెత్త మాటలు.. వాటిని రికార్డుల నుంచి తొలగించండి. నాపై వారు చేసిన ఆరోపణలపై సభా కమిటీ వేయండి..’’అని స్పీకర్ను కోరారు. తనపై రాజకీయ కక్షతో పెట్టిన ఆ హత్యకేసులను కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని వివరించారు. కోర్టు చుట్టూ తిరిగినది నిరూపిస్తా.. వెంటనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జోక్యం చేసుకుని.. ‘‘జగదీశ్రెడ్డి హత్య కేసులో కోర్టు చుట్టూ 16 ఏళ్లు తిరిగారని నిరూపిస్తా. నేను అన్నది నిరూపించకపోతే ఇదే సభలో మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నల్గొండ ఎస్పీ, కోర్టు నుంచి రికార్డులు తెప్పించండి’’అని పేర్కొన్నారు. ఈ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ జోక్యం చేసుకుని.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ట్రెజరీ బెంచ్ నుంచి అలాంటి వ్యాఖ్యలు వస్తాయని, సబ్జెక్టుపై మాట్లాడాలని జగదీశ్రెడ్డికి సూచించారు.జగదీశ్రెడ్డి బదులిస్తూ.. ‘‘స్పీకర్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదు. నేనెక్కడా విషయాన్ని పక్కదారి పట్టించలేదు. సీఎం, కోమటిరెడ్డిలే సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు’’అని పేర్కొన్నారు. దీనిపై సభావ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు అభ్యంతరం చెప్పారు. సభ్యులను అవమానించేలా మాట్లాడిన జగదీశ్రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంచులు మోసి జైలుకెళ్లింది మీరేనంటూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని జగదీశ్రెడ్డి పదేపదే కోరడంతో స్పీకర్ స్పందించారు. రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ను ఉద్దేశించి జగదీశ్రెడ్డి విమర్శలు చేశారు. ‘‘మా నేత కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే. మీలాగా సంచులు మోసే చంద్రుడు కాదు. సంచులు మోసి జైలుకు పోయింది మీరే’’అని వ్యాఖ్యానించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. ఈ దశలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తర్వాత జగదీశ్రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.జగదీశ్రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపుశాసనసభలో సీఎం, ఇతరులను ఉద్దేశించి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. తర్వాత తాను మాట్లాడుతానంటూ బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు అనుమతి కోరగా.. స్పీకర్ తిరస్కరించారు. దీనితో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. పల్లా రాజేశ్వర్రెడ్డి, జగదీశ్రెడ్డి తదితరులు స్పీకర్ వెల్లోకి వెళ్లి నినాదాలు చేయగా.. స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాదలు కాపాడాలని కోరారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తమ కురీ్చల వద్దకు వెళ్లారు. -
సీతక్కపై పాడి కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీలో దుమారం
సాక్షి,హైదరాబాద్: మహిళలకు ఉచిత బస్సు స్కీమ్పై తెలంగాణ అసెంబ్లీలో సోమవారం(జులై 29) దుమారం రేగింది. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ క్రమంలో మంత్రి సీతక్కకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు, ఆర్టీసీ కార్మికులకు ఏం చేసిందో నాలెడ్జ్ లేకపోవచ్చని కౌశిక్రెడ్డి అన్నారు. నాలెడ్జ్ లేదు అన్న మాటలపై కాంగ్రెస్ సీరియస్ అయింది. నాలెడ్జ్ లేదు అన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలి లేదా ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్పీకర్ కలుగజేసుకోవడంతో సీతక్కపై మాట్లాడిన మాటలను కౌశిక్రెడ్డి వెనక్కి తీసుకున్నారు. -
సీఎం రేవంత్పై ప్రివిలేజ్ మోషన్: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. సోమవారం(జులై 29) అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ‘గవర్నమెంట్ డిఫెన్స్లో పడినప్పుడు సీఎం ఏదో పేపర్ పట్టుకొని సభలోకి వచ్చి డైవర్ట్ చేస్తున్నారు. సభా నాయకుడు మిస్ లీడ్ చేస్తున్నారు. మోటార్లకు మీటర్ల అంశంలో మెటీరియల్లో అదర్ దేన్ అగ్రికల్చర్ మీటర్స్ అనే పదాలను కావాలని ఎగరగొట్టి చదివారు. అప్పులు 7 లక్షల కోట్లు అని తప్పుగా చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయలేదని చెప్పే ప్రయత్నం నేను చేస్తుండగా... మోటర్లకు మీటర్లు పెట్టడానికి సంతకం చేశారని రేవంత్ లేచి సభను మిస్ లీడ్ చేశారు.దబాయింపు చర్యలకు సీఎం పాల్పడుతున్నారు. ఇండియా కూటమి 28 పార్టీల కలయికతో కాంగ్రెస్కు ఆ మాత్రం ఎంపీ సీట్లు వచ్చాయి. 28 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్కు 21 శాతం ఓట్లు వచ్చాయి. రేవంత్ పనితీరు బాగోలేకపోవడంతోనే మహబూబ్ నగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి పార్లమెంట్లో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. రేవంత్ సొంత జిల్లాలో లోకల్ బాడి ఎమ్మెల్సీ స్థానం కూడా ఓడిపోయారు.గతంలో 20 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాలేదా ? చీమలు పెట్టిన పుట్టలో పాము దురినట్లు రేవంత్ కాంగ్రెస్లతో చేరి సీఎం అయ్యారు. అసలు కాంగ్రెస్లో హనుమంత్ రావు లాంటి నేతలు ఏమయ్యారు ? జైపాల్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానివ్వలేదు’అని హరీశ్రావు అన్నారు. -
TG: అసెంబ్లీలో వైఎస్ఆర్ను పొగిడిన అక్బరుద్దీన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ పొగిడారు. బడ్జెట్లో సోమవారం(జులై 29) బడ్జెట్పై మాట్లాడిన సందర్భంగా ఒవైసీ వైఎస్ఆర్ను గుర్తుచేసుకున్నారు. ముస్లింలకు రిజర్వేషన్ విషయంలో వైఎస్ఆర్ న్యాయం చేశారని కొనియాడారు.ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీల మదిలో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. వైఎస్ఆర్ లేకపోతే రిజర్వేషన్ల అంశంలో తమకు అన్యాయం జరిగేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో సాయం చేశారని గుర్తుచేశారు. ఎవరు న్యాయం చేసినా వాళ్ల గురించి మొహమాటం లేకుండా చెప్తానన్నారు. -
సభలో సవాల్.. జగదీష్ రెడ్డి Vs మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్, మంత్రులు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. దీంతో, ఆరోపణలు నిజమైతే రాజీనామాలకు సిద్ధమని జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేసుకున్నారు.కాగా, విద్యుత్ అంశంపై చర్చలో భాగంగా గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్కు కౌంటరిచ్చారు.జగదీష్ రెడ్డి కామెంట్స్..సంచుల మూటలు పట్టుకుని దొరికిన వ్యక్తి.చర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాలను రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాను.మేము తెలంగాణ కోసం ఎన్నో మంచి పనులు చేశాను. జగదీష్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్..జగదీష్ రెడ్డి సూర్యాపేటలో దారుణాలు చేశారు.ఆయనపై మర్డర్ కేసులు కూడా ఉన్నాయి.మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు.దీంతో, సభలో గందరగోళం నెలకొంది.నేను చెప్పిన కేసులో జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడు. జగదీష్ రెడ్డి కౌంటర్..నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను.సభలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతాను.కోమటిరెడ్డి తన ఆరోపణలు నిరూపించాలి.నాపై కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కేసులు పెట్టింది.మూడు కేసుల్లో కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించింది.సభలో ఆరోపణలపై హౌస్ కమిటీ వేయండి.మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడు.మీలాగా డబ్బుల సంచులు పట్టుకుని తిరగలేదు.కోమటిరెడ్డి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. కోమటిరెడ్డి కామెంట్స్..జగదీష్ రెడ్డి ఛాలెంజ్ను స్వీకరిస్తున్నాను.నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.నేను చేసిన ఆరోపణలను నిరూపిస్తాను.ఒకవేళ నిరూపించలేకపోతే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అంతకుముందు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కరెంట్ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేయమని అడిగింది మీరే.సత్యహరిశ్చంద్రుడు మా నాయకుడి రూపంలో పుట్టారన్నట్టు మాట్లాడారు.జ్యుడీషియల్ కమిషన్ ముందుకెళ్లి మీ వాదన వినిపించి ఉంటే మీ నిజాయితీ తెలిసేది.కానీ, మీరు కమిషన్ విచారణే వద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.విచారణ కొనసాగించాల్సిదేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.కమిషన్ ఛైర్మన్ను మాత్రమే మార్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్కు కొత్త ఛైర్మన్ పేరును ప్రకటిస్తాం.తెలంగాణను సంక్షోభం నుంచి కాపాడింది సోనియా గాంధీ, జైపాల్ రెడ్డి మాత్రమే.సోనియా గాంధీ దయ వల్ల రాష్ట్రం కరెంట్ సమస్య నుంచి గట్టెక్కింది.లేనిపక్షంలో తెలంగాణ చీకటిమయమయ్యేది.నాడు నేను టీడీపీలో ఉన్నా అసెంబ్లీలో వాస్తవాలు చెప్పాను. దీంతో, నన్నుమార్షల్స్ను పెట్టి బయటకు ఇడ్చుకెళ్లారు. సోలార్ పవర్లో ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. దీంతో, కరెంట్ ఉత్పత్తి పెరిగింది. సిగ్గులేకుండా ఇంకా మేము విద్యుత్ ఉత్పత్తి చేశామని చెప్పుకుంటున్నారు.బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్లు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చారు.ఆఖరికి అటెండర్ పోస్టులు కూడా వాళ్ల బినామీలకే ఇచ్చారు.ఈ సందర్భంగా వాళ్లకు కావాల్సిన వాళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇక్కడేవిచారణ అంటే భయపడి కోర్టుకు వెళ్లారు.టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇంకా విద్యుత్ ఉత్పత్తి కాలేదు.ఇండియా బుల్స్ నుంచి రూ.1000 కోట్లు దండుకున్నారు.భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ నీళ్లలో మునిగిపోతోంది. -
కాంగ్రెస్ Vs జగదీష్ రెడ్డి.. అసెంబ్లీలో ‘పవర్’ వార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ విద్యుత్ రంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు వర్సెస్ జగదీష్ రెడ్డి అనే విధంగా చర్చ నడుస్తోంది. నేతల మధ్య పవర్ వార్ జరుగుతోంది.విద్యుత్ రంగంపై చర్చను మొదట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.రాజగోపాల్ రెడ్డి కామెంట్స్..గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.అందుకే పవర్ సెక్టార్ గందరగోళంగా మారింది.రైతులకు ఉచిత కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.విద్యుత్ రంగం అస్తవ్యస్తమైంది.యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వల్ల 1800 మెగావాట్ల అదనపు కరెంట్ రాష్ట్రానికి వచ్చింది.కేసీఆర్ ఎందుకు రాలేదంటే, మీ స్థాయికి మేము చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.ఇంత పెద్ద విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు రాలేదు.మీ స్థాయి ఏంటో ప్రజలు మీకు చెప్పారు.కనీసం అధికారులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు.చేసిన తప్పులు చాలవని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.గనులకు 250 కి.మీలకు దూరం ఉన్న దామెరచెర్ల దగ్గర పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారు?.యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.పవర్ ప్లాంట్లో టెండర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. అనంతరం, జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..ఇప్పటి వరకు డిమాండ్ బుక్స్ ఇవ్వలేదు.దేనిపై మాట్లాడాలో అర్థం కావడం లేదుచర్చించడానికి సమయం లేదంటున్నారు.పది రోజుల ముందే సభ పెడితే ఏమయ్యేది: జగదీష్ రెడ్డి.ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సమంజసమేనా?.మీటర్ల విషయంలో సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు.కరెంట్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.ఉదయ్ స్కీమ్లో 27 రాష్ట్రాలు చేరాయి.స్మార్ట్ మీటర్లతో డిస్కంలు చేరాయి. మీటర్ల విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు.ఒప్పందంలో వాళ్లకు అనుకూలమైన అంశాలను మాత్రమే చెప్పారు.తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు విద్యుత్ అందించామన్నారు.అంతకుముందు మధ్యలో..డిమాండ్ బుక్స్ నిన్నే రాత్రే పంపించామని స్పీకర్ చెప్పారు.మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిమాండ్ బుక్స్ ఇప్పటికే పంపించాం.పదేళ్లలో రేపు చర్చ ఉండే ఈరోజు రాత్రి 10 గంటలకు వచ్చి మాకు బుక్స్ ఇచ్చేవారు. ఇదే సమయంలో హరీష్ రావు మాట్లాడటంతో శ్రీధర్ బాబు ఫైర్.హరీష్ రావు బుల్డోడ్ చేసేపని పెట్టుకున్నారు.ఇది మానుకోవాలి. సభను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు.మీరు త్వరగా ఇంటికి వెళ్తే మేమేం చేస్తాం అంటూ కౌంటర్.. -
తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. రేపు లక్షన్నరలోపు రుణమాఫీ నిధులు జమ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులకు మరో శుభవార్త అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు తెలంగాణలో రెండో విడతలో రైతులకు రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. లక్షన్నరలోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి రేపు నిధులు జమ చేయనున్నారు.కాగా, సీఎం రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీ ఆవరణలో రైతుల రుణమాఫీపై చెక్కులను ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో లక్షన్నరలోపు ఉన్న రుణాలను రేపు విడుదల చేయనున్నారు. ఇక, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా రుణమాఫీపై చర్చ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. రెండు లక్షలలోపు రుణాలను వచ్చే నెలలో జమ చేయనున్నారు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. పవర్పై వాడీవేడి చర్చ
Updates.. సీఎం రేవంత్ కామెంట్స్..కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.ఇలా మాట్లాడితే ప్రాసిక్యూలేషన్ చేయాల్సి వస్తుంది.కమిషన్ ఛైర్మన్ను మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.విచారణ ఆపాలని కోర్టు చెప్పలేదు. 2021లో పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్నారు.ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు.రూ.81వేల కోట్లు అప్పులకు కారణమయ్యారు.నల్లగొండ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లోనే మీ సంగతి తేలిపోయింది.పవర్ ప్లాంట్ పేరుతో దోచుకున్నారు. 👉మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..మీరు ఫ్లోరోసిన్ను మాకు బహుమతిగా ఇచ్చారు.బీహెచ్ఈఎల్కు కాంట్రాక్ట్ ఇస్తే తప్పేంటి?.పవర్ ప్లాంట్ నల్లగొండలో కడితే తప్పు.. వేరే చోట కడితే తప్పా?.సూపర్ క్రిటికల్లో అయితే నాలుగేళ్లలో భద్రాద్రి పవర్ ప్లాంట్ పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ చెప్పింది.బీహెచ్ఈఎల్ సబ్ కాంట్రాక్ట్ల్లో మా బంధువు ఒక్కరు కూడా లేరు.మీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కరెంట్ పోయిందని అధికారులకు ఫోన్ చేశారు.నల్లగొండ తెలంగాణలో లేదా?.కరెంట్ లేదని హెల్ఫ్లైన్కు ఫోన్ చేస్తే కేసులు పెడుతున్నారు.దానిపై ఎందుకు మాట్లాడటం లేదు?.జీవన్ రెడ్డిపై కూడా కేసు పెడతారా?. 👉గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాపై మూడు మర్డర్ కేసులు పెట్టారు - జగదీష్ రెడ్డి👉మూడు మర్డర్ కేసుల్లో కోర్టు నిర్దోషిగా తీర్చి కేసులను కొట్టివేసింది - జగదీష్ రెడ్డి.👉మంత్రి కోమటిరెడ్డి నాపై రెండు మర్డర్ కేసుల ఆరోపణలు చేశారు - జగదీష్ రెడ్డి.👉ఆ మర్డర్ కేసులో అంశంపై హౌస్ కమిటీ వేయాలని కోరుతున్నా - జగదీష్ రెడ్డి.👉హౌస్ కమిటీ వేసి నిజా నిజాలు తేల్చాలి - జగదీష్ రెడ్డి.👉హౌస్ కమిటీ ద్వారా నిజాలు తేలుతాయి అప్పుడు రాజీనామా వాళ్లు చేస్తారా నేను చేస్తానా అనేది తెలుస్తుంది.👉నేను ఉద్యమంలో పనిచేశాను ఆ కేసులు ఉన్నాయి.. వాళ్ల లాగా సంచులు మోసిన జీవితం నాది కాదు. - జగదీష్ రెడ్డి👉సంచులు మోసి జైలుకుపోయిన జీవితం నాది కాదు. జగదీష్ రెడ్డి👉రికార్డుల నుంచి తొలగించాలి అంటే ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలను సైతం తొలగించాలి. - జగదీష్ రెడ్డి. 👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పై వ్యాఖ్యల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్👉మర్డర్ కేసులో జైశ్వర్ రెడ్డి ఉన్నారు - కోమటి రెడ్డి👉ఏడాది పాటు జగదీష్ రెడ్డిని జిల్లా బహిష్కరించింది - మంత్రి.👉కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు - జగదీష్ రెడ్డి.👉కోమటిరెడ్డి చెప్పినట్లుగా నా పై కేసులు ఉన్నట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. - జగదీష్ రెడ్డి👉నిరూపించకపోతే ముఖ్యమంత్రి కోమటిరెడ్డి ఇద్దరు రాజీనామా చేసి ముక్కు నేలకు రాయాలి. - జగదీష్ రెడ్డి👉జగదీష్ రెడ్డి సవాలను స్వీకరిస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.👉కేసులో రికార్డులు బయటపెడతా... లేకపోతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా - కోమటి రెడ్డి వెంకట్ రెడ్ 👉సీఎం రేవంత్కు జగదీష్ రెడ్డి కౌంటర్..👉చర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాలను రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.👉మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాను.👉జగదీష్ రెడ్డి సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేసింది మర్చిపోయాడు.👉మర్డర్ కేసులో జగదీష్ రెడ్డి ఏ-2: మంత్రి కోమటిరెడ్డి👉మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు.👉రాంరెడ్డి హత్య కేసులో ఏ-6👉లక్షా 80వేల దొంగతనం కేసులో ముద్దాయి జగదీష్ రెడ్డి.👉నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. సభలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతాను.👉జగదీష్ రెడ్డి ఛాలెంజ్ను స్వీకరిస్తున్నాను.👉నేను చెప్పిన కేసులో జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడు.👉కోమటిరెడ్డి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. సీఎం రేవంత్ సీరియస్ కామెంట్స్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కరెంట్ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేయమని అడిగింది మీరే.సత్యహరిశ్చంద్రుడు మా నాయకుడి రూపంలో పుట్టారన్నట్టు మాట్లాడారు.జ్యుడీషియల్ కమిషన్ ముందుకెళ్లి మీ వాదన వినిపించి ఉంటే మీ నిజాయితీ తెలిసేది.కానీ, మీరు కమిషన్ విచారణే వద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.విచారణ కొనసాగించాల్సిదేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.కమిషన్ ఛైర్మన్ను మాత్రమే మార్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్కు కొత్త ఛైర్మన్ పేరును ప్రకటిస్తాం.తెలంగాణను సంక్షోభం నుంచి కాపాడింది సోనియా గాంధీ, జైపాల్ రెడ్డి మాత్రమే.సోనియా గాంధీ దయ వల్ల రాష్ట్రం కరెంట్ సమస్య నుంచి గట్టెక్కింది.లేనిపక్షంలో తెలంగాణ చీకటిమయమయ్యేది.నాడు నేను టీడీపీలో ఉన్నా అసెంబ్లీలో వాస్తవాలు చెప్పాను. దీంతో, నన్నుమార్షల్స్ను పెట్టి బయటకు ఇడ్చుకెళ్లారు. సోలార్ పవర్లో ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. దీంతో, కరెంట్ ఉత్పత్తి పెరిగింది. సిగ్గులేకుండా ఇంకా మేము విద్యుత్ ఉత్పత్తి చేశామని చెప్పుకుంటున్నారు.బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్లు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చారు.ఆఖరికి అటెండర్ పోస్టులు కూడా వాళ్ల బినామీలకే ఇచ్చారు.ఈ సందర్భంగా వాళ్లకు కావాల్సిన వాళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇక్కడేవిచారణ అంటే భయపడి కోర్టుకు వెళ్లారు.టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇంకా విద్యుత్ ఉత్పత్తి కాలేదు.ఇండియా బుల్స్ నుంచి రూ.1000 కోట్లు దండుకున్నారు.భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ నీళ్లలో మునిగిపోతోంది. 👉అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. 👉ఇప్పటి వరకు డిమాండ్ బుక్స్ ఇవ్వలేదన్న జగదీష్ రెడ్డి.👉రాత్రే పంపించామన్న స్పీకర్👉దేనిపై మాట్లాడాలో అర్థం కావడం లేదు: జగదీష్ రెడ్డి.👉పదేళ్లలో రేపు రాత్రి 10 గంటలకు వచ్చి మాట్లాడే వాళ్లు: శ్రీధర్ బాబు👉హరీష్ రావు బుల్డోడ్ చేసేపని పెట్టుకున్నారు. ఇది మానుకోవాలి: శ్రీధర్ బాబు👉మీరు త్వరగా ఇంటికి వెళ్తే మేమేం చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు. 👉పది రోజుల ముందే సభ పెడితే ఏమయ్యేది: జగదీష్ రెడ్డి.👉ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సమంజసమేనా?.👉మీటర్ల విషయంలో సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు.👉కరెంట్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.👉ఉదయ్ స్కీమ్లో 27 రాష్ట్రాలు చేరాయి.👉ఒప్పందంలో వాళ్లకు అనుకూలమైన అంశాలను మాత్రమే చెప్పారు.👉స్మార్ట్ మీటర్లతో డిస్కంలు చేరాయి. మీటర్ల విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. 👉అసెంబ్లీలో విద్యుత్పై చర్చ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. అందుకే పవర్ సెక్టార్ గందరగోళంగా మారింది. రైతులకు ఉచిత కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. విద్యుత్ రంగం అస్తవ్యస్తమైంది. యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వల్ల 1800 మెగావాట్ల అదనపు కరెంట్ రాష్ట్రానికి వచ్చింది. కేసీఆర్ ఎందుకు రాలేదంటే, మీ స్థాయికి మేము చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇంత పెద్ద విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు రాలేదు. మీ స్థాయి ఏంటో ప్రజలు మీకు చెప్పారు.కనీసం అధికారులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. చేసిన తప్పులు చాలవని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు?.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.గనులకు 250 కి.మీలకు దూరం ఉన్న దామెరచెర్ల దగ్గర పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారు?.యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.పవర్ ప్లాంట్లో టెండర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. 👉విద్యుత్ మీటర్ల అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్.సీఎం రేవంత్ రెడ్డి మాపై బురద జల్లే ప్రయత్నం చేశారని దీనిపై చర్చకు సిద్దమంటున్న బీఆర్ఎస్.హోం శాఖ, మెడికల్ అండ్ హెల్త్పై మాట్లాడనున్న - మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.ఎడ్యుకేషన్ పై చర్చపై మాట్లాడనున్న- ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.ఎక్సైజ్ , ట్రాన్స్ పోర్ట్ చర్చపై మాట్లాడనున్న - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.విద్యుత్ చర్చ పై మాట్లాడనున్న - మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిఎం అండ్యూడీ, ఐటీ మున్సిపల్ చర్చపై మాట్లాడనున్న - ఎమ్మేల్యే వివేకా నంద గౌడ్. 👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ఐదో రోజు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, నేడు ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్పైనే చర్చించనున్నారు.👉మరోవైపు.. నేడు సభలో 19 పద్దులపై శాసనసభలో చర్చ ఉండనుంది. ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్లపై, మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఎంఏయూడీలపై చర్చ జరుగుతుంది.పరిశ్రమల శాఖ పద్దులపై చర్చ..👉ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్పై కూడా చర్చించనున్నారు. 19 పద్దులపై చర్చించిన తర్వాత వాటికి శాసనసభ ఆమోదం తెలుపనుంది. ఇక, ముఖ్యమంత్రి వద్దనే మున్సిపల్, విద్యాశాఖ, హోం శాఖ ఉన్న విషయం తెలిసిందే.👉మోటర్లకు మీటర్లు పెట్టేందుకు 2017లోనే ఉదయ్ స్కీంలో గత ప్రభుత్వం సంతకం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఉదయ్ స్కీంపై సంతకం చేయ్యలేదని, మీటర్లు పెట్టలేదు బీఆర్ఎస్ చెబుతోంది. దీనిపై కూడా సభలో చర్చ జరుగనుంది. ఇదిలాఉండగా.. అసెంబ్లీలో పోడు భూముల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు -
కేటీఆర్.. గోబెల్స్గా పేరు మార్చుకో!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు దారుణమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. ఓటమిని తట్టుకోలేక కేటీఆర్కు మతిభ్రమించి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాల్లో గోబెల్స్ను కేటీఆర్ మించిపోయారని.. ఆయన పేరును జోసెఫ్ గోబెల్స్రావుగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఆరోపణలు, అబద్ధాలు కాదు.. ఆధారాలుంటే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు అందించాలని సవాల్ చేశారు. ఆదివారం జలసౌధ నుంచి నీటి పారుదల శాఖ క్షేత్రస్థాయి ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉత్తమ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మేడిగడ్డ కుంగుబాటు ఘటన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని, రాష్ట్రంలో ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు.. బరాజ్ను వారు ఏమైనా చేయగలరని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. గత ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా నిర్మించడంతోనే బరాజ్ కుంగిపోయింది. గత ఏడాది అక్టోబర్ 21న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బరాజ్ కుంగిపోగా.. తర్వాత 45 రోజులు వారే అధికారం ఉన్నారు. ప్లానింగ్, డిజైన్లు, నిర్మాణ లోపాలతోనే కాళేశ్వరం బరాజ్లు ఫెయిల్ అయ్యాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) బీఆర్ఎస్ హయాంలోనే నివేదిక ఇచి్చంది. 2019లోనే లోపాలు బయటపడినా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను 2019లో ప్రారంభించిన నాటి నుంచే లోపాలు, సమస్యలు బయటపడ్డాయి. మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులపై 2019 నుంచీ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీతో నీటిపారుదల శాఖ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిందని విజిలెన్స్ విచారణలో తేలింది కూడా. లోపాలను పట్టించుకోకపోవడం వల్లే క్రమంగా నష్టం పెరిగింది. అసలు మేడిగడ్డ వద్ద బరాజ్ వద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీటి సమస్య తలెత్తితే దానికి కేసీఆర్, కేటీఆర్లే కారణం. ఐదేళ్లలో 30లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.10,820 కోట్లు కేటాయించాం. ఆయా ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని క్షేత్రస్థాయి ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశాం. ఈ ఏడాది నుంచే ఏటా 6లక్షల ఎకరాల చొప్పున.. వచ్చే ఐదేళ్లలో 30లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి 15 రోజులకోసారి పురోగతిపై సమీక్ష నిర్వహిస్తా. బీఆర్ఎస్ వాళ్లు చెప్తే కాదు.. రైతుల కోసం.. గత ఐదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 65 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసింది. అంటే సగటున ఏటా 13 టీఎంసీలే తరలించింది. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో.. రైతుల కోసం మేం పంపింగ్ ప్రారంభించాం. బీఆర్ఎస్ వాళ్లు చెబితేనే చేశామనడం సరికాదు. ఒకవేళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీళ్లు నిల్వ చేస్తే.. అవి తెగిపోయి దిగువన భదాచలం పట్టణం, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ బరాజ్లు, 44 గ్రామాలు నీటిమునిగి భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. వాటి నుంచి నీటిని పంపింగ్ చేసే పరిస్థితి లేకున్నా.. ఎల్లంపల్లి నుంచి లిఫ్టింగ్ చేపట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగతా జలాశయాలను నింపి రైతులకు నీళ్లను అందిస్తాం’’అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
‘పంచాయతీ’ మాదే
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: వచ్చే పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించి ఉంటే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా కొన్ని సీట్లు గెలిచేదని.. కానీ వారికి ఆ అవకాశం లేకుండా పోయినట్టేనని వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయత్తం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యతను నాయకులుగా తామే తీసుకుంటామని చెప్పారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి వర్ధంతి సందర్భంగా.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన సభలో రేవంత్ పాల్గొన్నారు. కల్వకుర్తి సమీపంలోని కొట్ర చౌరస్తాలో జైపాల్రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కల్వకుర్తి సభలో సీఎం రేవంత్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు మొదలైనట్టేనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు అన్నారు.ప్రజలెవరికీ ఎలాంటి కష్టాలు రాలేదు. కేసీఆర్ కుటుంబానికే కష్టం వచ్చింది. ఆ కష్టాలను కప్పిపుచ్చుకునేందుకే పేదలపై నెడుతున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రారని, తామే వస్తామని ఈ నెల 24న బడ్జెట్ సమావేశాల్లో కేటీఆర్ చెప్పారు. కానీ మరుసటి రోజు ఉదయమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కూర్చున్నారు. తండ్రీ కొడుకుల మధ్యలోనే సమన్వయం లేదు. వారిలో అధికారం కోల్పోయిన బాధ కనిపిస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చినా బుద్ధి రాలేదు. కేటీఆర్ సెల్ఫీలు, సెల్ఫ్ డబ్బా కోసమే గోదావరి వెంట ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్నాడు.కాంగ్రెస్ మాట ఇస్తే అది నెరవేరినట్టే!పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓ సన్నాసి సవాల్ విసిరిండు.. ఆ సవాల్ స్వీకరించి ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం జూలైలోనే రూ.లక్ష వరకు రైతుల రుణమాఫీ చేశాం. నెలాఖరులోపు రూ.1.5 లక్షలలోపు రైతుల రుణాలు మాఫీ చేయబోతున్నాం. వచ్చే నెల 2 నుంచి 14వ తారీఖు వరకు విదేశీ పర్యటనకు వెళుతున్నా.. తిరిగి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిచేసి తీరుతాం. కాంగ్రెస్ మాట ఇస్తే అది నెరవేరి తీరుతుందికల్వకుర్తి అభివృద్ధికి రూ.309 కోట్లుఆగస్ట్ 1న రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.100 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నాం. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ.309 కోట్లు కేటాయిస్తున్నా.. హైదరాబాద్– కల్వకుర్తి– శ్రీశైలం జాతీయ రహదారిని హైదరాబాద్ నుంచి కల్వకుర్తి రోడ్ వరకు నాలుగు లేన్లుగా విస్తరిస్తాం..’’ అని రేవంత్ ప్రకటించారు.ప్రజాస్వామ్య విలువలతో కాంగ్రెస్ పాలన: మంత్రి దామోదరకాంగ్రెస్ పాలన ప్రజాస్వామ్య విలువలతో సాగుతోందని.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి రాజకీయ నేతగానే కాకుండా తత్వవేత్తగా ఎదిగారని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో జైపాల్రెడ్డి కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఈ సభలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణలో ఆనాడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది2014లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాకపోవడానికి కారణాలేమిటని పార్టీ పెద్దలు ఇటీవల నన్ను అడిగారు. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీఎం ఎవరన్నది చెప్పకపోవడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని నేను వివరించాను. నాడు పార్లమెంట్కు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు అంతా గందరగోళం నెలకొంది. తెలంగాణ బిల్లు పాస్ చేసే సమయంలో.. పార్లమెంట్లో ఉన్న హౌస్ ఆఫ్ మూడ్ను బట్టి, పార్లమెంటు తలుపులు మూసి బిల్లుకు ఆమోదం తెలపాల్సిందిగా నాటి స్పీకర్ మీరాకుమారికి జైపాల్రెడ్డి సూచించారు.ఆయన సలహా మేరకే తెలంగాణ బిల్లు పాస్ అయింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా జైపాల్రెడ్డిని ప్రకటించి ఉంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది. ఈ విషయంలో పార్టీ విధానపరమైన లోపంతో కాంగ్రెస్కు నష్టం వాటిల్లిందని నేను వివరించాను. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అధికారంలో ఉన్నా, లేకున్నా..చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో కొనసాగారు. పదవులకే గౌరవం తెచ్చేలా వ్యవహరించారు. – సీఎం రేవంత్రెడ్డి -
రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, మహబూబ్నగర్: జైపాల్ రెడ్డి ఓ సిద్దాంత కర్త అని.. నమ్మిన సిద్దాంతాల కోసం పని చేసిన గొప్ప నాయకుడని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. కొట్ర చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ, 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తామన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ స్కిల్ సెంటర్ ఆమనగల్లులో ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్-శ్రీశైలం రహదారిని త్వరలో నాలుగు లైన్లుగా మారుస్తామని రేవంత్ అన్నారు. ముచ్చర్లలో ఆగస్టు1న యంగ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 50 ఎకరాల్లో రూ. 100 కోట్లతో పనులు మొదలు పెడతాం.. దీంతో యువత నైపుణ్యాలు పెరుగుతాయని రేవంత్ అన్నారు.జూలై 31 నాటికంటే ముందే రూ.లక్షన్నర లోపు రుణమాఫీ చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటామని రేవంత్ అన్నారు.‘‘కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్కసీటు కూడా రాదు. కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేసి అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తాం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలి’’ రేవంత్ పిలుపునిచ్చారు. -
మేడిగడ్డ నింపితే భద్రాద్రి రామునికి ముప్పు: మంత్రి ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తప్ప మిగిలిన అన్ని బ్యారేజీలు నింపుతామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం(జులై 28) జలసౌధలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ‘కాళేశ్వరం లో మూడు బ్యారేజీలు తప్ప మిగతా అన్ని రిజర్వాయర్లను వాడుకుంటాం. కాళేశ్వరం నీళ్లు రాక ఉత్తర తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడితే దానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడు బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయి. కేటీఆర్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.కేటీఆర్ జోసఫ్ గోబెల్స్ కి మించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీళ్లు ఆపితే జరిగే ప్రమాదానికి ఎవరు భాధ్యత వహిస్తారు. ప్రమాదం జరిగితే భద్రాచలం రాముడి గుడి కూడా మునుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా మూడు, నాలుగు టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన బ్యారేజీలు లేవు. ప్రచారం కోసం, కమిషన్ల కోసం పెద్ద బ్యారేజీలు కట్టి కుంగగొట్టారు. లక్ష కోట్ల కుంభకోణంలో కేసీఆర్ అండ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇరిగేషన్ శాఖలో ఇక నుంచి ఒక కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నాం’అని చెప్పారు. మంత్రి ప్రెస్మీట్లో మూడుసార్లు పవర్కట్..మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం జలసౌధలో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా మూడుసార్లు కరెంటు పోయింది. గంట వ్యవధిలో మూడు సార్లు కరెంటు పోయింది. కరెంటు వెంటనే రాకపోవడంతో జనరేటర్తో మంత్రి ప్రెస్మీట్ నిర్వహించారు. పవర్ కట్ సమయంలో జలసౌధ భవనంలో పలువురు లిఫ్టులో ఇరుక్కుపోయారు. -
‘ఎంఐఎం’ అంటే గోడ మీద పిల్లి.. బండి సంజయ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో ఎంఐఎం గోడ మీద పిల్లిలాంటిది.. ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుంది అంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో అక్బరుద్దీన్ ఒకవేళ అక్కడి నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆదివారం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలి. గత పాలకులు ఇదే తరహాలో చేస్తే ఏమైందో అందరూ చూశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అమ్మవారి టెంపుల్ను గోల్డెన్ టెంపుల్గా మార్తుస్తామన్నారు. నేను హిందువుల తరపున పక్కా మాట్లాడుతా. అలా అని వేరే మతానికి వ్యతిరేకం కాదు.ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ గోడ మీద పిల్లిలాంటిది. ఎవరు అధికారంలో ఉంటే వారి పార్టీ పక్కన చేరుతారు. అధికారంపోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటారు. అక్బరుద్దీన్ను డిప్యూటీ సీఎం చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్, అక్బరుద్దీన్ అన్నదమ్ములయ్యారు. దమ్ముంటే అక్బరుద్దీన్ కొడంగల్ నుంచి పోటీ చేయాలి. ఒకవేళ ఆయన అక్కడ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
మీ ఆరోపణల్లో నిజం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని రాష్ట్రానికి పెద్దన్న లాంటి వారని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతుల విషయంలో సహకరించాలని కోరుతూ తాను మోదీని అన్నయ్య (బడే భాయ్)గా సంబోధించానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివరణ ఇచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి పోతే 47 పైసలే తిరిగి వస్తున్నాయన్నారు. గుజరాత్, యూపీకి నిధులు ఇచి్చనట్లే తెలంగాణకు సైతం ఇవ్వాలని కోరానని గుర్తుచేశారు.ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య సఖ్యత ఉండాలనే అలా చెప్పినట్టు స్పష్టం చేశారు. బడ్జెట్ పద్దుపై శనివారం చర్చలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ అమిత్ షాపై కేసు ఎత్తివేత గురించి చేసిన ఆరోపణల్లో నిజం లేదని తోసిపుచ్చుతూ ఆయన వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చిన్నారులను వినియోగించిన కేసులో కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్రెడ్డి పాత్ర లేదని, నిర్వాహకులే దానికి బాధ్యులని తేలడంతో హైదరాబాద్ పోలీసులు వారిపై కేసు ఉపసంహరించుకున్నారని రేవంత్ పేర్కొన్నారు.టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదుతోనే వారిపై అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. కానీ ఆ కేసును ఎత్తేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. మోదీని ఎంత పొగిడినా తనకు బీజేపీ వార్డు సభ్యుడి టికెట్ కూడా ఇవ్వదని.. కాంగ్రెస్ పారీ్టయే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అక్బరుద్దీన్పై ఉన్న కేసు వివరాలను తెలుసుకుంటానని చెప్పారు. ఏ జైలో తేల్చుకోవాలని ఎల్అండ్టీకి స్పష్టం చేశా ఎంఐఎం గత పదేళ్లు బీఆర్ఎస్తో చేసిన తప్పుడు దోస్తీతో పాతబస్తీకి చాలా నష్టం జరిగిందని, ఇప్పు డు సరైన దోస్తును గుర్తించారని సీఎం రేవంత్ ఛలోక్తి విసిరారు. రేవంత్ తన బాల్య స్నేహితుడని, సీఎం కుర్చీలో ఆయన్ను చూడటం సంతోషకరమ ని అక్బరుద్దీన్ అనడంతో ఈ మేరకు సీఎం స్పందించారు. పాతబస్తీలో మెట్రో ప్రాజెక్టు నిర్మించలేమని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చేతులెత్తేసిందని.. ప్రాజెక్టును నిర్మించకపోతే చంచల్గూడ జైలుకెళ్తారో లేక చర్లపల్లి జైలుకెళ్తారో తేల్చుకోవాలని ఆ కంపెనీకి తాను స్పష్టం చేసినట్లు సీఎం వెల్లడించారు.తమకు కావాల్సిన వారి భూము ల ధరలను పెంచుకోవడానికి గత ప్రభుత్వం అవసరం లేకున్నా హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్టుకు మెట్రోలైన్ నిర్మాణానికి టెండర్లు సైతం పిలిచిందని, తాము అధికారంలోకి రాగానే రద్దు చేశామన్నారు. నాటి సీఎం వైఎస్సార్తోపాటు నాటి కేంద్రమంత్రి ఎస్.జైపాల్రెడ్డి సమ ష్టి కృషితో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు సాకారమైందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా మెట్రో రెండో దశ ప్రాజెక్టు చేపట్టనున్నామని, కేంద్రం 15%, రాష్ట్రం 35%,45% రుణం,5% పీపీపీ విధానంలో నిధులను సమకూరుస్తామని చెప్పారు. కేంద్రం వాటా నిధులు ఇవ్వకున్నా రుణా లు తెచ్చి పూర్తిచేస్తామని అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్న కు బదులిచ్చారు. కేంద్ర బడ్జెట్లో మోదీ సవతి సోదరుడి ప్రేమ చూపారంటూ రేవంత్ను ఉద్దేశించి అక్బరుద్దీన్ అనడంతో సీఎం స్పందించారు. అక్బరుద్దీన్ కొడంగల్లో పోటీ చేస్తే గెలిపిస్తాతెలంగాణ వచ్చాక గౌలిగూడ బస్టాప్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో కారిడార్ను నిర్మించకుండా గత ప్రభుత్వం పాతబస్తీకి దగా చేసింద ని సీఎం రేవంత్ ఆరోపించారు. గౌలిగూడ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో లైన్ పూర్తిచేస్తామ న్నారు. రెండో విడత ప్రాజెక్టులో భాగంగా ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్పోర్టు వరకు కారిడార్ నిర్మిస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికలకు ముందే పనులు పూర్తి చేసి చాంద్రాయణగుట్ట (అక్బరుద్దీన్ సొంత నియోజకవర్గం)కు మెట్రోలోనే వచ్చి అక్కడి కాంగ్రెస్ అభ్యరి్థకి ఓటేయాలని కోరతానన్నారు. ఆయన గెలుపునకు సహకరించాలని అక్బరుద్దీన్ను కోరారు. తనను సైతం సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి గెలిపించాలని అక్బరుద్దీన్ బదులివ్వగా సభలో కొద్దిసేపు ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్ బీ–ఫారంపై కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ పోటీ చేస్తే తాను దగ్గరుండి గెలిపిస్తానని రేవంత్ ఆఫర్ ఇచ్చారు. చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం టికెట్పై పోటీ చేస్తామంటే తాము సైతం గెలిపించడానికి సిద్ధమేనని అక్బరుద్దీన్ బదులిచ్చారు. -
అమిత్ షాపై కేసు ఎత్తేశారు.. నాపై కేసు మూయలేదు
సాక్షి, హైదరాబాద్: ‘మీ అన్నయ్య (ప్రధాని మోదీ) సోదరుడి (అమిత్ షా)పై పెట్టిన కేసును ఎత్తేసి ఈ పేద సోదరుడి (గరీబ్ భాయ్)పై తప్పుడు కేసును మాత్రం మూసివేయలేదు’ అంటూ సీఎం రేవంత్పై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తనకు అన్నయ్య (బడే భాయ్) అని.. గతంలో ప్రధాని పాల్గొన్న ఓ బహిరంగ సభలో రేవంత్ అనడాన్ని పరోక్షంగా గుర్తు చేశారు.ఎన్నికల ప్రచారంలో బాలలను వినియో గించారనే ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నమోదైన కేసును ఎత్తేసిన హైదరా బాద్ పోలీసులు.. తనపై నమోదు చేసిన తప్పు డు కేసును మాత్రం ఎత్తేయడానికి నిరాకరించారని అక్బరుద్దీన్ ఆరోపించారు. బడ్జెట్ పద్దుపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన రెండు గంటలపాటు ప్రసంగించారు. ‘రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉండగా 9:50 గంటలకే ఓ పోలీసు అధికారి సభా వేదిక పైకెక్కి ప్రచారాన్ని ఆపేయాలని కోరారు.దీనిపై నేను అభ్యంతరం తెలపడంతో కేసు పెట్టారు. అయితే విచారణలో పోలీసులదే తప్పిదమని తేలిందని.. కేసును ఎత్తేస్తామంటూ నాటి పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన కొత్త సీపీ.. కేసును ఎత్తేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నేను ముస్లిం కావడమే దీనికి కారణం’ అని అక్బరుద్దీన్ ఆరోపించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడబోనన్నారు.పోలీసుల సహకారంతోనే డ్రగ్స్ సరఫరాభాగ్యనగరంలో పోలీసుల సహకారంతోనే గంజాయి, డ్రగ్స్ సరఫరా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. నగరంలో శాంతిభద్రతలు గాడితప్పాయని, హత్యలు, అత్యాచారాలు ఆగ డం లేదన్నారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వక్ఫ్ భూముల కబ్జాలపై సీఐడీ విచారణకు ఆదే శించిందని, పురోగతిపై సమీక్షించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచిన అసెంబ్లీ స్థానాల పరిధిలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు రావడంపై ఆలోచించా లని సీఎంను కోరారు. బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయంబీసీలకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యా యం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యా యం చేస్తోందని అక్బరుద్దీన్ ఒవైసీ ధ్వజమె త్తారు. వారికి న్యాయం జరగాలంటే తమతో కలిసి పోరాడాలన్నారు. శనివారం బడ్జెట్పై చర్చ లో ఆయన మాట్లాడుతూ ‘బీసీల సంక్షేమం పేరు తో ఎన్నో హామీలిచ్చి నిధులివ్వకపోవడంతో బీసీ లు బీఆర్ఎస్ను ఓడించారు. వారిప్పుడు ప్రతి పక్ష సీట్లలో కూర్చున్నారు. గతంలో బీసీల కోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్య నుంచి స్ఫూర్తి పొందే నేను మైనారిటీల కోసం గొంతెత్తడం ప్రారంభించా’ అని ఆయన పేర్కొన్నారు. -
సీఎం మందబలంతో సభను తప్పుదోవ పట్టించారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు మందబలంతో శాసనసభను తప్పుదోవ పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయిందని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్ వద్ద హరీశ్ మాట్లా డారు. ‘‘కేంద్ర ప్రభుత్వం గతంలో ఉదయ్ పథకం ద్వారా రాష్ట్రం మీద బలవంతంగా రూ.9 వేల కోట్ల భారాన్ని రుద్దింది.ఇదే విషయాన్ని నేను సభలో చెప్తే.. సీఎం మాత్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. 2017 నాటి నోట్లోని అంశాలను చదివి వినిపించారు. అందులో వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న మీటర్లకు బదులు స్మార్ట్ మీటర్లు పెట్టాలనే అంశం తప్ప.. కొత్తగా మీటర్లు పెట్టాలనే ప్రస్తావన లేదు.కానీ 2021 జూన్లో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి 0.5% అదనపు అప్పు తీసుకునే రాష్ట్రాలు మీటర్లు పెట్టాలని కేంద్రం నిబంధన పెట్టింది. దానికి మేం ఒప్పుకోలేదు. రైతుల ప్రయోజనాల కోసం రూ.30వేల కోట్లు వదులు కున్నాం. సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రను అమలు చేస్తున్నారేమోనని అను మానంగా ఉంది’’ అని హరీశ్ పేర్కొన్నారు. -
గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా?
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలపై, బెల్ట్ షాపులపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు అదే మద్యంతో అధిక రాబడి కోసం ప్రయతి్నస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. అసెంబ్లీలో శనివారం బడ్జెట్పై చర్చను ప్రారంభిస్తూ ఆయన మాట్లా డారు. మద్యం అమ్మకాల ద్వారా రూ. 7 వేల కోట్లకుపైగా అధికంగా రాబడిని బడ్జెట్లో చూపారని నిలదీశారు. ‘బీర్లపై డ్యూటీని రూ. 2,760 కోట్ల నుంచి రూ. 3,500 కోట్లకు పెంచారు.సుంకాన్ని రూ. 11,031 కోట్ల నుంచి 15,500 కోట్లకు పెంచి బీర్లు, లిక్కర్ ధరలు భారీగా పెంచబోతున్నట్లు స్పష్టం చేశారు. గతే డాది కంటే మద్యం అమ్మకాల కింద వ్యాట్ రూపంలో రూ.2 వేల కోట్లు వస్తుందంటున్నారు. ఊరికో బెల్ట్ షాప్ ఉందని గతంలో భట్టి అన్నా రు. మీరు ప్రతిపాదించిన దాన్నిబట్టి గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి ఇప్పుడు రూ. 7 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయాన్ని ఎలా పెంచుకుంటారో చెప్పండి?’ అని హరీశ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు రూ. 3,85,340 కోట్లే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ. 3,85,340 కోట్లు మాత్రమేనని హరీశ్రావు అన్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్లు అప్పు చేసిందని పదేపదే చెబుతున్నారు. కోవిడ్ సమయంలో కేంద్రం 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీలో 1.75% అధికంగా అప్పులు చేసే వెసులుబాటు కల్పించింది. గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలను ఆదుకోకుండా అప్పులు తీసుకొనే స్థితికి నెట్టింది. కేంద్రం నిర్ణయాలు, కోవిడ్ వల్ల తెలంగాణ అనివార్యంగా రూ. 41,159 కోట్ల అప్పు తీసుకోవల్సిన పరిస్థితి వచి్చంది. అవన్నీ తీసేస్తే రూ. 3,85,340 కోట్లుగా అప్పు తేలుతుంది’ అని హరీశ్రావు చెప్పారు. వైఎస్సార్ పథకాలను కొనసాగించాం... ‘అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అనే మంచి పథకాలని పేర్లు కూడా మార్చకుండా కొనసాగిస్తామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే సభలో చెప్పారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను కేసీఆర్ సభలో పొగిడి కొనసాగించారు. కానీ మీరు అలాంటి హుందాతనాన్ని ప్రదర్శించకుండా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలు రద్దు చేయడంతో పేద గర్భిణులపై ఎంతో ప్రభావం చూపుతుంది. మీకు భేషజాలు ఉంటే పథకాల పేర్లు మార్చుకోండి. కానీ దయచేసి పథకాలు ఆపకండి. ఆరోగ్యశ్రీకి గతేడాదితో పోలిస్తే బడ్జెట్ను కుదించారు’ అని హరీశ్ విమర్శించారు. గన్పార్క్ వద్దకు వెళ్లి కరెంటు వస్తుందా లేదా ప్రజలను అడుగుదాం? ‘బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం. పది నిమిషాలు టీ బ్రేక్ ఇస్తే గన్పార్క్ దగ్గర రోడ్డు మీదికి వెళ్దాం. నాతోపాటు డిప్యూటీ సీఎం భట్టిని రమ్మనండి. మా పాలనలో కరెంట్ బాగుందా? ఇప్పుడు బాగుందా? అని ప్రజల్ని అడుగుదాం’ అని హరీశ్రావు అన్నారు. -
రేవంత్రెడ్డి వర్సెస్ హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు ఆరోపణలు.. దీనిపై సీఎం రేవంత్రెడ్డి ఘాటుగా స్పందించడంతో.. ఈ ఇద్దరి మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీశ్రావు.. గతంలో తమ ప్రభుత్వం చేసిన అప్పులను ఎక్కువ చేసి చూపిస్తున్నారని, అది సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీల అమలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదేమని నిలదీశారు.ఇంతలో సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు. ‘‘హరీశ్రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ.7 వేలకోట్లకే తెగనమ్మారు. గొర్రెల స్కీం పేరుతో రూ.700 కోట్లు దండుకున్నారు. బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం ఖర్చు విషయంలో గతంలో ఒకటి చెప్పి ఇప్పుడు రూ.94 వేల కోట్లే అంటున్నారు. అప్పుల లెక్కలు చెబుతున్నారు.. కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడంలేదు.రాష్ట్ర ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి.. ఎన్ని వేలకోట్ల విలువైన భూములు అమ్ముకున్నారో లెక్కలు తీద్దాం. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేశారు. మీరు నిజాయతీ పాలన అందించి ఉంటే.. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?’’ అని సవాల్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుండుసున్నా ఇచ్చినా బుద్ధి తెచ్చుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.అబద్ధపు గ్యారంటీలతో పరువు తీశారు: మాజీమంత్రి హరీశ్రావుసీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల కరువు, వలసలకు రేవంత్రెడ్డి గతంలో ఉన్న టీడీపీ, ఇప్పుడున్న కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. ‘‘బతుకమ్మ చీరల విషయంలో సీఎం మహిళలను అవమానపరిచారు. దీనిపై క్షమాపణ చెప్పాలి. ఆరు గ్యారంటీలపై రాహుల్ గాం«దీతో హామీ ఇప్పించారు. సోనియాగాం«దీతో కూడా లేఖ రాయించారు. కానీ అమలు చేయలేక.. సోనియా గౌరవం పోగొట్టారు. రాహుల్ పరువు తీశారు.పేగులు మెడలో వేసుకుంటా, లాగులో తొండలు విడుస్తానంటూ సీఎం రేవంత్రెడ్డి వాడిన రాక్షస భాషను చూసి జనం భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ గౌరవం పోగొట్టవద్దని కోరుకుంటున్నాం’’ అని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 500 హత్యలు, 1,800 అత్యాచారాలు జరిగాయని.. పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ప్రతివారం సీఎం ప్రజలను కలుస్తారని చెప్పారని.. కానీ ప్రజాపాలనలో మొదటి రోజు తప్ప మళ్లీ అక్కడ కనిపించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పారీ్టయే పెద్ద ధోకా అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సభలో బీఆర్ఎస్ సభ్యులంతా ‘ధోకా.. ధోకా..’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై మంత్రి శ్రీధర్బాబు అభ్యంతరం వ్యక్తంచేశారు.