breaking news
-
ఆగుతున్న అభిమానుల గుండెలు
సాక్షి, నెట్వర్క్: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమిని తట్టుకోలేక గురువారం కూడా పలువురు గుండెపోటుతో మృతిచెందారు. మృతుల కుటుంబాలను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు సమీపంలోని గాం«దీగనర్కు చెందిన వైఎస్సార్సీపీ నేత కిల్లో మోహన్ తండ్రి కిల్లో అప్పారావు(55) ఈ నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపులో జగన్కు వ్యతిరేకంగా వస్తున్న ఎన్నికల ఫలితాలను చూసి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం 108లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.తిరుపతి జిల్లాలో..తిరుపతి జిల్లా చియ్యవరం గ్రామానికి చెందిన శ్రీరాములు(24) వైఎస్సార్సీపీకి వీరాభిమాని. ఆయన తన తల్లి పోలమ్మతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలవడం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బియ్యపు మధుసూదన్రెడ్డికి విజయం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అన్నం తినడం మానేశాడు. తల్లి ఎంత బతిమాలినా మెతుకు ముట్టలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అబ్బయ్యచౌదరి ఓటమితో అభిమాని ఆత్మహత్యదెందులూరులో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఓటమితో వైఎస్సార్సీపీ వీరాభిమాని రామారావుగూడెం యువకుడు సూరవరపు సాయిలింగాచార్యులు(23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడేనికి చెందిన సాయిలింగాచార్యులు వైఎస్సార్సీపీకి, కొఠారు అబ్బయ్యచౌదరికి వీరాభిమాని. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. జూన్ నాలుగో తేదీన వెలువడిన ఫలితాలు చూసి మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం అబ్బయ్యచౌదరిని కలుస్తానని చెప్పి బయలుదేరగా వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల దాడులు జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజులు ఆగి వెళదామని స్థానిక వైఎస్సార్సీపీ నేతలు నచ్చజెప్పారు. ఈ క్రమంలో అభిమాన నేత ఓటమిని భరించలేక.. తీవ్ర మనోవేదనతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి ఆత్మహత్య సమాచారం అందుకున్న అబ్బయ్యచౌదరి ఏలూరు వైద్యశాలకు వెళ్లి సాయి భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.వైఎస్సార్ జిల్లాలో..వైఎస్సార్ జిల్లా తెల్లపాడుకు చెందిన వైఎస్సార్సీపీ అభిమాని మాలేపాటి పెద్దనరసింహులు (65) గురువారం మృతిచెందాడు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తన స్వగృహంలో టీవీ చూస్తూ వైఎస్సార్సీపీ ఓటమిని చూసి తట్టుకోలేక ఒక్కసారికి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడికి భార్య పార్వతి, కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. గుంటూరు జిల్లాలో.. గుంటూరు జిల్లా కొమ్మూరు ఎస్సీ కాలనీకి చెందిన మూకిరి ఏషయ్య(46)వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అంటే ఎంతో అభిమానంగా ఉండేవాడు. మూడు రోజుల కిందట వెలువడిన ఎన్నికల ఫలితాలను చూసి అన్యాయం జరిగిందంటూ తీవ్ర మనో వేదనకు లోనవుతూ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యుడు చెప్పాడు. ఆటో నడుపుకొనే ఏషయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.అనకాపల్లి జిల్లాలో.. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడికి చెందిన చిరుకూరి రాజుబాబు(72) వైఎస్సార్సీపీ అభిమాని. వైఎస్ జగన్ రెండోసారి సీఎం అవుతారని గ్రామంలో అందరితో చెబుతుండేవాడు. కౌంటింగ్ పూర్తయ్యాక వైఎస్సార్సీపీకి ఎక్కువ సీట్లు రాలేదని తెలియడంతో ఆందోళన చెందాడు. ఇక వలంటీర్లు పెన్షన్లను ఇంటికి తీసుకువచ్చి ఇవ్వరంటా.. అనే ప్రచారం జరగడంతో రెండు రోజులుగా దిగాలుగా ఉన్నాడు. గురువారం గుండెల్లో మంట వస్తుందంటూ కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ప్రకాశం జిల్లాలో.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేములకు చెందిన వైఎస్సార్ వీరాభిమాని అన్నపురెడ్డి చినగురవారెడ్డి(71) వైఎస్సార్సీపీ అభిమాని. దర్శి ఎమ్మెల్యేగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి గెలవడంతో బుధవారం గ్రామస్తులతో కలిసి దర్శి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డితో చినగురవారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎవరికీ అన్యాయం చేయలేదని, అందరికీ న్యాయం చేశారని, ఆయనకు ఇంత అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే దిగులుతో ఇంటికి చేరుకున్న చినగురవారెడ్డి గురువారం రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. మృతుడి కుటుంబానికి కొడాలి నాని రూ.5 లక్షల సాయం తన ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్యచేసుకున్న కుటుంబానికి భరోసాసార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కొడాలి నాని ఓటమిని జీర్ణించుకోలేక కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని సైదేపూడికి చెందిన పిట్టా అనిల్కుమార్(26) ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కాగా గురువారం రాత్రి అనిల్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, పార్టీ నాయకులతో కలసి వెళ్లి పరామర్శించారు. రూ.5 లక్షల సాయమందించారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనిల్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. -
మా ప్రాణాలు కాపాడండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులపై ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తులు దాడులతో వ్యవస్థీకృత హింసకు పాల్పడుతుండటంపై బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గ్రామాలు, ఆస్తులను వదిలేసి కట్టుబట్టలతో వెళ్లకుంటే హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తూ పిల్లలు, మహిళలను సైతం హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని విన్నవించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యవస్థీకృత హింసను సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా స్వీకరించి ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించాలని అభ్యర్థించారు. వ్యవస్థీకృత హింసకు సంబంధించి మీడియా కథనాలు, సోషల్ మీడియా వీడియోల సాక్ష్యాధారాలతో బాధితులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ఈ–మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు. బాధితుల ఆక్రందన ఇదీ..⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని పాలనా యంత్రాంగంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు, పిల్లలు, మహిళలపై వ్యవస్థీకృత హింసకు పాల్పడుతున్నాయి. ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. ⇒ పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో అసాంఘిక శక్తులు యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడుతున్నాయి. గత 24 గంటల్లో హింసాత్మక సంఘటనలు భారీగా పెరిగాయి. ⇒ సర్వోన్నత న్యాయస్థానం తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించకుంటే ఈ వ్యవస్థీకృత హింస నుంచి బాధితులకు రక్షణ లభించదు. ఈ అంశాన్ని సుమోటో పిల్గా స్వీకరించి విచారించాలి. రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడాలి. -
వివాహిత ఆత్మహత్య
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ ఎన్ఎన్ కాలనీలో నివాసం ఉంటున్న వన్నాల రేవతి(27) బుధవారం ఇంటిలో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేవతి భర్త కృష్ణారావు స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన కృష్ణారావుకు పాతపట్నం మండలం పాచిగంగుపేటకు చెందిన రేవతితో తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఎప్పటి మాదిరిగానే కృష్ణారావు విధుల నుంచి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఇంటిలోకి వెళ్లే సరికి రేవతి ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వెంటనే ఆమెకు కిందకు దించి స్థానికుల సహకారంతో స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వీరికి ఆరేళ్ల వయసు గల కుమార్తె ఉంది. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏంఏ ఆహ్మద్ తెలిపారు. -
టీడీపీ, జనసేన విధ్వంసం.. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. యథేచ్ఛగా విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నాయి. వాహనాలను ధ్వంసం చేస్తున్నాయి. మంగళవారం మొదలుపెట్టిన ఈ అరాచకపర్వాన్ని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు బుధవారం కూడా కొనసాగించారు. ఈ రెండురోజులు ప్రభుత్వ భవనాల వద్ద ఫలకాలను చిత్రపటాలను ధ్వంసం చేస్తూ స్వైరవిహారం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసి, విగ్రహాల వద్ద కూటమి జెండాలు ఏర్పాటు చేశారు.ఇప్పటంలో ప్రజల భాగస్వామ్యంతో నిర్మించిన దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ భవనం పైభాగంలో జనసేన, టీడీపీ జెండాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో 1, 2 సచివాలయాల వద్ద వైఎస్ జగన్ డిజిటల్ బోర్డులను తొలగించి రోడ్డుపై పడవేసి చిత్రపటంపై రాళ్లు వేశారు. నూతన సచివాలయం శిలాఫలకంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాన్ని చిన్నపిల్లలతో పగులగొట్టించారు. రైతుభరోసా కేంద్రంపై నవరత్నాల బోర్డును ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా గోళ్ళపాడులో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ శిలాఫలకాన్ని పగులగొట్టారు. తిరుపతి జిల్లా పుత్తూరులో పలు ఆలయాల వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాలను బుధవారం సాయంత్రం తెలుగుదేశం నాయకులు ధ్వంసం చేశారు. శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయం లోపల ఏర్పాటు చేసిన అన్నదాన, కళ్యాణోత్సవ మండప శిలాఫలకాన్ని, ఆరేటమ్మ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనుల పేరిట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, గేట్పుత్తూరులోని గోవిందమ్మ ఆలయం వద్ద ప్రారంభించిన జగనన్న సమావేశమందిర శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం నాయకులు డి.జి.ధనపాల్, బి.శ్రీనివాసులు చేసిన ఈ విధ్వంసంపై పుత్తూరు సెంగుంధర్ మక్కల్ నల సంఘం ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎస్.ఎన్.గోపిరమణ, టి.జి.శక్తివేలు, ఎం.ఎస్.తిరునావక్కర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని యలమంచిపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త షేక్ మస్తాన్పై టీడీపీ నాయకులు దాడిచేశారు. అడ్డుకోబోయిన ఆయన తల్లి షేక్ బీబీ తలపైకొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆమెను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తడకలూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త యలమా వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. మరికొన్ని గ్రామాల్లో కూడా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. గ్రామాల్లో వివాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కోరారు. పంచాయతీలో ఫైళ్ల అపహరణ ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు సచివాలయం, హెల్త్క్లినిక్ ఆవరణలోని శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, అబ్బయ్యచౌదరి ఫొటోలను సుత్తితో పగులగొట్టారు. తన కార్యాలయంలో వస్తువుల్ని ధ్వంసంచేసి ఫైళ్లు అపహరించారని సర్పంచ్ జిజ్జువరపు నాగరాజు చెప్పారు. కొప్పులవారిగూడెంలోని సచివాలయ ఆవవరణలోని శిలాఫలకాలను, ప్రభుత్వ సామగ్రిని ధ్వంసం చేశారు. సచివాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే స్థూపానికి టీడీపీ జెండా కట్టారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో బొర్రా నారాయణరావు చికెన్ దుకాణాన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీనిపై నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సచివాలయం–1పై ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వార్డు సభ్యులు ముప్పిడి లక్ష్మణరావు, లక్ష్మణరావులపై దౌర్జన్యానికి దిగారు. నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నంలో సచివాలయం, హెల్త్క్లినిక్ పైలాన్లను ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసాలకు పాల్పడుతుండగా సమాచారం ఇచ్చినా పోలీసులు స్పందించలేదని పలు గ్రామాల్లో బాధితులు తెలిపారు.కైకలూరులో వైఎస్సార్విగ్రహం ధ్వంసంకైకలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం వడ్లకూటితిప్పలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద 2010లో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆకతాయిలు కూలగొట్టారు.ఈ ఘటనను వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డీఎన్నార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఖండించారు. విగ్రహాల కూలి్చవేత ఘటనలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.నీ జీవితం నా చేతుల్లో..వలంటీర్కు టీడీపీ నేత బెదిరింపుపల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామానికి చెందిన వలంటీర్ బాబురావును గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తీవ్రంగా బెదిరించారు. ‘అరేయ్ బాబురావుగా నీ పతనం స్టార్ట్ కాబోతుంది.. ఇక నువ్వు ఫిక్స్ అయిపో.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉందిరా.. నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకున్నా.. నిన్ను వేరే వాళ్ళు కాపాడాలన్నా.. నీ జీవితాన్ని నేను తిరగరాసినా ఇప్పుడు. నీకు భయం అంటే ఏంటో చూయిస్తారా.. నా కొడకా. అరేయ్ బాబురావుగా.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉంది రా.. నీ తలరాత బ్రహ్మ రాసినా ఇప్పుడు నీ జీవితాన్ని నేను తిరగరాస్తా.. కొడకా..’ అంటూ స్టేటస్ పెట్టి మరీ హెచ్చరించారు. మరోవైపు పెదమక్కెన గ్రామంలోని ఎస్సీ కాలనీలో దళితుల ఇళ్లపై టీడీపీ వారు రాళ్లు, సీసాలు విసిరారు. అజయ్కుమార్ జీవనాధారమైన ఆటోను ధ్వంసం చేశారు.వైఎస్సార్సీపీ నేతలు,కార్యకర్తలపై దాడులు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ వర్గీయులపై కర్రలు, రాళ్లతో దాడులు చేస్తున్నారు. అడ్డొచ్చినవారిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏలూరు రూరల్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరాజు, రాష్ట్ర వడ్డికుల కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్కుమార్, గార్లమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణ కారులో వెళుతుండగా విజయరాయి వద్ద టీడీపీ వారు దాడిచేశారు. ‘గెలిచింది మేమే.. మాకు తిరుగులేదు.. రండి ఇప్పుడు..’ అంటూ కర్రలు, రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టారు. కారులో ఉన్న కృష్ణను బలవంతంగా బయటకు లాగి పిడిగుద్దులు గుద్ది రోడ్డుపై పడేశారు. కొంతదూరం లాక్కెళ్లి కొట్టారు. గతంలో చింతమనేని ప్రభాకర్పై చేసిన విమర్శలకు క్షమాపణలు చెబుతున్నా అంటూ కృష్ణతో చెప్పించి వీడియో రికార్డు చేశారు. అడ్డుపడేందుకు ప్రయత్నించిన శ్రీనివాసరాజు, సంజీవ్కుమార్లను తోసేశారు. కారు అద్దాలు పగలడంతో వైఎస్సార్సీపీ నాయకులకు గాయాలయ్యాయి. ఈ దాడిని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చెర్లకోట పంచాయతీ సిద్ధాయపాలెంలో సింహం లలిత, ఆమె తండ్రి చొప్పరపు బాలస్వామిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన బాలస్వామిని తొలుత మార్కాపురం జిల్లా వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యూట్యూబర్ సుంకేసుల ఆదిశేషు ఇంటిపై టీడీపీ వర్గీయులు కొడవళ్లతో దాడిచేశారు. ఆ సమయంలో ఆదిశేషు ఇంట్లో లేకపోవడంతో వారు మహిళలతో దురుసుగా మాట్లాడి సామగ్రిని చిందరవందర చేశారు. ఆదిశేషు భార్య, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
టీడీపీ వేధింపులకువైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి
పెదవేగి: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేటకి చెందిన ప్రవీణ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి అహర్నిశలు శ్రమించాడన్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్ ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్ బంక్ వైపు వస్తే కొడతామని, బైక్, కారు తగలబెట్టేస్తామని హెచ్చరించారు. బుధవారం ఉదయం ప్రవీణ్ విజయరాయి పెట్రోల్ బంక్కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్సీపీ స్టిక్కర్ తీసేవరకు బీభత్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయపడి, వేధింపులు భరించలేక ప్రవీణ్.. తన ఇంటి సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేçÜుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ తల్లిదండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశరావు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఉరుకోం టీడీపీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ భౌతికకాయానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ను బలితీసుకున్న టీడీపీ కార్యకర్తల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని, వారి ఇళ్ల మీదకు వెళ్లి భౌతికదాడులు చేస్తూ, వాహనాలు, ఇంట్లో వస్తువులు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఊరుకునేదిలేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని కోరారు. -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ హత్యాయత్నం
చంద్రగిరి (తిరుపతి జిల్లా)/తిరుపతి క్రైమ్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మత్తులో టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఈ దాడులు బుధవారమూ కొనసాగాయి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు కొందరు గంజాయి మత్తులో వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన మరో వ్యక్తిని కూడా గాయపరిచారు. మరో చోట వార్డు సభ్యుడిపై దాడి చేసి, గాయపరిచారు. తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కత్తులు, రాడ్లతో దాడి బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, పార్టీ మండల కనీ్వనర్ మస్తాన్పై టీడీపీ కార్యకర్తలు చంద్రగిరిలో హత్యాయత్నానికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో ఉన్న టీడీపీ కార్యకర్తలు కొందరు బుధవారం రాత్రి మస్తాన్ ఇంటి వద్దకు వచ్చారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంతో ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆయనపై కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఓ వ్యక్తి కత్తితో మస్తాన్పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకొన్నప్పటికీ వారు ఆగలేదు. టీడీపీ వారిని అడ్డుకోబోయిన మస్తాన్ బంధువైన సాదిక్ను కూడా గాయపరిచారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నాయకులు పలువురు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ వారు జారుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ధాబా ధ్వంసం అదే విధంగా చంద్రగిరి మండలం పరిధిలోని ఐతేపల్లి వద్ద ఉన్న ధాబాను టీడీపీ కార్య కర్తలు కొందరు ధ్వంసం చేశా రు. బుధవారం మద్యం సేవించిన కొందరు టీడీపీ కార్యకర్తలు ధాబా వద్దకు వెళ్లి గొడవకు దిగారు. సమాచారం అందుకున్న వార్డు సభ్యుడు సక్కూరు వంశీ అక్కడి వెళ్లారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. మాపైనే పోలీసులకు చెప్తావా అంటూ వార్డు సభ్యుడు వంశీపై టీడీపీ వారు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ధాబాలోని కురీ్చలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన వంశీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్యాలయం ధ్వంసం తిరుపతి నగరం 8వ డివిజన్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూటమి కార్యకర్తలు ధ్వంసం చేశారు. సంజయ్ కాలనీలో ఉన్న ఈ కార్యాలయాన్ని మురళి నిర్వహిస్తున్నారు. షట్టర్ ఓపెన్ చేసి గ్లాస్ డోర్కు తాళం వేసుకుని వెళ్లిన సమయంలో కూటమి మూకలు రాళ్లతో దాడిచేసి లోపలికి ప్రవేశించి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. టీవీలు, కంప్యూటర్లు, బల్లలు అన్నింటినీ విరగ్గొట్టారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కార్యాలయం నిర్వాహకుల నుంచి ఫిర్యాదు తీసుకొన్నారు. -
ఓటర్లపైనా రౌడీషీట్లు!
దర్శి: నిన్నటి వరకూ వారిపై ఎలాంటి కేసులూ లేవు.. అయితే ఒక్కసారిగా వారిపై రౌడీఓటర్లపైనా రౌడీషీట్లు ఓపెన్ అయ్యాయి.. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఎనిమిది మందిపై. అందులో ముగ్గురు వైఎస్సార్సీపీకి చెందిన బూత్ ఏజెంట్లు. మరో ముగ్గురు ఓట్లు వేసేందుకు వచ్చిన వారు. వారికి ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేదు. పోలింగ్ బూత్లోకి చొరబడి ఈవీఎం ధ్వంసం చేసిన వారిపై నామమాత్రం కేసులు పెట్టి చేతులు దులుపుకున్న దర్శి పోలీసులు.. వీరిపై ఎందుకు రౌడీషీట్ పెట్టారో అర్థంకాని విషయం. వాస్తవానికి ఎవరిపైనైనా రౌడీషీట్ తెరవాలంటే మూడు క్రిమినల్ కేసులు తప్పనిసరిగా ఉండాలి. కనీసం 307 కేసైనా అయి ఉండాలి. లేదా తరచూ నేరాలు చేసేవారి పైరౌడీషీట్ వేస్తారు. కానీ ఎలాంటి కేసులు లేని సామాన్యులపై వైఎస్సార్సీపీ మద్దతుదారులు అనే నెపంతో రౌడీషీట్లు తెరిచిన దర్శి పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి దర్శి పోలీస్స్టేషన్కు వచ్చి వెళ్లారు. ఆయన వెళ్లాక పోలీసులు రౌడీషీట్లు ఓపెన్ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు పోలింగ్ రోజు ఏం జరిగిందంటే.. టీడీపీ అరాచకం సృష్టిస్తున్నా.. అడ్డుకోని పోలీసులు ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు దర్శి పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలోని 117, 118 బూత్లలోకి సాయంత్రం ఆరు గంటలు దాటాక టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త లలిత్ సాగర్లతో పాటు అభ్యర్థి మామ కడియాల వెంకటేశ్వరరావు, తమ్ముడు గొట్టిపాటి భరత్లతో పాటు మరో 50 మంది నరసరావుపేటకు చెందిన వారు బూత్లోకి ఎగబడి ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసు సిబ్బంది తోపాటు ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు కూడా అక్కడే ఉన్నా, వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. 6 గంటలు దాటాక బూత్లోకి రావడంపై ఏజెంట్లు ప్రశ్నిస్తున్నా పోలీసులు నోరు మెదపలేదు. దీంతో అక్కడ ఓటర్లుగా ఉన్నవారు, ఏజెంట్లు బూత్లోకి రాకుండా వారిని అడ్డుకున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీ అక్కడే ఉన్నా చోద్యం చూస్తూ ఊరుకున్నారే గానీ వారిని అడ్డుకున్న పాపాన పోలేదు. అంతే కాకుండా అభ్యర్థి మామ కడియాల వెంకటేశ్వరరావు.. నిబంధనలకు విరుద్ధంగా నేరుగా పోలింగ్ బూత్లోకి చొరబడి నానా రభస చేసినా వారిని బయటకు పంపలేదు. ఏ పోలీసు ఆయన్ను అడ్డుకుని బయటకు పంపేందుకు సాహసం చేయకపోవడం గమనార్హం. అదే సమయంలో ఓటు వేసేందుకు లైన్లో నిలబడిన వారు సమయం దాటినా ఎందుకు లోపలకు వెళ్తున్నారని వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో గొడవ కాస్త పెద్దదైంది. చోద్యం చూస్తున్న పోలీసులను ఓటర్లు నిలదీయడంతో అప్పుడు పోలీసులు వారిని బయటకు పంపారు. దీంతో రెచి్చపోయిన టీడీపీ అభ్యర్థి పోలీసుల కళ్లెదుటే తన అనుచరులను(నరసరావుపేటకు చెందిన వారిని) రెచ్చగొట్టి వెళ్లిపోయారు. అనంతరం వాళ్లు పోలీసులపై, పోలింగ్ బూత్పై రాళ్లు రువ్వారు. దీంతో తమిళనాడుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్కు ఓ రాయి కడుపులో తగిలింది. దీంతో కిందపడిపోయిన పోలీసుపై కూడా విచక్షణ రహితంగా రాళ్లు రువ్వారు. అల్లరి మూకలు డీఎస్పీపై కూడా రాళ్లు రువ్వడంతో పోలీసులు తమ గార్డులు అడ్డుపెట్టి డీఎస్పీని బూత్ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఇంత రభస చేసినా నరసరావుపేటకు చెందిన వారిని వదిలేసి స్థానికులపై కేసులు పెట్టి మమ అనిపించారు. అలాగే పట్టణంలోని ఎంఈవో కార్యాలయంలో పోలింగ్ బూత్లో ఈవీఎంను టీడీపీ నాయకుడు వీసీరెడ్డి ధ్వంసం చేశాడు. పోలీసులు పట్టుకుని వచ్చి 41 నోటీసులు ఇచ్చి సరిపెట్టారేగానీ, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత కళ్లు తిరుగుతున్నాయంటూ వీసీ రెడ్డి డ్రామా ఆడి ఆస్పత్రి నుంచి పోలీసుల కన్ను కప్పి పారిపోయాడు. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగుల గొట్టారన్న ఆరోపణ వీడియో బయటకు వచ్చాక హడావుడిగా పోలీసులు వీసీరెడ్డిని పిలిపించి అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. ఇంత చేసిన వీసీరెడ్డి పై మాత్రం ఎలాంటి రౌడీïÙట్ పెట్టక పోవడం పోలీసుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. అలాగే పోలింగ్ బూత్లో చొరబడి గందరగోళం సృష్టించిన, పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై మొక్కుబడిగా కేసులు పెట్టిన పోలీసులు.. వైఎస్సార్సీపీకి చెందిన బూత్ ఏజెంట్లు, సామాన్యులపై రౌడీషీట్లు తెరవడం విస్మయం కలిగిస్తోంది. పోలింగ్కు 48 గంటల ముందే బయట ప్రాంతానికి చెందిన వారు నియోజకవర్గాల్లో ఉండకూడదన్న నిబంధన ఉంది. అయితే అంత మంది నరసరావుపేటకు చెందిన వారు పట్టణంలో ఎలా ఉన్నారో దర్శి పోలీసులే చెప్పాలి. -
మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
సాక్షి, కృష్ణా జిల్లా: యనమలకుదురులో విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణీ సందు కావ్య శ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య శ్రీ మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. విజయవాడలో స్కానింగ్ తీయించిన భర్త శ్రీకాంత్.. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్కు కావ్యశ్రీ చెప్పిన కానీ తమకు వారసుడిని ఇవ్వాలంటూ అత్త, మామ వేధింపులకు పాల్పడ్డారు.శ్యామ్ అనే కానిస్టేబుల్ స్కానింగ్ తీసుకెళ్లాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు తన భర్తకు మెసేజ్ చేసిన కావ్య శ్రీ.. మీకు వారసుడిని ఇవ్వలేనంటూ భర్తకు మెసేజ చేసింది. పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మ్యూల్ సిమ్కార్డుల ముఠాగుట్టు రట్టు
భవానీపురం (విజయవాడపశ్చిమ): సైబర్ నేరగాళ్లకు మ్యూల్ సిమ్కార్డులు సరఫరా చేస్తున్న ముఠాగుట్టును విజయవాడ సైబర్ పోలీసులు రట్టుచేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశా రు. నిందితుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. కోటిని స్తంభింపజేశారు. సైబర్ మోసంతో సీని యర్ సిటిజన్ పోగొట్టుకున్న రూ.30,37,627 ఆయనకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా సీపీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. గతనెల 24వ తేదీన విజ యవాడ సూర్యారావుపేటకు చెందిన సీనియర్ సిటిజన్ తాను సైబర్ నేరానికి గురైనట్లు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. తనకు వాట్సప్ ద్వారా వీడియో కాల్ చేసి ముంబై సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తన పేరుమీద ముంబయిలో రెండు సిమ్కార్డులు, రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, ముంబయిలో పలు కేసుల్లో నిందితుడైన రాజ్ కుంద్రా నిత్యం తనతో ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ముంబయిలో కేసు నమోదు అయిందంటూ ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ పత్రాలను వాట్స ప్లో పంపించాడని తెలిపారు. అతడి బెదిరింపులకు భయపడిన తాను అతడు చెప్పిన ఖాతాకు రూ.30,37,627 జమచేసినట్లు తెలిపారు. అయినా ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖలో తీసుకున్న సిమ్కార్డుల వినియోగం ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.డి.తేజేశ్వరరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కోమాకుల శివా జి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన సిమ్ కార్డులు విశాఖపట్నంలో తీసుకున్నట్లు గుర్తించి ఎస్ఐ ఆర్.ఎస్.సీహెచ్.మూర్తి ఆధ్వర్యంలో ఒక బృందం విశాఖపట్నంలో దర్యాప్తు చేసింది. సిమ్కార్డులు అమ్మే ఎగ్జిక్యూటివ్లు.. వినియోగదారుల బొటనవేలి ముద్రలను ఉపయోగించి మరో మ్యూల్ సిమ్కార్డు తీసుకుని యాక్టివేట్ చేసి సంఘవ్యతిరేక శక్తులకు అమ్ముకుంటున్నట్లు గుర్తించారు. సైబర్ నేరస్తులకు మ్యూల్ సిమ్కార్డులు విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టుచేసి వా రి వద్ద నుంచి 998 సిమ్కార్డులు, బయోమెట్రిక్ మెషిన్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన రేపాక రాంజీ, నంబాల నితిన్, బండి నారాయణమూర్తి అలియాస్ రవి, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన తేలు ప్రణయ్కుమార్, నంద రూపేష్, కాగితాల సింహాద్రి, నిడమర్రు ఎండీఎల్ సూరయ్యగూడేనికి చెందిన పందిరి సత్యనారాయణలను అరెస్టు చేశారు. బాధితుడు డబ్బు జమచేసిన బ్యాంకు ఖాతాను గుర్తించి 1930 పోర్టల్ ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించి ఆ ఖాతాలో ఉన్న రూ.1,21,73,156.98ని నిలుపుదల చేశారు. బా ధితుడు పోగొట్టుకున్న రూ.30,37,627ను కోర్టు ద్వారా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరస్తులు కాంబోడియా నుంచి ఈ మోసానికి పా ల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీపీ తె లిపారు.దోషుల్ని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. -
గద్వాల: లారీ, స్కార్పియో ఢీ.. నలుగురి మృతి
గద్వాల, సాక్షి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఓ స్కార్పియో వాహనం ఢీ కొట్టుకోవడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్-బెంగు జాతీయ రహదారి 44 పై ఎర్రవల్లి చౌరస్తా ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్పాట్లోనే చనిపోగా.. గాయపడిన ముగ్గురిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల్ని పోస్ట్మార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అతివేగం ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనం నెంబర్ ఏపీ 29 జి 5553. కర్నూలు ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంలోని వాళ్ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ధాటికి వాహన ముందు భాగం పూర్తిగా నుజ్జైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
రూ.కోట్ల విలువైన బంగారం పట్టివేత
కావలి/వెంకటాచలం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... కావలి సమీపంలోని గౌరవరం టోల్ప్లాజా వద్ద శుక్రవారం వేకువజామున మూడు గంటల సమయంలో కావలి రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అనుమానాస్పదంగా కనిపించడంతో సోదాలు నిర్వహించారు. సీట్ల కింద ఎవరికి అనుమానం రాకుండా ఏర్పాటు చేసిన సీక్రెట్ లాకర్లలో పెట్టి తరలిస్తున్న సుమారు రూ.2.10 కోట్ల విలువైన 2.94 కేజీల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న చెన్నైకి చెందిన మార్వాడీ వ్యాపారులు ఆశిష్ కుమార్, కమలేష్లను ప్రశ్నించగా బంగారానికి సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు.మరో కారులో చెన్నై నుంచి తెనాలి తరలిస్తుండగా..వెంకటాచలం టోల్ప్లాజా వద్ద 1.5 కిలోల బంగారాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. టోల్ప్లాజా వద్ద ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో చెన్నైకి చెందిన రాకేష్కుమార్ జైన్, లతాజైన్ దంపతులు చెన్నై వైపు నుంచి తెనాలికి టీఎన్ 01 బీఎస్3092 నంబరు కారులో వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. కారులో 1.5 కిలోల బంగారాన్ని గుర్తించారు. బంగారానికి సంబంధించి ఎలాంటి బిల్లులు చూపకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య..
ఏలూరు: ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్యకు గురైంది. ఆమెకు నిశ్చితార్థం కావడంతో ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె పనిచేస్తున్న కాలేజీకి సమీపంలోనే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఆపై తనూ గొంతు కోసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు యువకుడిని ఏలూరు సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. వివరాలివీ..సర్టిఫికెట్ల కోసమని వచ్చి..ఏలూరు ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కుల రత్నగ్రేస్ (22) సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేసింది. అక్కడే జూనియర్ లెక్చరర్గా పనిచేస్తోంది. ముసునూరుకు చెందిన తొట్టిబోయిన ఏసురత్నం (23) కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నట్లు సమాచారం. గురువారం మ.12.30 గంటల సమయంలో ఏసురత్నం తన డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చినట్లు తెలిసింది. రత్నగ్రేస్ తను పనిచేస్తున్న కాలేజీ సమీపంలోకి రాగానే.. ఆమెతో మాట్లాడేందుకు వచ్చానంటూ చెప్పి పక్కనే ఉన్న సందులోకి ఏసురత్నం ఆమెను తీసుకెళ్లాడు.పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తేవడంతో ఆమె నిరాకరించింది. ఇద్దరం చనిపోదామని చెబుతూ కత్తి తీసి కోసుకోవాలన్నాడు. కానీ, ఆమె వద్దని వారించడంతో ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఆమె జుట్టు పట్టుకుని గొంత వద్ద ఇష్టారాజ్యంగా పొడిచాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయింది. అక్కడికక్కడే విగత జీవిగా మారిన రత్నగ్రేస్ను చూస్తూ నిందితుడు కూడా పీక కోసుకున్నాడు. రక్తపు మడుగులో ఆమె పక్కనే పడిపోయాడు.ఏలూరు త్రీటౌన్ సీఐ కె. శ్రీనివాసరావు, ఎస్ఐ రామారావు çఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు విజయవాడలో వెంటిలేటర్పై ఉన్నట్లు సమాచారం. యువతికి ఈ నెల 26న వివాహ నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. ఆమె పనిచేస్తున్న విద్యాసంస్థలో తనతో పాటు ఫ్యాకల్టీగా పనిచేసే వ్యక్తితో వివాహం నిర్ణయించారని సమాచారం.ఎన్నిసార్లు వారించినా.. నిందితుడు ఏసురత్నం గతంలో తన కుమార్తెను ప్రేమ పేరుతో వేధించేవాడని.. తన కుమార్తెను వేధించవద్దని ఆమె తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతను లెక్కచేయకుండా తనను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడి వేధించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రత్నగ్రేస్, ఏసురత్నం ఇద్దరూ డిగ్రీలో కలిసి చదువుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల ఆమెకు నిశ్చితార్థం కావడంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో 17 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉందని.. ఇంతలో తమ కుమార్తె హత్యకు గురికావటంతో వారు భోరున విలపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఘటన వివరాలు సేకరిస్తున్నట్లు ఏలూరు త్రీటౌన్ ఇన్చార్జి సీఐ శ్రీనివాసరావు చెప్పారు. -
‘వాగు’లో గల్లంతైన నలుగురి మృతి
బాపట్లటౌన్: విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి బాపట్ల ప్రాంతానికి వచ్చిన 12 మందిలో బుధవారం నల్లమడవాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సునీల్కుమార్ (36), అతని కొడుకు అనురాజ్ (13) మృతదేహాలు బుధవారం రాత్రి ఏరియా వైద్యశాలకు తరలించారు. మరో ఇద్దరు ఆచూకీ లభించకపోవడంతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, సూర్యలంక తీరంలోని గజ ఈతగాళ్లు, అగ్నిమాపక అధికారులు టీమ్లుగా ఏర్పడి నల్లమడ వాగులో సుమారు 3 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా వడ్లకొండ కిరణ్గౌడ్ (35) మృతదేహాన్ని గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తించి వెలికి తీశారు. అదే సమయంలో బండా నందు (35) మృతదేహం మూలపాలెం గ్రామశివారులోని తుమ్మచెట్ల మధ్యలో ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. నలుగురు మృతదేహాలకు గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ సీఐ శ్రీహరి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా నగదు, బంగారం పట్టివేత
కావలి/టంగుటూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిధిలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, బంగార దొరికాయి. కావలి వద్ద చెన్నై–కోల్కతా జాతీయ రహదారిపై ఉన్న గౌరవరం టోల్ప్లాజా సమీపంలో కావలి రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదు, బంగారాన్ని పట్టుకున్నారు. వీటిని తరలిస్తూ పట్టుబడిన వారంతా తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన వారే కావడం గమనార్హం. ఈ వివరాలను కావలి డీఎస్పీ వెంకటరమణ మీడియాకు వెల్లడించారు. చెన్నై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. మిర్యాలగూడకు చెందిన మహిళలు తేజ, సుమతి వద్ద రూ.72.50 లక్షల నగదు బయటపడిందని చెప్పారు. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే చెన్నై వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా మిర్యాలగూడకే చెందిన శివమ్మ, యాదమ్మ వద్ద రూ.60 లక్షలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో బస్సులో వెళ్తున్న మిర్యాలగూడకే చెందిన పర్వీన్ వద్ద రూ.29 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెన్నై నుంచి మిర్యాలగూడ వెళ్తున్న కారును తనిఖీ చేయగా.. మోహన్, ప్రభాకర్ అనే వ్యక్తుల వద్ద కిలోన్నర బంగారం బయటపడిందని చెప్పారు. ఈ బంగారానికి సంబంధించి రసీదులు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగదు, మొత్తం బంగారం విలువ కలిపి రూ.2.62 కోట్లు ఉంటాయని వెల్లడించారు. అలాగే చెన్నై నుంచి మిర్యాలగూడకు కారులో వెళ్తున్న మద్దిశెట్టి మల్లేశ్, చంద్రకళ వద్ద 1.238 కేజీల బంగారు బిస్కెట్లను ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ప్లాజా వద్ద సింగరాయకొండ పోలీసులు పట్టుకున్నారు. -
ఏలూరు జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో యువతి గొంతు కోసి..
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.వివరాలు.. ఏలూరు మండలం సత్రంపాడు ఎమ్మార్సీ కాలనీకి చెందిని జక్కుల రత్న గ్రేసి(22) ప్రైవేటు పాఠశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ తొట్టిబోయిన ఏసురత్నం(23) అనే యువకుడు వెంటబడుతున్నాడు. ఈ క్రమంలో ఈనె 26న మరో యువకుడితో గ్రేసికి కుటుంబ సభ్యులు నిశ్చితార్దం జరిపించారు.విషయం తెలుసుకున్న ఏసురత్నం.. కోపంతో యువతిని కలవాలని ఆమె ఇంటి పక్కకు పిలిచి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడిచేశాడు. తీవ్ర రక్తస్రావంతో యువతీ అక్కడికక్కడే మృత్యవాతపడింది. అనంతరం ఏసురత్నం కూడా పీక కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రితో తాగుడు మాన్పించలేక.. యువకుడి విషాదం!
పుట్టపర్తి అర్బన్: మద్యానికి బానిసైన తండ్రిని మార్చుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం వీరాంజనేయపల్లికి చెందిన వడ్డే రాజేష్, రేవతి దంపతులకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు విష్ణువర్దన్(19) ఉన్నారు. బేల్దారి పనులతో పాటు వ్యవసాయ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. ప్రస్తుతం విష్ణువర్దన్ అనంతపురంలోని ఓ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు.చాలా కాలంగా రాజేష్కు మద్యం సేవించడం అలవాటుగా ఉండేది. ఇటీవల అది శ్రుతిమించి మోతాదుకు మించి మద్యం తాగి మత్తులో ఎక్కడపడితే అక్కడే పడిపోయేవాడు. గమనించిన చుట్టుపక్కల వారు రాజేష్ ఆచూకీ తెలపడంతో కుటుంబసభ్యులు వెళ్లి ఇంటికి పిలుచుకువచ్చేవారు. ఈ నేపథ్యంలోనే తెలిసిన వారు పలుమార్లు రాజేష్తో మద్యం అలవాటు మాన్పించాలని కుటుంబసభ్యులకు చెబుతూ వచ్చారు. అయితే తమ మాట తండ్రి వినకపోవడం... తరచూ చుట్టుపక్కల వారు హితబోధనలు చేయడం వంటి చర్యలతో సమాజంలో తలెత్తుకుని తిరగలేని స్థితికి చేరుకున్నామని కుటుంబసభ్యులు లోలోన మదనపడేవారు.ఆదివారం సాయంత్రం అమగొండపాళ్యం రోడ్డు పక్కన మద్యం మత్తులో రాజేష్ పడి ఉన్నాడని తెలుసుకున్న విష్ణువర్దన్ అక్కడకు చేరుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి చేర్చాడు. ఆ సమయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేనప్పుడు తాగుడు ఎందుకు అంటూ కుమారుడు నిలదీశాడు. కుమారుడి వాదనలతో తండ్రి ఏకీభవించకుండా తనదైన శైలిలోనే సమాధానమిస్తూ వచ్చాడు. దీంతో ఇక తండ్రిలో మార్పు రాదని గ్రహించిన విష్ణువర్దన్... ఆదివారం రాత్రి ఇటీవల నిర్మించిన ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పాత ఇంటికి చేరుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం విష్ణు అవ్వ పాలు పితకడానికి పాత ఇంటి వద్ద ఉన్న పశువుల పాక వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఉరికి విగతజీవిగా వేలాడుతున్న మనవడిని చూసి గట్టిగా కేకలు వేసి అప్రమత్తం చేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ కృష్ణమూర్తి అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, కుటుంబాన్ని నిలబెడతాడనుకున్న కుమారుడు చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది. -
రెండు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
చంద్రగిరి/హనుమాన్జంక్షన్ రూరల్: రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఆడిగోపుల శ్రీనివాసులు తన భార్య నీరజకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల(సీఎంసీ)కు తీసుకువెళ్లేందుకు తమ గ్రామానికే చెందిన డ్రైవర్ సమీర్(26)తో కలిసి ఆదివారం రాత్రి కారులో బయలుదేరారు. వారితోపాటు శ్రీనివాసులు అన్న శేషయ్య(49), ఆయన భార్య జయంతి(43) కూడా ఉన్నారు.మార్గమధ్యంలో మనుబోలు వద్ద నీరజ తల్లి పద్మావతమ్మ(56)ను సైతం వీరు కారులో ఎక్కించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 5.40గంటల సమయంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, ఎం.కొంగరవారిపల్లి సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవరు సమీర్, పద్మావతమ్మ, జయంతి, శేషయ్య అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాసులు, నీరజలకు తీవ్ర గాయాలపాలయ్యారు. చంద్రగిరి సీఐ రామయ్య తన సిబ్బందితో కలసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వారిద్దరినీ 108 అంబులెన్స్లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్ సాయంతో బయటకు తీశారు. ఘటనాస్థలంలోనే నలుగురి మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద... కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా వేదసంతూర్కు చెందిన స్వామినాథన్ తన కుటుంబంతో కలిసి పదేళ్లుగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని అడ్వొకేట్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న స్వామినాథన్ తమిళనాడులోని సొంతూరులో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి కారులో బయలుదేరారు. ఆయన కారును మితిమీరిన వేగంతో నడపటంతో కోడూరుపాడు సమీపంలోని పెట్రోలు బంకు వద్ద అదుపు తప్పి రహదారి మధ్యలోని డివైడర్ను దాటుకుని అవతల వైపు రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న స్వామినాథన్(40), ఆయన కుమార్తె రాధాప్రియ(14), కుమారుడు రాకే‹Ù(12), సోదరుడి కుమారుడు గోపి(23) అక్కడికక్కడే మృతిచెందారు. స్వామినాథన్ భార్య సత్య(38)కు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానికులు అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హనుమాన్జంక్షన్ సీఐ అల్లు నవీన్ నరసింహామూర్తి, వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, గన్నవరం డీఎస్పీ ఆర్.జయసూర్య, ట్రైనీ డీఎస్పీ వేదశ్రీ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
చిన్నారులపై అత్యాచారం కేసుల్లో జైలు
విశాఖ లీగల్/విజయవాడ స్పోర్ట్స్: వావి వరసలు మరచి అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు వేర్వేరు కేసుల్లో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ.. ఆయా న్యాయమూర్తులు సోమవారం తీర్పునిచ్చారు. సొంత మనవరాలిపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది తీర్పు చెప్పారు. అలాగే 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం చేసిన మేనమామకు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు తీర్పు వెల్లడించారు.కేసుల పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరంలోని మల్కాపురం పోలీస్స్టేషన్ పరిధిలోని మల్కాపురం జాలరి వీధిలో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వాడమొదుల శ్యాంసుందరరావు (70) నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు. బాధితురాలు (ప్రస్తుతం 19) పెద్దకొడుకు చంద్రశేఖర్ కూతురు. చంద్రశేఖర్ వృత్తిరీత్యా కారు డ్రైవరు. నిత్యం బయటకు వెళ్లేవాడు. బాధితురాలి తల్లి సత్యవతి, తన ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి ఉంటుంది. ఆ ఇల్లు రెండంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్లో బాధితురాలు, వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు.రెండో అంతస్తులో నిందితుడు శ్యాంసుందరరావు, అతని భార్య ఉంటున్నారు. 2017 అక్టోబర్ ఒకటో తేదీకి ముందు నిందితుడు బాలికను భయపెట్టి లోబర్చుకుని ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. అక్టోబర్ ఒకటో తేదీన బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచి్చన వెంటనే సుమారు మూడున్నర గంటల సమయంలో వృద్ధుడు బాలికపై మళ్లీ లైంగిక దాడికి యతి్నస్తుండగా ఆ బాలిక గట్టిగా అరిచింది. ఆ కేకలు విన్న ఆమె చెల్లెలు కింద ఫ్లోర్లో ఉన్న తల్లికి చెప్పింది. అది విన్న తల్లి మేడ మీద మొదటి అంతస్తుపైకి వెళ్లి చూడగా నిందితుడు చేస్తున్న అకృత్యాన్ని కళ్లారా చూసింది. వెంటనే మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఐదు లక్షల రూపాయలను బాధితురాలికి ఇవ్వాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.కసాయి మేనమామకు ఐదేళ్ల జైలు.. ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక (12) తల్లితో కలిసి పండుగలకు విజయవాడ వన్టౌన్లోని అమ్మమ్మ ఇంటికి వస్తుంటుంది. 2017న దసరా పండుగకు వచ్చిన బాలిక పట్ల ఆమె మేనమామ లైంగికదాడికి యతి్నంచడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయిన బాలిక 2018 జనవరిలో మేనమామ తన పట్ల ప్రవర్తించిన తీరును తల్లికి వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2018 జనవరి 9న వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురు సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయ మూర్తి తిరుమల వెంకటేశ్వర్లు తీర్పు చెప్పారు. -
పోక్సో కేసు.. కర్నూలు కోర్టు సంచలన తీర్పు
కర్నూలు: ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసులో కర్నూలు జిల్లా మహిళా స్పెషల్ సెషన్ కోర్టు సంచలమైన తీర్పునిచ్చింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష తోపాటు రూ. 20 వేల రూపాయలు జరిమానా విధించింది. కాగా, 2021, ఆగస్ట 13వ తేదీన కర్నూలు జిల్లా హోళగుంద మండలం బి. హల్లీ గ్రామానికి చెందిన బోయ రంగన్న అనే వ్యక్తి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలడంతో కోర్టు యావజ్జీవ కారాగార శిక్షవిధించింది . -
కృష్ణా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి
కృష్ణా, సాక్షి: కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోడూరుపాడు వద్డ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్వామినాథన్ (40), రాకేష్ (12), రాధప్రియ (14), గోపి(23) అక్కడిక్కడే మృతి చెందగా సత్య (28) (స్వామినాథన్ భార్య ) తీవ్రంగా గాయపడింది. దీంతో, ఆమెను వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇక, వీరంతా కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదంలో మృతుందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాదఛాయలు అములుకున్నాయి. మరోవైపు.. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై వివరాలను సేకరిస్తున్నారు. -
తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
తిరుపతి, సాక్షి: చంద్రగిరిలో ఈ వేకువ ఝామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారిపల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులు నెల్లూరువాసులుగా పోలీసులు చెబుతున్నప్పటికీ.. వాళ్ల వివరాలను మాత్రం వెల్లడించలేదు. కారు కల్వర్ట్లో ఇరుక్కున్న స్థితిని బట్టి అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. గడ్డపార సాయంతో ఇరుక్కున్న కారు డోర్లను బద్ధలుకొట్టి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ AP 26 BH 3435 కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
‘కాంబోడియా’ కేసులో మరో ఇద్దరు ఏజెంట్ల అరెస్టు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువకులను విదేశాలకు తరలిస్తున్న మరో ఇద్దరు ఏజెంట్లను విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ కాంబోడియా పేరిట సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న సుమారు 25 మంది యువకులను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ చొరవతో క్షేమంగా విశాఖకు తీసుకువచి్చన విషయం తెలిసిందే. ఇంకా కాంబోడియాలో చిక్కుకొని ఉండిపోయిన బాధితులను తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు.ఈ కేసుకు సంబంధించి ఆయన విడుదలచేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ నేరాలను అరికట్టడానికి, వాటి మూలాలు ఛేదించడానికి విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ కె.ఫకీరప్ప పర్యవేక్షణలో విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు యువకులను పంపిస్తున్న గాజువాక, భానుజీనగర్ ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ను అదుపులోకి తీసుకోగా విస్తుపోయే వాస్తవాలు బయటికి వచ్చాయి. కన్సల్టెన్సీ ఏజెంట్ కొలుకుల వీరేంద్రనాథ్(37) ఇంజనీరింగ్ చదివి 2023 నుంచి కాంబోడియా దేశానికి ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువకులను పంపిస్తున్నాడు.అనకాపల్లికి చెందిన రామకృష్ణను పరిచయం చేసుకొని, తాను కాంబోడియా దేశం నుంచి వచ్చానని, అక్కడికి కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్గా పంపిస్తే మంచి కమీషన్ వస్తుందని చెప్పాడు. కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న 17 మంది నుంచి రూ.లక్షా 20 వేల చొప్పున తీసుకుని పంపించారు. వారికి ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు కమీషన్ లభించింది. అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వీరేంద్రనాథ్, అతని భార్య శ్రీప్రియ కాంబోడియా ఏజెంట్కు అనేక మంది సిస్టమ్ ఆపరేటర్స్ను పలు దఫాలుగా పంపించారు. వీరిలో కొంతమందిని విజిటింగ్ వీసాపైన బ్యాంకాక్ పంపించి అక్కడ నుంచి కాంబోడియా దేశం బోర్డర్ వద్ద ఆ దేశ వీసా తీసుకుని అక్కడి చైనా కంపెనీలకు ఈ నైపుణ్యం గల వ్యక్తులను 2500 నుంచి 4,000 అమెరికన్ డాలర్లకు విక్రయించారు. చీకటి రూమ్లో బంధించి.. అక్కడికి వెళ్లిన యువకులను చైనా కంపెనీలు అదుపులోకి తీసుకుని ఓ చీకటి గదిలో బంధించేవారు. వివిధ రకాల సైబర్ నేరాలు ఏ విధంగా చేయాలనే అంశంపై బలవంతంగా స్క్రిప్ట్ ఇస్తూ ట్రైనింగ్ ఇవ్వడమే గాక సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చిత్రహింసలకు గురిచేస్తారు. ఆహారం, నీరు ఇవ్వకుండా కట్టిపడేస్తుంటారు. వారి వలలో చిక్కుకున్న తర్వాత బయటపడడం అసాధ్యం. చేసిన నేరాల ద్వారా సంపాదించిన డబ్బులో 1 శాతం కమీషన్ ఇస్తూ 99 శాతం కంపెనీలే తీసుకుంటాయి. వీరంతా ఉత్సాహంగా పనిచేసేందుకు పలు రకాల ఎంటర్టైన్మెంట్స్ అలవాటుచేస్తారు.పబ్స్, కేసినో గేమ్స్, మద్యపానం, జూదం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలకు సంపాదించిన డబ్బును ఖర్చుపెట్టేలా తయారు చేస్తున్నారు. చైనా కంపెనీ చెర నుంచి తప్పించుకుని నగరానికి చేరుకున్న బాధితుడు పెమ్మడి చిరంజీవి, కల్యాణ్, శేఖర్బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిటీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్ విచారణ చేపట్టగా స్కామ్ బయటపడింది. ఈ రాకెట్లో ప్రధాన నిందితుడు చుక్క రాజే‹Ù, అతని వద్ద పనిచేస్తున్న సబ్ ఏజెంట్లు గాజువాకకు చెందిన సబ్బవరపు కొండలరావు, మన్నేన జ్ఞానేశ్వరరావును ఇంతకుముందే అరెస్టు చేశారు. తాజాగా కొలుకుల వీరేంద్రనా«థ్, కొమ్ము ప్రవీణ్కుమార్ను అరెస్టు చేశారు. ప్రత్యేక బృందం దీని వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టడానికి లోతైన దర్యాప్తు చేపడుతున్నట్టు సీపీ తెలిపారు. అందుకు స్పెషల్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఏజెంట్ల చేతిలో మోసపోయినట్లయితే సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాదరావు (సెల్ నంబర్ 9490617917)కు, కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 0891–2565454కు, లేదా సీపీ వాట్సప్ నంబరు 9493336633కు ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు 1930కి నంబర్కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. -
తాపీగా తప్పుడు కేసులు
సాక్షి, అమరావతి: రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈసీ నియమించిన పోలీసు అధికారులు స్వామి భక్తి చాటుకునేందుకు బరి తెగిస్తున్నారు. పోలింగ్ రోజు పల్నాడు, అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలే అందుకు నిదర్శనం. పల్నాడులో ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు టీడీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నట్లు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆర్వో (రిటర్నింగ్ అధికారి) నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వరకూ, ఎస్పీ నుంచి డీజీపీ దాకా పలుదఫాలు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న రెంటచింతల మండలంలో ఎన్నికల రోజు భారీగా పారా మిలటరీ బలగాలను మోహరించగా, టీడీపీ మద్దతుదారులున్న చోట్ల హోంగార్డులతో సరిపెట్టడం గమనార్హం. తాపీగా సీఐ ఫిర్యాదు..మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంపై ఈనెల 20న నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా నుంచి ఎడిట్ చేసిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసమైనట్లు పీవో లాగ్ బుక్లో ఎక్కడా నమోదు చేయలేదు. పోలింగ్కు విఘాతం కలిగినట్లు పేర్కొనలేదు. సిట్ కూడా దీని గురించి ప్రస్తావించలేదు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి పాల్గొన్నట్లు చెప్పలేదు. ఈనెల 18న డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలోనూ ఆ ప్రస్తావనే లేదు. అసలు వెబ్కాస్టింగ్ నుంచి అది ఎలా లీకైంది? నిజమైనదేనా? మార్ఫింగ్ చేసిందా? అనే విషయాలను ధృవీకరించుకోకుండా పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు.దీన్ని సవాల్ చేసిన పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో పోలీసులు మరో మూడు అక్రమ కేసులు బనాయించారు. ఈ నెల 14న కారంపూడిలో వైఎస్సార్సీపీ శ్రేణులను చెదరగొడుతుండగా తన తలకు గాయమైందని, ఆ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నారంటూ సీఐ నారాయణస్వామి తాపీగా ఈనెల 22న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక కేసు నమోదైంది. పోలింగ్ రోజు తనను హత్య చేయడానికి పురిగొల్పారని ఆరోపణలు చేసిన ఓ టీడీపీ నేత ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేయగా, తనను చంపుతానని బెదిరించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మూడో కేసును పిన్నెల్లిపై నమోదు చేశారు. వీటిని పరిశీలిస్తే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.టీడీపీ గూండాలకు చట్టం చుట్టమా?నరసరావుపేటలో పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. గోపిరెడ్డి దొరకకపోవడంతో ఆయన మామపై పచ్చ మూక దాడి చేసింది. అయితే హత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ గూండాలపై కేసు నమోదు చేయకుండా ఆ కేసును పోలీసులు గోపిరెడ్డిపై బనాయించడం విస్మయం కలిగిస్తోంది. నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవిందబాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు లభ్యమైతే ఆయనపై చిన్న కేసుతో సరిపుచ్చారు. పోలింగ్ మర్నాడు కారంపూడిలో టీడీపీ మూకలు పేట్రేగినా పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు. -
అవినీతి అందిపుచ్చుకుంటూ..
రావులపాలెం: కుర్చీ మహిమో.. చేతినిండా సంపాదించాలనే తాపత్రయమో.. అవినీతి మరకను ఒకరి తర్వాత ఒకరు పుచ్చుకుంటూ తలవంపులు తెస్తున్నారు. ప్రతి పనికీ చేయిచాపి, చివరికి ఏసీబీ వలకు చిక్కుతూ ఉన్న పరువును రచ్చకెక్కిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని రావులపాలెం పోలీస్ స్టేషన్ అంతటా హాట్టాపిక్గా మారింది. ఐదు నెలల వ్యవధిలోనే ఇక్కడ పనిచేసిన అధికారులు ఇద్దరు లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశం అయ్యింది. నాడు ఎస్సై అవినీతికి పాల్పడుతూ వలలో చిక్కుకోగా, నేడు అదే స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి ఎస్సై ర్యాంకు అధికారి ఉండేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ స్టేషన్ను అప్గ్రేడ్ చేసి ఎస్సై స్థానంలో సీఐ స్థాయి అధికారిని నియమించారు. గత జనవరిలో ఇదే స్థానంలో ఎస్సై హోదాలో ఉన్న అప్పటి ఎస్సై ఎం.వెంకటరమణ ఒక కేసులో 41 నోటీస్ జారీ చేసే విషయంలో ముద్దాయిని స్టేషన్కు పిలిచి చార్జిïÙట్లో తక్కువ శిక్షపడేలా సెక్షన్లు మార్చి సహాయ పడతానంటూ, ఆ కేసులో అనపర్తి మండలం పొలమూరుకు చెందిన సత్తి విజయరామకృష్ణారెడ్డి నుంచి రూ. లక్ష డిమాండ్ చేశారు. దానికి బాధితుడు అంగీకరించకపోవడంతో రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఆ సొమ్ము తీసుకుంటూ అప్పటి ఎస్సై వెంకటరమణ, కంప్యూటర్ ఆపరేటర్ సత్యప్రసాద్లు ఏసీబీకి చిక్కారు. జనవరి 9న ఈ ఘటన జరగ్గా, అదే నెలలో 13న అప్గ్రేడ్ స్టేషన్గా మారిన రావులపాలెం పోలీస్ స్టేషన్కు సీఐగా తణుకు రూరల్ నుంచి బదిలీపై వచ్చిన సీహెచ్ ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచీ సీఐపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికల అనంతరం తిరిగి పశి్చమ గోదావరి జిల్లా వెళ్లేందుకు ఇప్పటికే సీఐ సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత కేసుల్లో నిందితుల నుంచి సొమ్ము దండుకోవాలనే లక్ష్యంతో వారం రోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసం కిందిస్థాయి సిబ్బందితో వివిధ కేసుల్లో బాధితులకు ఫోన్లు చేయించి స్టేషన్కు రావాలని పిలుపిస్తున్నారు. గతనెల 16న రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి, పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనాలు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లక్ష్మణరాజును రూ.50 వేలు ఇవ్వాలని పలుమార్లు బాధించడంతో, అతను విసిగిపోయి రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో అతని నుంచి రూ.50 వేల లంచాన్ని తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వెసులుబాటును అస్త్రంగా మలచుకుని.. నాడు ఎస్సై రూ.25 వేలు, నేడు సీఐ రూ. 50 వేలు తీసుకుంటూ పట్టుబడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడకు ఏ అధికారి వచ్చినా అవినీతి మాత్రం తగ్గడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులను కోర్టుకు తీసుకు వెళ్లకుండా 41 నోటీస్ జారీచేసి పంపించే విధంగా చట్టంలో ఉన్న వెసులుబాటును అస్త్రంగా మలచుకుని రూ. వేలల్లో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలులు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉసురుతీసిన కలహాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కుటుంబ కలహాల కారణంగా అనుమానాస్పదంగా దంపతులు మృతి చెందిన సంఘటన రాజమహేంద్రవరం ఆనంద్నగర్లో శనివారం చోటుచేసుకుంది. అయితే సంఘటనా స్థలంలో ఆధారాలను బట్టి భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జగ్గంపేటకు చెందిన శ్రీధర్ (28)కు ప్రత్తిపాడుకు చెందిన దేవి (22)కి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడేళ్ల బాబు, ఆరేళ్ల పాప ఉన్నారు. తాపీ పనిచేసుకునే శ్రీధర్కు ఏడాది కిందట ప్రమాదం జరగడంతో వేరొకరిపై ఆధారపడే పరిస్థితి వచ్చింది.భార్య దేవికి ఫిట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడేవారు. ఈ నేపథ్యంలో భార్య దేవి నెలరోజుల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను కాపురానికి తీసుకు వచ్చేందుకు శ్రీధర్ వారం కిందట అత్తారింటికి వెళ్లాడు. పిల్లలను ప్రత్తిపాడులో వదిలేసి భార్యాభర్తలిద్దరూ కలసి ఆనంద్నగర్లోని ఇంటికి శనివారం ఉదయం 10.30 గంటలకు వచ్చారు. వస్తూ శ్రీధర్ వెంట మద్యం బాటిల్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకూ తలుపు వేసి ఉండడం, ఇంటి లోపలకు వెళ్లిన వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు ఎంత తట్టినా తీయలేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుకవైపు నుంచి వెళ్లి తలుపులు తీసి చూడగా భార్యాభర్తలిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని మూడో పట్టణ పోలీసులకు తెలిపారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దేవి మెడకు చున్నీ ఉండడం, ఆమె కిందపడిపోవడంతో ఆమెను చంపి శ్రీ«ధర్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను సీఐ వీరయ్య గౌడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.