'సుష్మా ను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు' | nagam janardhan reddy blames congress | Sakshi
Sakshi News home page

'సుష్మా ను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు'

Aug 23 2013 5:43 PM | Updated on Mar 18 2019 9:02 PM

'సుష్మా ను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు' - Sakshi

'సుష్మా ను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు'

బీజీపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని ఆ పార్టీ నేత నాగం జనార్తనరెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్: బీజీపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని ఆ పార్టీ నేత నాగం జనార్తనరెడ్డి  మండిపడ్డారు. తెలంగాణ బలిదానాలపై మాట్లాడిన వ్యక్తిని విమర్శించడం తగదని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ మద్దతు లేకపోయినా తెలంగాణ వస్తుందని నాగం తెలిపారు.
 
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ మద్దతు లేకపోయినా తెలంగాణ వస్తుందని, బీజేపీ మద్దతు లేకపోతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం సాధ్యం కాదన్నారు.  తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement