గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కంపించిన భూమి | earthquake hits guntur, prakasam district | Sakshi
Sakshi News home page

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కంపించిన భూమి

Oct 30 2014 8:04 PM | Updated on Aug 24 2018 2:33 PM

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గురువారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది.

గుంటూరు: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గురువారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. గుంటూరు జిల్లాలో నాలుగు సెకన్ల పాటు భూమి కంపిచడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

గుంటూరు జిల్లాలోని వినుకొండ, నూజెండ్ల, శావల్యాపురంలో భూమి కంపించింది. భూ కంపన ధాటికి వినుకొండలో దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. మత్కుపల్లి, గుంటుపాలెం, కారుమంచి గ్రామాల్లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని అద్దంకి, బల్లికురవ మండలాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement