Top Stories
ప్రధాన వార్తలు
![AP Political News: June 19 YSRCP Key Meeting](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/YSRCP_Key_Meeting.jpg.webp?itok=LJPsSFIz)
YS Jagan: 19న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
గుంటూరు, సాక్షి: ఎన్నికల ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ కేడర్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలను సమీక్షిస్తూనే.. పార్టీ కీలక నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లుండి కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 19వ తేదీన తన కార్యాలయంలో వైఎస్జగన్ భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధానాంశాలుగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో వాళ్లకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఇప్పుడే ఏం అయిపోలేదని.. అధైర్య పడొద్దని, పార్టీ చేసిన మంచిని ప్రజలు అంత సులువుగా మరిచిపోరని, త్వరలోనే పార్టీ పుంజుకుంటుందని వాళ్లందరికీ ధైర్యం చెప్పారాయన. అలాగే.. ప్రతిపక్షాలకు కాస్త టైం ఇద్దామని, ఆ తర్వాత ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. మరోవైపు.. టీడీపీ శ్రేణుల్లో గాయపడ్డ వాళ్లను పరామర్శించేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తారని ప్రకటించారు కూడా.
![West Bengal: Goods train rams into Kanchenjunga Express Updates](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Bengal_Train_Accident.jpg.webp?itok=v3sAlK6u)
Train Accident: బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా 15 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 60 మంది ప్రయాణికులు గాయపడినట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతుండడం.. క్షతగాత్రులకు తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. న్యూ జల్పాయ్గురి వద్ద ఓ గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలును ఢీ కొట్టింది. అస్సాం సిల్చార్- కోల్కతా సీల్దా మధ్య కాంచన్జంగా ఎక్స్ప్రెస్(13174) నడుస్తుండగా.. ప్రమాదానికి కారణమైన గూడ్స్ అగర్తల నుంచి సీల్దా వస్తోంది. ఈ క్రమంలో.. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో న్యూ జల్పాయ్గురి రంగపాని-నిజ్బారి స్టేషన్ల మధ్య గూడ్స్, కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఢీ కొట్టింది. पश्चिम बंगाल में रेल हादसा, डाउन कंचनजंगा एक्सप्रेस से टकराई मालगाड़ी, फिलहाल 6 घायलों की सूचनाअभी तक किसी जनहानि की खबर नहीं, राहत और बचाव के लिए रेलवे दल रवाना...#WestBengal #TrainAccident @IRCTCofficial @RailMinIndia pic.twitter.com/mhsDQpXHTw— Manraj Meena (@ManrajM7) June 17, 2024ప్రమాదం ధాటికి రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఓ బోగీ గాల్లోకి లేచింది. మూడు బోగీల్లోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదంలో గూడ్స్ డ్రైవర్, అసిస్టెంట్ పైలట్.. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ గార్డ్ మరణించినట్లు రైల్వే శాఖ ధృవీకరించింది. అయితే మృతుల వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.Shocked to learn, just now, about a tragic train accident, in Phansidewa area of Darjeeling district. While details are awaited, Kanchenjunga Express has reportedly been hit by a goods train. DM, SP, doctors, ambulances and disaster teams have been rushed to the site for rescue,…— Mamata Banerjee (@MamataOfficial) June 17, 2024మరోవైపు ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనా స్థలానికి వెళ్లారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు సోషల్ మీడియా ద్వారా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఈ ప్రమాదం బాధాకరమని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారాయన. ఇంకోవైపు కేంద్రం ప్రమాదంలో మరణించిన వాళ్లకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. Unfortunate accident in NFR zone. Rescue operations going on at war footing. Railways, NDRF and SDRF are working in close coordination. Injured are being shifted to the hospital. Senior officials have reached site.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2024 ప్రమాదం ఎలా జరిగింది?ప్రమాదం అనంతరం ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది. ఒకే ట్రాక్పై రెండు రైళ్లు రావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే గూడ్స్ రైలు సిగ్నల్ను పట్టించుకోకుండా వేగంగా క్రాస్ చేసి వెళ్లిపోయిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే.. ప్రమాదానికి గల కారణంపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
![If I Have To Leave Captaincy: Babar Azam After Pakistan Poor T20 WC Exit Defends](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/pak_1.jpg.webp?itok=ajcQ9UCy)
కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన
‘‘నేను ఎప్పుడైతే నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని భావించానో అప్పుడే(2023) కెప్టెన్సీ వదిలేశాను. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాను కూడా!ఆ తర్వాత మళ్లీ బోర్డు నాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం. ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిన తర్వాత.. ఏం జరిగిందన్న అంశం గురించి చర్చిస్తాం.ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటాం. ఒకవేళ నేను కెప్టెన్సీ వదిలేయాల్సి వస్తే.. కచ్చితంగా అందరి ముందు నేనే ప్రకటిస్తా. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదు.ఏం జరిగినా అంతా ఓపెన్గానే ఉంటుంది. అయితే, నేనిప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఈ విషయంలో పీసీబీదే తుది నిర్ణయం’’ అని పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం స్పష్టం చేశాడు.వన్డే వరల్డ్కప్-2023లో వైఫల్యం తర్వాతపాక్ బోర్డు ఆదేశాల మేరకే సారథిగా కొనసాగాలా లేదా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ ఘోరంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే.గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.అయితే, అతడిని పీసీబీ ఎక్కువకాలం కొనసాగించలేదు. బోర్డు యాజమాన్యం మారిన తర్వాత మళ్లీ బాబర్ ఆజంనే వన్డే, టీ20 కెప్టెన్గా నియమించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024లో బాబర్ సారథ్యంలో పాకిస్తాన్ ఘోర పరాభవం పాలైంది.గ్రూప్-ఏలో ఉన్న పాక్.. తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా.. తాజాగా ఐర్లాండ్పై గెలుపొందినా అప్పటికే సూపర్-8 నుంచి నిష్క్రమించింది. పాక్ కంటే మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా టీమిండియాతో పాటు తదుపరి దశకు అర్హత సాధించింది.అందరి ప్లేస్లో నేను ఆడలేను కదా!ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని వెంటనే రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం స్పందిస్తూ.. ‘‘కేవలం ఒక వ్యక్తి వల్ల మేము ఓడిపోలేదు. జట్టుగా గెలిచాం.. జట్టుగానే ఓడిపోయాం. చాలా మంది కెప్టెన్ వైపు వేలు చూపిస్తున్నారు. కానీ ప్రతి ఆటగాడి స్థానంలో నేను వెళ్లి ఆడలేను కదా! జట్టులోని 11 మంది ఆటగాళ్లకు తమదైన పాత్ర ఉంటుంది. జట్టుగా మేము విఫలమయ్యాం. ఈ విషయాన్ని ముము అంగీకరించక తప్పదు. వైఫల్యానికి ఎవరో ఒకరిని బాధ్యులుగా చూపే పరిస్థితి లేదు’’ అని పేర్కొన్నాడు. తనను విమర్శిస్తున్న వాళ్లకు ఈ మేరకు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు బాబర్ ఆజం.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ కెప్టెన్.. ధోని వరల్డ్ రికార్డు బద్దలు View this post on Instagram A post shared by ICC (@icc)
![congress leader Sam Pitroda reacts om EVMS debate says Possible to manipulate](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/sam.jpg.webp?itok=TLRv7JQw)
ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యమే: శ్యామ్ పిట్రోడా
ఢిల్లీ: ఎన్నికల పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) హ్యాకింగ్కు గురువుతున్నాయంటూ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం మిషన్లను హ్యాక్ చేయడానికి, ఫలితాలను తారుమారు చేయడానికి అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్, కాంప్లెక్స్ సిస్టంల రంగాల మీద సుమారు అరవై ఎళ్లపాటు నేను పనిచేశాను. అదే విధంగా నేను ఈవీఎం యంత్రాల వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యం అవుతుంది.దీని వల్ల ఫలితాలకు కూడా మారిపోతాయి. ఇటువంటి సమయంలో సంప్రదాయ పాత బ్యాలెక్ ఓటింగ్ విధానమే చాలా ఉత్తమమైంది. ఓట్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి’’ అని అన్నారు.I have spent about 60 years in the forefront of #electronics, #telecom,IT, #software, #complex systems and a lot more. I have studied #EVM system carefully and believe that it is possible to manipulate. The best approach is the traditional paper ballet to count as casted.— Sam Pitroda (@sampitroda) June 16, 2024సంబంధిత కథనం: ఈవీఎంల గుట్టు విప్పేదెవరు?
![Ex Minister Gudiwada Amarnath Key Comments Over TDP And Rishikonda](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Minister-Gudiwada-Amarnath.jpg.webp?itok=9wNbtEyT)
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్కు ఎలా అంటగడతారు?’
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. రుషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సోమవారం విశాఖలో అమర్నాథ్ మాట్లాడారు.. ‘‘వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్.. ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలి. రుషికొండపై కట్టిన భవనాల్లో వైఎస్ జగన్ ఏమీ ఉండరు. ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి... నాలుగు నెలలు క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారు. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటుంబం మీద బురద జల్లాలని చూడటం ఎంతవరకు సమంజసం? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్ కో..ఆక్రమణలు జరిగింది రుషికొండలో కాదు.. గీతం యూనివర్సిటీలో జరిగాయి. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేది. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండపై శాశ్వత భవనాలు నిర్మించారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలి. రుషికొండ భవనం గురించి మీడియోలు, ఫోటోలు తీసి చూపించారు. అదే సమయంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూపించండి. .. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కట్టిన ఆసుపత్రిని చూపించండి. వాటర్ ప్రాజెక్ట్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం, కురపం కాలేజీ, మూలపేటలో పోర్టు నిర్మాణం, పలు ప్రాజెక్ట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి అవి చూపించండి. .. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆనాడు ప్రభుత్వధనం ఏమైంది?. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. టీడీపీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. అధికార పార్టీ ఇలాంటివి మానుకోవాలని కోరారు. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టీడీపీ నేతలు గుర్తించాలి’ అంటూ గుడివాడ అమర్నాథ్ వైఎస్సార్సీపీ తరఫున ఎల్లో ముఠాకు కౌంటర్ ఇచ్చారు.
![Harish Rao Questioning Congress Govt Over Jobs And Pensions](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Harish-Rao-Questioning.jpg.webp?itok=EDqz6MKi)
ఉద్యోగాలు, పెన్షన్ల సంగతేంటి.. భట్టి మాటలు ఏమయ్యాయి?: హరీష్రావు
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీశ్ రావు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే త్వరలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.కాగా, తెలంగాణభవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గ్రూప్స్ ఉద్యోగాలు పెంచాలని అడిగింది. మరి ఇప్పుడు ఎందుకు పోస్టులు పెంచడం లేదు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క చెప్పిన మాటలు ఏమయ్యాయి. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకు అన్యాయం చేయకండి. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వారికి న్యాయం చేయాలి.గ్రూప్1, గ్రూప్-2 నిరుద్యోగ యువత మమ్మల్ని కలిశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు వారిని రెచ్చగొట్టి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజాభవన్ వద్దకు వెళ్ళి చిన్నారెడ్డి కాళ్ళు పట్టుకున్నా కనికరించటం లేదని ఆవేదన చెందుతున్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేయకండి, ప్రభుత్వం భేషజాలకు పోకుండా వారికి న్యాయం చేయాలి.గ్రూప్స్ పరీక్షల్లో 1:50 ఇస్తామంటే 1:100 ఉద్యోగాలు బడుగు బలహీనవర్గాలకు ఇవ్వాలని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాము ఇస్తామని భట్టి చెప్పారు. కానీ, ఇప్పుడు ఇవ్వటం లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు. ఆరు నెలలు అయిన జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వటం లేదు. మీ మాటలు గడప దాటడం లేదు. రాష్ట్రంలో మెగా డీఎస్సీతో 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. కానీ, 11వేలకే పరిమితం ఎందుకు చేస్తున్నారు.నో పెన్షన్లు..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఇప్పటికీ ఇంకా పెన్షన్లు ఇవ్వలేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నెల నెలా పెన్షన్ వచ్చింది. కానీ, ఇప్పుడు ఆ పాత పెన్షన్లు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం రాగానే నాలుగు వేలు ఇస్తామని అన్నారు. నాలుగు వేలు కాదు కదా, ఉన్న రెండు వేల పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు. అభాగ్యులకు ఇచ్చే పెన్షన్ కూడా ప్రభుత్వానికి భారం అవుతుందా?. ఓట్ల కోసం జనవరి నుంచి రావాల్సిన పెన్షన్లు ఆపారు. ఏప్రిల్, మే నెల పెన్షన్లు కచ్చితంగా ఇవ్వాలి. ఇంటికి రెండు పెన్షన్లు ఎక్కడ?. అవ్వాతాతలకు ఇద్దరికీ ఇస్తామన్నారు ఏమైంది?.ఒకటో తేదీన జీతాల్లేవ్..ఆశా వర్కర్లు వైద్య విధాన పరిషత్ను ముట్టడించారు. వారికి ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ, ప్రభుత్వం అందరికీ ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకటో తారీఖు ఇస్తే వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తారు. వారి జీతాలు వెంటనే చెల్లించాలి. గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా జీతాలు ఇవ్వటం లేదు. నిన్న మొన్న కొన్ని వార్తలు చూసాను, ఐదు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని చెప్తున్నారు.గ్రామ పంచాయతీలు నడపటం ఇబ్బందిగా ఉన్నది. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప పని చేత కాదా?. సఫాయి కార్మికులు, ట్రాక్టర్లు నడవక డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించింది. 65 లక్షల చెక్కులు ప్రింట్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపారు. కేసీఆర్ ఫోటో చెక్కుల మీద ఉందని ఇవ్వటం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. నీట్పై కీలక వ్యాఖ్యలు..అలాగే, నీట్ పరీక్షపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కేంద్రంలో బీజేపీ తీరుతో విద్యా విధానం కుంటుపడుతుంది. 24 లక్షల మంది వైద్య విద్యార్థులు ఆగమయ్యే పరిస్థితి ఉంది. పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కలు కలపటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 67 మందికి మొదటి ర్యాంక్ వచ్చింది. పరీక్ష రాసిన ఆరు మంది విద్యార్థులకు 720 మార్కులు వచ్చాయి. కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి దీనిపై అస్సలు మాట్లాడటం లేదు. 1563 మంది విద్యార్థులకు ఏ విధంగా గ్రేస్ మార్కులు కలిపారు. వారి పేర్లు, నంబర్లు ఎందుకు తెలపడం లేదు. పేపర్ లీకేజీ జరిగింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈ ఫలితాలు రావటం అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. పేపర్ లీకేజీపైన ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపటం లేదు’ అని ప్రశ్నించారు.
![Ram Charan: I Had Parties When My Films Failed](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Ram-Charan_0.jpg.webp?itok=NvKm-LSe)
సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటా: రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత రామ్చరణ్దే! కెరీర్ ప్రారంభంలో తడబడ్డప్పటికీ రానూరానూ నటనలో ఆరితేరాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్కు.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఏదైనా ఒత్తిడికి లోనయ్యారా? అన్న ప్రశ్న ఎదురైంది. ఒత్తిడిగా ఫీలవనుఇందుకు చరణ్ స్పందిస్తూ.. ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. నా కెరీర్ విషయానికే వస్తే సినిమా ఫలితాల గురించి మరీ అంత ఒత్తిడిగా ఫీలవను. చెప్పాలంటే ఏదైనా సినిమా బాగా ఆడలేదంటే రిలాక్స్ అయ్యేందుకు పార్టీ చేసుకుంటాను. అలాగే ఆర్ఆర్ఆర్ సక్సెస్ అయినప్పుడు వారం రోజుల దాకా ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టలేదు. నా కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేశాను. ప్రస్తుతం ఏం చేస్తున్నా..సక్సెస్, ఫెయిల్యూర్ల గురించి అంతగా ఆలోచించను. ఇప్పుడు ఏం చేస్తున్నాననేదే నమ్ముతాను. రేపటి గురించి ఆందోళన చెందను' అని చెప్పుకొచ్చాడు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. అలాగే బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. దీని తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో మూవీ చేయనున్నాడు.చదవండి: బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
![Ksr Comments On The Chances Of YSRCP Coming Back To Power In Politics](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/YSRCP_Good_Days.jpg.webp?itok=28X8H8Nt)
వైఎస్సార్సీపీ బౌన్స్ బ్యాక్ వెరీ సూన్!
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనూహ్యంగా ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు. ఆయా వర్గాల వారిని కలుస్తున్నారు. పార్టీ నేతలతో సంభాషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వేర్వేరుగా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాలలో పార్టీకి ఎదురైన ఓటమి నుంచి కోలుకుని, మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విషయమై చర్చిస్తున్నారు. తాను కచ్చితంగా ప్రజలలో తిరుగుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా క్యాడర్ కు భరోసా ఇచ్చేది అవుతుంది.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పే విధంగా తాను టూర్ చేస్తానని ప్రకటించారు. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలో తిరగడం మొదలు పెడితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల హింసాయుత ఘటనలు జరిగాయి. వాటిలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. కొద్ది మంది మరణించారు. ఓటమిని భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీవారి ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. వారి కోసం ఇప్పటికే జిల్లా వారీగా లీగల్ టీమ్ లు ఏర్పాటుచేశారు. నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా చోట్ల పర్యటించాలని కోరారు. తదుపరి తానే స్వయంగా వెళ్లి పరామర్శించబోతున్నారు.ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇదే పని చేయాలి. గతంలో వ్యక్తిగత కారణాలతో ఎక్కడైనా గొడవ జరిగి, టీడీపీ వ్యక్తి ఎవరైనా గాయపడినా, మరణించినా చంద్రబాబు దానిని రాజకీయం చేసి, అక్కడకు పరామర్శ యాత్ర చేపట్టేవారు. అదంతా టీడీపీ మీడియాలో విస్తారంగా ప్రచారం అవుతుండేది. ఈ రకంగా ఐదేళ్లపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి దుష్ప్రచారం చేశారు. ఎలాగైతేనేం అధికారం సంపాదించారు. టీడీపీ వారు దానిని సద్వినియోగం పరచుకోవడం మాని వైఎస్సార్సీపీ వారిపై కక్ష సాధింపునకు వాడుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ యధేచ్చగా హింసాకాండకు పాల్పడడానికి చంద్రబాబు వంటి పెద్ద నేతలు కూడా ప్రోత్సహం ఇవ్వడం దురదృష్టకరం.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీవారిలో విశ్వాసం పెంపొందిచడానికి చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీకు భవిష్యత్తు ఉందని ఆయన చెబుతూ ఆత్మ స్థైర్యం కోల్పోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది వాస్తవం. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1989-94, 2004-2014, 2019-2024 టరమ్ లలో అధికారంలో లేదు. ప్రతిపక్షంగానే ఉంది. అయినా పార్టీ నిలబడింది. తిరిగి పవర్ లోకి వచ్చింది. అబద్ధాలతో వచ్చిందా? లేక కొందరు అనుమానిస్తున్నట్లు ఈవీఎం మోసాలతో వచ్చిందా? అనేది వేరే విషయం. కానీ పార్టీ ఏర్పడిన తర్వాత నాలుగు దశాబ్దాలలో రెండు దశాబ్దాలపాటు అధికారంలో లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి.అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించినప్పుడు దాదాపు ఒంటరిగానే రాజకీయం ఆరంభించారు. ఆ తర్వాత 2014లో అధికారం సాధించలేకపోయినా, నిత్యం ప్రజలతో మమేకమయి 2019లో ప్రభుత్వంలోకి వచ్చారు. కనుక ప్రతిపక్షంలో ఉండడం వైఎస్సార్సీపీకి కూడా కొత్త కాదు. కాకపోతే ఒక్కసారిగా ఓటమిని ఊహించని క్యాడర్ కు కాస్త ధైర్యాన్ని ఇచ్చి ప్రజలలో పనిచేసేలా వ్యూహం రచించుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం విపక్షానికి ఉంటుంది. దానిని వినియోగించుకోగలగాలి.ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చెప్పిన హామీలను నెరవేర్చి ఒక విశ్వసనీయత కలిగిన నేతగా పేరొందారు. అంతవరకు వాస్తవం. ఓటమికి పలు ఇతర కారణాలు ఉండవచ్చు. కానీ చాలా వరకు మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్ నిలబడిపోతారు. దానినే ఆయన ప్రస్తావించి మనపట్ల విశ్వసనీయత బతికే ఉందని అన్నారు. అర్హతే ప్రమాణికంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా స్కీములు అమలు చేసిన చరిత్ర తమది అయితే, కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణంతో టీడీపీ వారు తెగబడి రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చారని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరి స్కీముల అమలులో పార్టీ, కులం, మతం వంటివి చూడని నేత మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.అయితే అదే విశ్వసనీయత పాయింట్ ఆయనను దెబ్బతీసిందని చెప్పాలి. తన ప్రభుత్వం ఏడాదికి సుమారు డెబ్బైవేల కోట్ల రూపాయల మేర వివిధ స్కీములను అమలు చేస్తున్నందున అదనంగా కొత్త స్కీములు ఇవ్వలేమని, పెన్షన్ లు నాలుగువేల రూపాయలు చేయలేమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మానిఫెస్టో విడుదల సందర్భంగా పేర్కొన్నారు. దానిని జనం పాజిటివ్ గా తీసుకోలేదని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన భారీ హామీల ప్రకటనకు ఆశపడి టీడీపీకి ఓటు వేసినట్లు కనబడుతుంది. దానిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. "విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా! లేక కష్టాలు ఎదుర్కుంటూ హూందాగా నిలబడి ముందడుగు వేద్దామా?" అని ప్రశ్నించారు. మాట ప్రకారం నిలబడితేనే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన నమ్ముతున్నారు.తాత్కాలికంగా ప్రజలు చంద్రబాబు హామీలను నమ్మినా, వాటిని అమలు చేయడం కష్టం కనుక, 2014 టరమ్ లో మాదిరి చంద్రబాబు ప్రభుత్వం ఈసారి కూడా చతికిలపడుతుందని పలువురు భావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా అదే కావచ్చు. అందుకే నిబ్బరంగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి అత్యధిక మెజార్టీ ఉన్నందున చంద్రబాబు నాయుడు రకరకాల ప్రలోభాలు పెట్టడమో, లేక తప్పుడు కేసులు పెట్టించడమో చేస్తారని ఆయన అనుమానిస్తున్నారు. దానిని తట్టుకుని నిలబడాలని ఎమ్మెల్సీలను ఆయన కోరారు. దానికి ఎంతమంది కట్టుబడి ఉంటారన్నది కాలమే తేల్చుతుందని చెప్పాలి.ప్రత్యేక హోదా గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పేవారు. తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే, కేంద్రంలో ఏ కూటమికి తక్కువ సీట్లు వస్తే, దానికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక హోదా డిమాండ్ పెడతానని అనేవారు. అప్పట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. దాంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి రావడం ప్లస్ పాయింట్. అయినా ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం ఆయన బలహీనత. దానిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా ఎక్స్ పోజ్ చేశారు. మరో మాట కూడా అన్నారు. ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్నది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. దానికి ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు లేవు. అందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. అంత ఉదారత తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ఆశించనవసరం లేదు.1994లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఉమ్మడి ఏపీలో ఇరవైఆరు సీట్లే వచ్చాయి. దీని ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అప్పట్లో కాంగ్రెస్ నేత పి. జనార్ధనరెడ్డి పలుమార్లు డిమాండ్ చేసినా, ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి చంద్రబాబు అంగీకరించలేదు. అలాంటిది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఆ హోదా ఇస్తారని అనుకోనవసరం లేదు. అయితే శాసనమండలిలో వైఎస్సార్సీపీకి బలం ఉన్నంతకాలం ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పార్టీలో పునరుత్తేజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పక తప్పదు. అంతవరకు ఓపిక పడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు వైఎస్సార్సీపీకు భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
![Eid Ul Adha 2024: The History Of An Ancient Dish Biryani](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/biray.jpg.webp?itok=YgVLjhXX)
ఈద్ ఉల్ అధా 2024: బిర్యానీ ఎక్కడ పుట్టింది? దీని కథేంటీ..?
బక్రీ ఈద్గా పిలిచే ఈద్ ఉల్ అధా ఈ ఏడాది ఇవాళే(జూన్ 17) బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇది త్యాగానికి గుర్తుగా జరుపుకునే విందు. అబ్రహం ప్రవక్త కొడుకు ఇస్మాయిల్ని బలి ఇవ్వమని కోరడం..దేవుడు జోక్యం చేసుకుని బలిగా పొట్టేలుని ఇవ్వడం గురించి ఖురాన్లో ఒక కథనం ఉంటుంది. అందుకు గుర్తుగా ఈ రోజున పొట్టేలు(మేక) బలి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ..ఒక వ్యక్తి స్థానంలో మరోక జీవిని బలి ఇవ్వడం అనేది.. త్యాగం లేదా ఖుర్బానీ చరిత్రను గౌరవించేందుకు గుర్తుగా ఈ రోజుని ముస్లింలంతా జరుపుకుంటారు. ఈ రోజు మాంసంతో కలిపి వండే బిర్యానీని తయారు చేసి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పంచుకుని తింటారు. ఈ పండుగ పురుస్కరించుకుని అసలు ఈ బిర్యానీ ఎక్కడ పుట్టింది..? ఎలా మన భారతదేశానికి పరిచయం అయ్యింది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!భారతదేశంలో అత్యంత మంది ఎక్కువగా ఆర్డర్ చేసే వంటకంగా ప్రసిద్ధ స్థానంలో ఉంది బిర్యానీ. కుల మత భేదాలు లేకుండా ప్రజలంతా ఇష్టంగా తినే వంటకం కూడా బిర్యానీనే. ఇంతలా ప్రజాధరణ కలిగిన ఈ వంటకం చరిత్ర గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!. బిర్యానీ అన్న పదం 'బిరింజ్ బిరియాన్' (ఫ్రైడ్ రైస్) అనే పర్షియన్ పదం నుంచి పుట్టింది. అందుకే బిర్యానీ ఇరాన్లో పుట్టలేదన్న వాదనా వినిపిస్తుంటుంది. కానీ ఇరాన్లో ధమ్ బిర్యానీది ఘనమైన చరిత్ర. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపైన చాలా సేపు దాన్ని ఉడికించి, ఆ మాంసంలోని సహజసిద్ధ రసాలు నేరుగా అన్నంలోకి ఊరేలా చేసి, ఆ పైన సుగంధ ద్రవ్యాలు జోడించి బిర్యానీ తయారుచేస్తారని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ బిర్యానీ మొఘల్ చక్రవర్తుల ద్వారానే భారత్లోకి వచ్చిందన్న ప్రచారం ఉన్నా దానికి సరైన ఆధారాలు లేవు. అంతేగాదు దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులూ, యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి అది దేశంలోకి ప్రవేశించిందన్నది ఎక్కుమంది చెబుతున్న వాదన. ఏదీఏమైనా..నవాబుల కుటుంబాలకే పరిమితమైన బిర్యానీ, నెమ్మదిగా తన రూపం మార్చుకుంది. భిన్నమైన ప్రాంతాల్లోని ప్రజల ఇష్టాలకు అనుగుణంగా విభిన్న సుగంధ ద్రవ్యాలను తనలో కలుపుకుంటూ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కమ్మని రుచితో చేరువైంది. ఇక చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం..ఈ బిర్యానీ వంటకం మొఘల్ శకం, చక్రవర్తి షాజహాన్ భార్య బేగం ముంతాజ్ మహల్ కాలం నాటిదని ప్రసిద్ధ కథనం. ఆమె ఒకసారి పోషకాహార లోపంతో కనిపించిన సైనిక అధికారులను చూసి, వారి కోసం పోషకమైన, చక్కటి సమతుల్య భోజనాన్ని తయారు చేయమని తన రాజ ఖన్సామాలను (వంటచేసేవాళ్లుకు) ఆదేశించింది. దాని ఫలితంగా సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ బిర్యానీ వంటకం రూపొందిందని చెబుతుంటారు. మరో కథనం ప్రకారం..1398లో టర్క్-మంగోల్ విజేత తైమూర్ భారత సరిహద్దులను చేరుకున్నప్పుడు అతని సైన్యం కోసం ఈ బిర్యానీని వినియోగించారిని చెబుతారు. సైనికులు కోసం బియ్యం, సుగంధద్రవ్యాలు, మాంసంతో నిండిన కుండను వేడి గొయ్యిలో పాతి పెట్టేవారట. కొంత సమయం తర్వాత తీసి చూడగా బిర్యానీ తయారయ్యి ఉండేదట. ఇది యోధులకు మంచి పోషకాహార భోజనంగా ఉండేదట. ఎక్కువ సేపు ఆకలిని తట్టుకుని ఉండేవారట. ఇక పర్షియన్ పదంలో బిరియన్ అనే పదానికి అర్థం కాల్చడం. బిరింజ్ అంటే అన్నం. పూర్వకాలంలో చాలమంది గొప్ప పండితులు పర్షియా దేశం నుంచి భారతదేశానికి రావడం వల్లే ఈ ప్రత్యేకమైన వంటకం మనకు పరిచయమయ్యిందని చెబుతారు. అయితే మన దేశంలో మాత్రం ఈ బిర్యానీ మాంసం, బియ్యం సుగంధ ద్రవ్యాలతో కూడిన బిర్యానీని మాన్సోదన్ అని పిలుస్తారు. ప్రస్తుతం భారతదేశం అంతటా అనేక రూపాల్లో బిర్యానీ లభిస్తుంది. మన హైదరాబాద్ బిర్యానీ ఉత్తర, దక్షిణ అంశాలను టర్కిష్ ప్రభావాన్ని మిళితం చేస్తుంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, లక్నోలలో బాస్మతీ వంటి పొడవైన బియ్యంతో తయారు చేయగా, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీరగ సాంబ లేదా కైమా బియ్యం వంటి పొట్టి ధాన్యాలతో తయారు చేస్తారు. ప్రతి బిర్యానీ సుగంధ్ర ద్రవ్యాలు, మాంసంతో ఆయా ప్రాంతాలకు అనుగుణమైన శైలిలో రూపొందుతుంది. ఈ బిర్యానీ వంటకం ఎలా ఏర్పడిందన్నది తెలియకపోయిన మన రోజూవారీ ఆహారంలో అందర్భాగం అయ్యింది. ముఖ్యంగా ఇలాంటి ఈద్ సమయంలో ప్రతి ముస్లిం ఇంట ఘుమఘమలాడే మటన్ బిర్యానీ ఉండాల్సిందే. (చదవండి: Eid Al-Adha 2024: మౌలిక విధులు..)
![T20 WC: Saurabh Netravalkar Wife Devi Snigdha Muppala: Who Is She High Achiever](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/sn2.jpg.webp?itok=2NGBExCN)
సౌరభ్ నేత్రావల్కర్ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి.. బ్యాగ్రౌండ్?
టీ20 ప్రపంచకప్-2024లో ఆతిథ్య జట్టు అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లలో సౌరభ్ నేత్రావల్కర్ ఒకడు. ముంబైలో పుట్టిపెరిగిన ఈ పేస్ బౌలర్.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు.ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సౌరభ్.. గత కొన్నేళ్లుగా అమెరికా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన ఈ ముంబైకర్.. ఈ ఐసీసీ టోర్నీలో దుమ్ములేపుతున్నాడు.లీగ్ దశలో కెనడా, పాకిస్తాన్పై విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన సౌరభ్.. టీమిండియాతో మ్యాచ్లో తనదైన ముద్ర వేశాడు. ఈ మ్యాచ్లో అమెరికా ఓడినా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి వరల్డ్క్లాస్ బ్యాటర్ల వికెట్లు తీసి ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.ఇంతకీ ఎవరీమె?ఈ నేపథ్యంలో సౌరభ్ నేత్రావల్కర్ కెరీర్తో పాటు అతడి వ్యక్తిగత జీవితం గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్ నేత్రావల్కర్ భార్య తెలుగు మూలాలున్న అమ్మాయి కావడం విశేషం.ఒకే హోదాలో దంపతులుసౌరభ్ నేత్రావల్కర్ భార్య పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. సౌరభ్ మాదిరే ఆమె కూడా కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.భర్తతో కలిసి ఒరాకిల్ సంస్థలో ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కెరీర్ పరంగా ఒకే హోదాలో పనిచేస్తున్న సౌరభ్- స్నిగ్ధలు తమకు ఇష్టమైన భిన్న రంగాల్లో రాణిస్తున్నారు.కథక్ డాన్సర్32 ఏళ్ల సౌరభ్కు క్రికెట్ ఇష్టమైతే.. స్నిగ్ధకు కథక్ నృత్యంపై మక్కువ. ప్రొఫెషనల్ కథక్ డాన్సర్ అయిన ఆమె.. దేవీ బాలీఎక్స్ డాన్స్ ఫిట్నెస్ ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్ అయ్యారు. అమెరికా వ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు స్నిగ్ధ.స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న అమ్మాయి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్తో 2020లో ఆమె వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో దక్షిణ భారత, మహరాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.అన్యోన్య దాంపత్యంప్రొఫెషనల్గా ఎంత బిజీగా ఉన్నా.. సౌరభ్- స్నిగ్ధ ఒకరి కోసం సమయం కేటాయించుకుంటారు. సౌరభ్ క్రికెట్ మ్యాచ్లు వీక్షించేందుకు స్నిగ్ధ స్వయంగా స్టేడియానికి వచ్చి.. భర్తను చీర్ చేస్తారు.అదే విధంగా.. సౌరభ్ సైతం భార్య అభిరుచులకు అనుగుణంగా ఆమె నిర్వహిస్తున్న డాన్స్- ఫిట్నెస్ బ్లెండ్ ప్రోగ్రామ్స్కి మద్దతుగా నిలుస్తున్నాడు. అలా ఒకరికి ఒకరు తోడుగా ముందుకు సాగుతున్న స్నిగ్ధ- సౌరభ్ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు.చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్గ్రౌండ్!
తప్పక చదవండి
- స్టార్ హీరోయిన్ కోసం చెరువులో దూకిన అభిమాని.. ఆ తర్వాత!
- అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్ను గమనించారా?
- తల్లి కాటికి.. తండ్రి కటకటాలకు...!
- ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
- ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
- సిక్ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
- ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!
- T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
సినిమా
![Kiccha Sudeep Comments On Actor Darshan's Arrest](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Kiccha-Sudeep.jpg1_.jpg.webp?itok=FDGlwwog)
హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ కావడం ఈ మధ్య కలకలం రేపింది. స్వయంగా అభిమానిని చంపాడనే ఆరోపణలతో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు ఇంకా కోర్టులోనే ఉంది. అలానే బయటకొస్తున్న ఒక్కో విషయం అందరికీ వరస షాకులు ఇస్తోంది. అయితే దర్శన్ అరెస్ట్ వల్ల కన్నడ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రముఖ కన్నడ హీరో సుదీప్.. దీంతో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'మీడియాలో ఏం చూపిస్తున్నారో మాకు కూడా అంతే తెలుసు. ఎందుకంటే మేం నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి అడగలేం కదా! నిజాన్ని బయటపెట్టేందుకు పోలీసులు, మీడియా చాలానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సందేహం లేదు. హత్యకు గురైన రేణుకా స్వామి కుటుంబానికి, అతడికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి'(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)'అయితే దర్శన్ అరెస్ట్ అవడంతో నింద అంతా సినిమా ఇండస్ట్రీపై వేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి న్యాయం జరగాలి.. కన్నడ చిత్రపరిశ్రమలో ఎందరో నటులున్నారు. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో సంబంధించనది కాదు. నిందితుడికి శిక్ష పడితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది' అని సుదీప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఈ నెల 8న రేణుకా స్వామి అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఇతడిని ఎవరు చంపారనే కోణంలో ఆరా తీయగా.. హీరో దర్శన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తనతో రిలేషన్లో ఉన్న పవిత్ర గౌడని రేణుకాస్వామి ఇబ్బంది పెట్టడంతోనే దర్శన్ కోపం పెంచుకుని రేణుకా స్వామిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు దర్శన్ సహా 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.(ఇదీ చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
![Vignesh Shivan Shares Father's Day Post](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/bahubali.jpg.webp?itok=Om_Yd9sF)
బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫాదర్స్ డే (జూన్ 16) రోజు అందరూ తమ తండ్రి గొప్పదనాన్ని, మంచితనాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే పై ఫోటోలో కుమారుడిని పైకెత్తి పట్టుకున్న వ్యక్తి మాత్రం.. పిల్లలు వచ్చాకే తన జీవితం సంతృప్తికరంగా మారిందంటున్నాడు. ఇంతకీ ఇలా చిన్నారులను బాహుబలిలా ఎత్తుకుంది ఎవరో కాదు. దర్శకుడు విఘ్నేశ్ శివన్. ఫాదర్స్ డేను నయనతార, విఘ్నేష్శివన్ తమ కవల పిల్లలతో చాలా జాలీగా గడిపారు. ఈ సందర్భంగా నయనతార తన భర్త విఘ్నేష్శివన్, పిల్లలు ఉయిర్, ఉలగంలతో సరదాగా గడిపిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. విఘ్నేష్ శివన్ నీటిలో మునిగి తన పిల్లలను చేతిలో పైకెత్తి పట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన జీవితంలో సంతోషానికి కారణం ఉయిర్, ఉలగం అని, వారిని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara)చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
![Upcoming OTT Release Movies Telugu June 3rd Week 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/OTT-Movies.jpg.webp?itok=N-ls-H8Z)
ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!
డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా థియేటర్లలోకి వచ్చే వారమే రానుంది. దీంతో ఈ వారం థియేటర్లలోకి చెప్పుకోదగ్గ మూవీస్ అయితే రిలీజ్ కావడం లేదు. నింద, హనీమూన్ ఎక్స్ప్రెస్, ఓ మంచి ఘోస్ట్, సీతా కల్యాణ వైభోగమే, ప్రభుత్వ జూనియర్ కళాశాల లాంటి చిన్న చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ మూవీ)ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. ఓవరాల్గా 20 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో బాక్, నడికల్ తిలకం, మహారాజ్ చిత్రాలతో పాటు హౌస్ ఆఫ్ డ్రాగన్ రెండో సీజన్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇవి కాకుండా ఏవైనా తెలుగు స్ట్రెయిట్ మూవీస్ సడన్గా ఓటీటీలో రిలీజ్ కావొచ్చు. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏయే మూవీస్ రాబోతున్నాయి? వాటి లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ లిస్ట్ (జూన్ 17 - 23 వరకు)నెట్ఫ్లిక్స్ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ సిరీస్) - జూన్ 18ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూషన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 18క్లెక్స్ అకాడమీ (పోలిష్ మూవీ) - జూన్ 19లవ్ ఈజ్ బ్లైండ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ సిరీస్) - జూన్ 19మహారాజ్ (హిందీ చిత్రం) - జూన్ 19అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 20కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూన్ 20గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ సిరీస్) - జూన్ 21నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 21ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) - జూన్ 21ట్రిగ్గర్ వార్నింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 21రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) - జూన్ 22హాట్స్టార్బాక్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 21బ్యాడ్ కాప్ (హిందీ సిరీస్) - జూన్ 21ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 21ఆహాసీరగన్ (తమిళ సినిమా) - జూన్ 18అమెజాన్ మినీ టీవీఇండస్ట్రీ (హిందీ సిరీస్) - జూన్ 19జియో సినిమాహౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 17బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) - జూన్ 21బుక్ మై షోలాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ మూవీ) - జూన్ 21(ఇదీ చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
![Arjun Sarja Respond On Daughter Aishwarya Umapathy Wedding](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/arjun-aishwarya.jpg.webp?itok=4D-rvtIX)
కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా చేశాడు. ప్రస్తుతం మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు. రీసెంట్గా ఇతడి కూతురు ఐశ్వర్య పెళ్లి జరిగింది. తమిళ నటుడు తంబిరామయ్య కొడుకు, నటుడు ఉమాపతి రామయ్యతో వివాహం జరిగింది. అయితే వీళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కారు. సంగీత్, పెళ్లి, రిసెప్షన్ పూర్తయిన తర్వాత వీళ్లంతా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ మూవీ 'లవ్ మీ')'తంబిరామయ్యది మంచి సంప్రదాయ కుటుంబం. ఆ మధ్య ఓ టీవీ షోకి హోస్టింగ్ చేశారు. అందులో ఉమాపతి రామయ్య ఓ కంటెస్టెంట్గా పోటీ చేశాడు. అప్పుడే తన నాకు నచ్చేశాడు. ఓ రోజు నా కూతురు ఐశ్వర్య నాతో విడిగా మాట్లాడాలని అడిగింది. దీంతో అది ప్రేమ వ్యవహారం అని ఊహించా. ఉమాపతి రామయ్య పేరు చెప్పడంతో నేను షాకయ్యా. ఆ తర్వాత ఉమాపతి రామయ్య ఫ్యామిలీతో నేను కట్టించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మాట్లాడుకున్నాం. అలా ఐశ్వర్య, ఉమాపతి పెళ్లి జరిగిపోయింది' అని అర్జున్ చెప్పుకొచ్చారు.పెళ్లయిన తర్వాత ఐశ్వర్య సినిమాల్లో నటిస్తారా అని అడుగుతున్నారనే ప్రశ్నకు బదులిచ్చిన అర్జున్.. తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్న ఆమెకు.. పెళ్లి తర్వాత నటించాలా వద్దా అనే విషయం కూడా తెలుసని అర్జున్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: దానికి నేను సరైన వ్యక్తి కాదు.. వాళ్లయితేనే: శ్రుతి హాసన్)
ఫొటోలు
![Seerat Kapoor Shines Like A Queen In Red Saree](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Seerat-Kapoor.jpg.webp?itok=M22N3H5A)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Seerat-Kapoor.jpg.webp?itok=M22N3H5A)
Seerat Kapoor: ఎర్ర చీరలో రాణిలా వెలిగిపోతున్న హీరోయిన్ (ఫోటోలు)
![Kanchanjunga Express collided with a goods train photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Kanchanjungha%20Express%20collided%20with%20a%20goods%20train%20photos-%20%281%29.jpg.webp?itok=OO3u92SB)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Kanchanjungha%20Express%20collided%20with%20a%20goods%20train%20photos-%20%281%29.jpg.webp?itok=OO3u92SB)
బెంగాల్ రైలు ప్రమాద దుర్ఘటన (ఫొటోలు)
![Actress Alia Bhatt Launches Dream Project For Kids](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Alia-Bhatt-New-Book-Launch.jpg.webp?itok=qEL5_JYV)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Alia-Bhatt-New-Book-Launch.jpg.webp?itok=qEL5_JYV)
పిల్లల కోసం నటి ఆలియా భట్ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్ (ఫొటోలు)
![Shraddha Das Looks Beautiful In Purple Outfit](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Shraddha-Das.jpg.webp?itok=Z8omqkVa)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Shraddha-Das.jpg.webp?itok=Z8omqkVa)
వామ్మో.. శ్రద్ధా ఇంత అందంగా ఉందేంటి? ఇలా అయితే కష్టమే! (ఫొటోలు)
!['The Desire To Know Your Own Soul...': Aishwarya Rajesh Latest Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Aishwarya-Rajesh-Latest-Photos.jpg.webp?itok=K551ljPQ)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Aishwarya-Rajesh-Latest-Photos.jpg.webp?itok=K551ljPQ)
ఐశ్వర్యా రాజేశ్ మత్తెక్కించే పోజులు.. రోజురోజుకీ అందంగా! (ఫొటోలు)
క్రీడలు
![Paul Coughlin pulls off one of the most outrageous catch of all time](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Paul-Coughlin-pulls.jpg.webp?itok=YubjvVXe)
కళ్లు చెదిరే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు చూసిండరు! వీడియో
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్లో సంచలన క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 16) చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా డర్హామ్, లంకాషైర్ జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో డర్హామ్ ఆల్రౌండర్ పాల్ కొగ్లిన్ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. లంకాషైర్ బ్యాటర్ మాథ్యూ హర్ట్స్ను సంచలన క్యాచ్తో కొగ్లిన్ పెవిలియన్కు పంపాడు. లంకాషైర్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన పాల్ కొగ్లిన్ యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు. కానీ కొగ్లిన్ ప్లాన్ను ముందుగానే గమనించిన మాథ్యూ హర్ట్స్ ఫ్రంట్పుట్కు వచ్చి స్టైట్గా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో పాల్ కొగ్లిన్ రిటర్న్లో సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. బంతి తన తలకు తాకుతుందని భావించిన పాల్ కొగ్లిన్.. ఎవరూ ఊహించని విధంగా మెరుపు వేగంతో క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ అలా కాసేపు క్రీజులోనే ఉండిపోయాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు సైతం బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దశాబ్దంలోనే అత్యుత్తమ క్యాచ్గా అభివర్ణిస్తున్నారు. What a ludicrous catch.pic.twitter.com/ucPjKpeH0Z— The Cricketer (@TheCricketerMag) June 16, 2024
![If I Have To Leave Captaincy: Babar Azam After Pakistan Poor T20 WC Exit Defends](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/pak_1.jpg.webp?itok=ajcQ9UCy)
కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన
‘‘నేను ఎప్పుడైతే నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని భావించానో అప్పుడే(2023) కెప్టెన్సీ వదిలేశాను. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాను కూడా!ఆ తర్వాత మళ్లీ బోర్డు నాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం. ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిన తర్వాత.. ఏం జరిగిందన్న అంశం గురించి చర్చిస్తాం.ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటాం. ఒకవేళ నేను కెప్టెన్సీ వదిలేయాల్సి వస్తే.. కచ్చితంగా అందరి ముందు నేనే ప్రకటిస్తా. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదు.ఏం జరిగినా అంతా ఓపెన్గానే ఉంటుంది. అయితే, నేనిప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఈ విషయంలో పీసీబీదే తుది నిర్ణయం’’ అని పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం స్పష్టం చేశాడు.వన్డే వరల్డ్కప్-2023లో వైఫల్యం తర్వాతపాక్ బోర్డు ఆదేశాల మేరకే సారథిగా కొనసాగాలా లేదా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ ఘోరంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే.గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.అయితే, అతడిని పీసీబీ ఎక్కువకాలం కొనసాగించలేదు. బోర్డు యాజమాన్యం మారిన తర్వాత మళ్లీ బాబర్ ఆజంనే వన్డే, టీ20 కెప్టెన్గా నియమించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024లో బాబర్ సారథ్యంలో పాకిస్తాన్ ఘోర పరాభవం పాలైంది.గ్రూప్-ఏలో ఉన్న పాక్.. తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా.. తాజాగా ఐర్లాండ్పై గెలుపొందినా అప్పటికే సూపర్-8 నుంచి నిష్క్రమించింది. పాక్ కంటే మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా టీమిండియాతో పాటు తదుపరి దశకు అర్హత సాధించింది.అందరి ప్లేస్లో నేను ఆడలేను కదా!ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని వెంటనే రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం స్పందిస్తూ.. ‘‘కేవలం ఒక వ్యక్తి వల్ల మేము ఓడిపోలేదు. జట్టుగా గెలిచాం.. జట్టుగానే ఓడిపోయాం. చాలా మంది కెప్టెన్ వైపు వేలు చూపిస్తున్నారు. కానీ ప్రతి ఆటగాడి స్థానంలో నేను వెళ్లి ఆడలేను కదా! జట్టులోని 11 మంది ఆటగాళ్లకు తమదైన పాత్ర ఉంటుంది. జట్టుగా మేము విఫలమయ్యాం. ఈ విషయాన్ని ముము అంగీకరించక తప్పదు. వైఫల్యానికి ఎవరో ఒకరిని బాధ్యులుగా చూపే పరిస్థితి లేదు’’ అని పేర్కొన్నాడు. తనను విమర్శిస్తున్న వాళ్లకు ఈ మేరకు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు బాబర్ ఆజం.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ కెప్టెన్.. ధోని వరల్డ్ రికార్డు బద్దలు View this post on Instagram A post shared by ICC (@icc)
![Wout Weghorst Grabs Netherlands Opening Euro 2024 Win Over Poland](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Netherlands-1.jpg.webp?itok=VjO_hlf3)
వెఘొర్స్ 'సూపర్ గోల్'.. నెదర్లాండ్స్ సంచలన విజయం
యూరో కప్-2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం హాంబర్గ్ వేదికగా పోలాండ్తో జరిగిన మ్యాచ్లో 2-1తో నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ గేమ్లో ఆఖరికి విజయం డచ్ జట్టునే వరించింది.తొలుత ఫస్ట్హాఫ్ 16వ నిమిషంలో ఆడమ్ బుకస పోలండ్కు మొదటి గోల్ను అందించాడు. అనంతరం 29వ నిమిషంలో నెదర్లాండ్స్ ఫార్వర్డ్ కోడి గక్పో అద్బుతమైన గోల్ కొట్టి స్కోర్ను 1-1తో సమం చేశాడు.ఫస్ట్హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో బ్రేక్ సమయంలో పొలాండ్ మేనెజర్ మిచాల్ ప్రోబియర్జ్ తమ జట్టులో ఒక మార్పు చేశాడు. జాకుబ్ మోడర్కు బదలుగా ఇంపాక్ట్ సబ్గా స్జిమాన్స్కీ జాకుబ్ తీసుకువచ్చాడు.కానీ ఎటువంటి ఫలితం లేదు. దీంతో ప్రోబియర్జ్ మళ్లీ 10 నిమిషాల తర్వాత మరో రెండు మార్పులు చేశాడు. కానీ ఫలితం ఏ మాత్రం మారలేదు. ఇక సెకెండ్ హాఫ్ ముగిసే సమయం దగ్గరపడుతుండడంతో 1-1 డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు.వౌట్ వెఘొర్స్ అద్బుతం..ఈ క్రమంలో డచ్ మేనేజర్ రోనాల్డ్ కోమాన్ తీసుకున్న ఓ నిర్ణయం అందరి అంచనాలను తారుమారు చేసింది. ఆఖరి బ్రేక్ సమయంలో రోనాల్డ్ కోమాన్.. మెంఫిస్ డిపే స్థానంలో వౌట్ వెఘోర్స్ట్ని ఇంపాక్ట్ సబ్స్ట్యూట్గా తీసుకువచ్చాడు.మైదానంలో అడుగపెట్టిన వెఘొర్స్.. ఆట మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా 83వ నిమిషంలో గోల్కొట్టి డచ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో నెదర్లాండ్స్ జట్టు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోగా.. పొలాండ్ నిరాశలో కూరుకు పోయింది.చదవండి: ఆర్చరీలో భారత్కు ఒలింపిక్ బెర్త్
![T20 WC: Saurabh Netravalkar Wife Devi Snigdha Muppala: Who Is She High Achiever](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/sn2.jpg.webp?itok=2NGBExCN)
సౌరభ్ నేత్రావల్కర్ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి.. బ్యాగ్రౌండ్?
టీ20 ప్రపంచకప్-2024లో ఆతిథ్య జట్టు అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లలో సౌరభ్ నేత్రావల్కర్ ఒకడు. ముంబైలో పుట్టిపెరిగిన ఈ పేస్ బౌలర్.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు.ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సౌరభ్.. గత కొన్నేళ్లుగా అమెరికా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన ఈ ముంబైకర్.. ఈ ఐసీసీ టోర్నీలో దుమ్ములేపుతున్నాడు.లీగ్ దశలో కెనడా, పాకిస్తాన్పై విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన సౌరభ్.. టీమిండియాతో మ్యాచ్లో తనదైన ముద్ర వేశాడు. ఈ మ్యాచ్లో అమెరికా ఓడినా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి వరల్డ్క్లాస్ బ్యాటర్ల వికెట్లు తీసి ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.ఇంతకీ ఎవరీమె?ఈ నేపథ్యంలో సౌరభ్ నేత్రావల్కర్ కెరీర్తో పాటు అతడి వ్యక్తిగత జీవితం గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్ నేత్రావల్కర్ భార్య తెలుగు మూలాలున్న అమ్మాయి కావడం విశేషం.ఒకే హోదాలో దంపతులుసౌరభ్ నేత్రావల్కర్ భార్య పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. సౌరభ్ మాదిరే ఆమె కూడా కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.భర్తతో కలిసి ఒరాకిల్ సంస్థలో ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కెరీర్ పరంగా ఒకే హోదాలో పనిచేస్తున్న సౌరభ్- స్నిగ్ధలు తమకు ఇష్టమైన భిన్న రంగాల్లో రాణిస్తున్నారు.కథక్ డాన్సర్32 ఏళ్ల సౌరభ్కు క్రికెట్ ఇష్టమైతే.. స్నిగ్ధకు కథక్ నృత్యంపై మక్కువ. ప్రొఫెషనల్ కథక్ డాన్సర్ అయిన ఆమె.. దేవీ బాలీఎక్స్ డాన్స్ ఫిట్నెస్ ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్ అయ్యారు. అమెరికా వ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు స్నిగ్ధ.స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న అమ్మాయి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్తో 2020లో ఆమె వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో దక్షిణ భారత, మహరాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.అన్యోన్య దాంపత్యంప్రొఫెషనల్గా ఎంత బిజీగా ఉన్నా.. సౌరభ్- స్నిగ్ధ ఒకరి కోసం సమయం కేటాయించుకుంటారు. సౌరభ్ క్రికెట్ మ్యాచ్లు వీక్షించేందుకు స్నిగ్ధ స్వయంగా స్టేడియానికి వచ్చి.. భర్తను చీర్ చేస్తారు.అదే విధంగా.. సౌరభ్ సైతం భార్య అభిరుచులకు అనుగుణంగా ఆమె నిర్వహిస్తున్న డాన్స్- ఫిట్నెస్ బ్లెండ్ ప్రోగ్రామ్స్కి మద్దతుగా నిలుస్తున్నాడు. అలా ఒకరికి ఒకరు తోడుగా ముందుకు సాగుతున్న స్నిగ్ధ- సౌరభ్ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు.చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్గ్రౌండ్!
బిజినెస్
![Domestic air passenger traffic rises 4. 4percent to 1. 37 cr in May says DGCA](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/AIRPORT-PASSENGERS.jpg.webp?itok=UkzWysOM)
దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
ముంబై: విమానయాన సేవలకు ఆదరణ కొనసాగుతోంది. మే నెలలో దేశీ విమాన ప్రయాణికుల్లో 4.4 శాతం వృద్ధి కనిపించింది. మొత్తం 1.37 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది మే నెలలో ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా ఉంది. ఇక ఈ ఏడాది మే వరకు మొదటి ఐదు నెలల్లో 6.61 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే ఐదు నెలలో విమాన ప్రయాణికుల రద్దీ 6.36 కోట్లుగా ఉన్నట్టు (3.99 శాతం వృద్ధికి సమానం) పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. సకాలంలో విమాన సేవలను నిర్వహించడంలో ఆకాశ ఎయిర్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం మీద 85.9 శాతం మేర సకాలంలో సేవలు అందించింది. ఆ తర్వాత 81.9 శాతంతో విస్తారా, 74.9 శాతంతో ఏఐఎక్స్ కనెక్ట్ (ఎయిరేíÙయా), 72.8 శాతంతో ఇండిగో, 68.4 శాతంతో ఎయిర్ ఇండియా, 60.7 శాతంతో స్పైస్జెట్ వరుస స్థానాలో ఉన్నాయి. దేశీ మార్గాల్లో ఇండిగో మార్కెట్ వాటా 61.6 శాతానికి చేరింది. ఎయిర్ ఇండియా వాటా క్రితం నెలలో ఉన్న 14.2 శాతం నుంచి 13.7 శాతానికి క్షీణించింది. విస్తారా మార్కెట్ వాటా 9.2 శాతంగా ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ వాటా 5.4 శాతం నుంచి 5.1 శాతానికి పరిమితమైంది. ఎయిర్ ఇండియా, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్ టాటా గ్రూపు సంస్థలే. ఆకాశ ఎయిర్ వాటా 4.4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. స్పైస్జెట్ మార్కెట్ వాటా 4.7 శాతం నుంచి 4 శాతానికి క్షీణించింది.
![Global trends, foreign investors move to drive markets in holiday-shortened week](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/GLOBAL-TRENDS.jpg.webp?itok=w3qUNS30)
ప్రపంచ పరిణామాలు కీలకం
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారం మార్కెట్లో స్థిరీకరణ (కన్సాలిడేషన్) అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు స్థూల ఆరి్థక గణాంకాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వచ్చే వారం రోజుల్లో 3 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇందులో డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్, ఆమ్కే ఫిన్ ట్రేడ్ పబ్లిక్ ఇష్యూలు జూలై 19న, స్టాన్లీ లైఫ్స్టైల్స్ ఐపీఓ జూలై 20న ప్రారంభం కానున్నాయి. బక్రీద్ సందర్భంగా నేడు (సోమవారం) ఎక్సే్చంజీలకు సెలవు. ‘‘వివిధ మంత్రిత్వ శాఖలు ప్రకటిస్తున్న ‘అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళిక’లను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటే సాంకేతికంగా నిఫ్టీకి 22,800–23,100 శ్రేణిలో కీలక మద్దతు లభించే వీలుంది. కొనుగోళ్లు జరిగి 23,600 స్థాయిని చేధించగలిగే 24,000 మైలురాయిని అందుకోవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం మూలధన వ్యయాలకు ప్రాధాన్యత కొనసాగిస్తుందనే ఆశలతో గతవారం అభివృద్ధి ఆధారిత రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 77,145 వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పంది. నిఫ్టీ 175 పాయింట్లు బలపడి 23,490 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. కాగా ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రపంచ పరిణామాలు బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, నార్వేల కేంద్ర బ్యాంకులు ఈ వారంలో ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెల్లడించనున్నాయి. దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపొచ్చనేది ఆరి్థకవేత్తల అంచనా. యూరోజోన్ మే ద్రవ్యోల్బణం డేటా మంగళవారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) బుధవారం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పరపతి సమావేశం గురువారం, అమెరికా జూన్ ప్రథమార్థపు సేవా, తయారీ రంగ గణాంకాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి.గతవారంలో రూ.11,730 కోట్ల పెట్టుబడులు ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఆచూతూచి వ్యవహరించిన విదేశీ ఇన్వెస్టర్లు తరువాత దేశీయ మార్కెట్లోకి బలమైన పునరాగమనం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం, రానున్న బడ్జెట్లో ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయనే ఆశలతో భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. గత వారం (జులై 14తో ముగిసిన వారం)లో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల్లో రూ.11,730 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో నికర అమ్మకాలు (జూన్ 1– 14 వరకు) రూ.3,064 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఈ నెలలో (జూన్ 14 వరకు) ఎఫ్పీఐలు డెట్ మార్కెట్ లో రూ.5,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ‘‘దేశంలో సంకీర్ణ కూటమి ఉన్నప్పటికీ, వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం విధాన సంస్కరణలు, ఆరి్థక వృద్ధి కొనసాగింపుపై అంచనాలను పెంచింది’’ అని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇక మేలో ఎఫ్పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు.
![CII calls for income tax relief for those in lowest slab](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/SANJIV-PURI.jpg.webp?itok=7_K44EjL)
కనిష్ట శ్లాబు వారికి ఐటీ ఊరట కల్పించాలి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ స్థాయి శ్లాబ్లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పంచే అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐకి కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికైన సంజీవ్ పురి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భూ, కారి్మక, విద్యుత్, వ్యవసాయ రంగ సంస్కరణలన్నింటిని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంస్థాగత వేదికను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడో దఫా ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయడానికి సంకీర్ణ రాజకీయాలనేవి అడ్డంకులు కాబోవని భావిస్తున్నట్లు పురి చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో విధానాలను విజయవంతంగా అమలు చేయడం, దేశ ఎకానమీ మెరుగ్గా రాణిస్తుండటం వంటి అంశాలు తదుపరి సంస్కరణలను వేగవంతం చేసేందుకు దన్నుగా ఉండగలవని ఆయన పేర్కొన్నారు.
![Health Insurance Claim from Multiple Policies](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/BU-HEALTH-INSURANCE-1470664.jpg.webp?itok=qqID4IB3)
ఒకరికి రెండు పాలసీలు.. క్లెయిమ్ ఎలా?
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా మంది రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.గతంలో వేరు.. ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన లోగడ ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా? రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచి్చనప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదు. ఉదాహరణకు రూ.5 లక్షల చొప్పున రెండు ప్లాన్లు ఉన్నాయని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు రూ.7 లక్షలు వచి్చంది. అప్పుడు తొలుత ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాలి. అక్కడి నుంచి వచి్చన చెల్లింపులు మినహాయించి, అప్పుడు మిగిలిన మొత్తానికి రెండో బీమా సంస్థ నుంచి పరిహారం కోరాలి. ఒక పాలసీలో రూమ్రెంట్ పరంగా పరిమితులు ఉండి, దానివల్ల క్లెయిమ్ పూర్తిగా రాని సందర్భాల్లోనూ.. మిగిలిన మొత్తాన్ని రూమ్రెంట్ పరిమితులు లేని మరో పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కొన్ని పాలసీల్లో రూమ్ రెంట్, కొన్ని చికిత్సలకు పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్ హెల్త్ ప్లాన్లలో ఇవి చూడొచ్చు. అలాంటప్పుడు రూ.5 లక్షల కవరేజీ ఉన్నప్పటికీ పూర్తి మొత్తం రాకపోవచ్చు. ఉదాహరణకు రూ.7లక్షల ఆస్పత్రి బిల్లుకు సంబంధించి రూ. 5 లక్షల గ్రూప్ పాలసీలో రూ.4 లక్షలే క్లెయిమ్ కింద వచి్చందని అనుకుంటే.. అప్పుడు మిగిలిన రూ. 3 లక్షలను రెండో పాలసీ కింద రీయింబర్స్మెంట్ కోరవచ్చు. ఒక బీమా సంస్థ క్లెయిమ్ దరఖాస్తును తిరస్కరించినా, రెండో బీమా సంస్థను సంప్రదించవచ్చు. వేతన జీవులు పనిచేసే సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ ప్లాన్, వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా ఇండివిడ్యు వల్ ప్లాన్ కలిగి ఉన్నప్పుడు.. మొదట గ్రూప్ హెల్త్ ప్లాన్ నుంచి క్లెయిమ్కు వెళ్లడం మంచి ఆప్షన్. గ్రూప్ హెల్త్ ప్లాన్లో క్లెయిమ్ సెటిల్మెంట్ సులభంగా ఉంటుంది. క్లెయిమ్ మొత్తం ఒక బీమా పాలసీ కవరేజీ పరిధిలోనే ఉంటే ఒక్క సంస్థ వద్దే క్లెయిమ్కు పరిమితం కావాలి. దీనివల్ల రెండో ప్లాన్లో నో క్లెయిమ్ బోనస్ నష్టపోకుండా చూసుకోవచ్చు.నగదు రహిత చికిత్సబీమా సంస్థ నెట్వర్క్ పరిధిలోని అన్ని ఆస్పత్రుల నుంచి నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత చికిత్సకు బీమా సంస్థలు నేడు అవకాశం కలి్పస్తున్నాయి. కాకపోతే ఆస్పత్రి నిషేధిత జాబితాలో లేని వాటికే ఈ సదుపాయం పరిమితమని గుర్తుంచుకోవాలి. రెండు ప్లాన్లలోనూ నగదు రహిత చికిత్సకు వెళ్లొచ్చు. కానీ, ఒక సంస్థ నుంచే నగదు రహిత క్లెయిమ్కు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మిగిలిన మొత్తం కోసం రీయింబర్స్మెంట్ విధానానికి వెళ్లాలని సూచిస్తుంటాయి. అలాంటప్పుడు నగదు రహిత విధానంలో గరిష్ట పరిమితి మేరకే ఒక బీమా సంస్థ నుంచి చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని సొంతంగా చెల్లించి, దాన్ని రాబట్టుకునేందుకు రెండో బీమా సంస్థను సంప్రదించాలి. దీనికోసం మొదట క్లెయిమ్ చేసిన బీమా సంస్థ నుంచి ‘క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ’ తీసుకోవాలి. అలాగే, హాస్పిటల్ బిల్లులు, చికిత్సకు సంబంధించి అన్ని పత్రాల ఫొటో కాపీలను సరి్టఫై (అటెస్టేషన్) చేసి ఇవ్వాలని మొదటి బీమా సంస్థను కోరాలి. వీటితో రెండో బీమా సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. రెండు బీమా సంస్థల వద్ద రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవాలన్నా సరే.. మొదట ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆస్పత్రి నుంచి అన్ని బిల్లుల కాపీలు, డిశ్చార్జ్ సమ్మరీ, ల్యాబ్ రిపోర్ట్లు తీసుకుని బీమా సంస్థకు సమర్పించాలి. క్లెయిమ్ ఆమోదం అనంతరం, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీతోపాటు, అన్ని డాక్యుమెంట్ల ఫొటో కాపీలతో రెండో సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలుకు కాలపరిమితి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15–30 రోజులు దాటకుండా క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. ఒకరికి ఎన్ని ప్లాన్లు? అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకు? అనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచి్చనా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కలి్పంచే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మరొక మార్గం.రీయింబర్స్మెంట్కు కావాల్సిన డాక్యుమెంట్లు డిశ్చార్జ్ సమ్మరీ, నగదు/కార్డు ద్వారా చెల్లింపులకు సంబంధించి రసీదులు, ల్యాబ్ రిపోర్ట్లు, వైద్యులు రాసిచి్చన ప్రిస్కిప్షన్లు, ఎక్స్రే ఫిల్మ్లు, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ.ఏడాదిలో ఎన్ని క్లెయిమ్లు? ఏడాదిలో ఎన్ని క్లెయిమ్లు అన్న దానితో సంబంధం లేకుండా, గరిష్ట బీమా కవరేజీ పరిధిలో ఎన్ని విడతలైనా పరిహారం పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు క్లెయిమ్ల సంఖ్య పరంగా పరిమితులు విధించొచ్చు. కనుక పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్ను తప్పకుండా చదివి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. రెండు రకాల పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ సాధారణంగా రెండు రకాలు. ఇండెమ్నిటీ ఒక రకం అయితే, ఫిక్స్డ్ బెనిఫిట్తో కూడినవి రెండో రకం. ఇండెమ్నిటీ పాలసీలు ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలతోపాటు.. ఎంపిక చేసిన డేకేర్ ప్రొసీజర్స్ (చికిత్స తర్వాత అదే రోజు విడుదలయ్యేవి)కు మాత్రమే కవరేజీ ఇస్తాయి. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను ఫిక్స్డ్ బెనిఫిట్ పాలసీలుగా చెబుతారు. ఇందులో కేన్సర్, గుండె జబ్బులు, మూత్ర పిండాల వైఫల్యం, కాలేయ వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏదైనా నిర్ధారణ అయిన వెంటనే నిర్ణీత పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఈ రెండింటి పరంగా గందరగోళం అక్కర్లేదు. ఇండెమ్నిటీ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ రెండూ కలిగిన వారు.. ఏదైనా తీవ్ర వ్యాధి (క్రిటికల్ ఇల్నెస్) బారిన పడినప్పుడు ఇండెమ్నిటీ ప్లాన్ కింద కవరేజీ పొందొచ్చు. అలాగే, వ్యాధి నిర్ధారణ పత్రాలతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కింద క్లెయిమ్ దాఖలు చేసి పూర్తి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. దీనివల్ల ఆయా వ్యాధులకు సంబంధించి ఎదురయ్యే భారీ వ్యయాలను తట్టుకోవడం సాధ్యపడుతుంది. టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు ఇక హెల్త్ ఇన్సూరెన్స్లో టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు కూడా ఉంటాయి. ఇందులో సూపర్ టాపప్ ఎక్కువ అనుకూలం. ఇవి డిడక్షన్ క్లాజుతో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న వారు, రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ కూడా జోడించుకున్నారని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు మొదటి రూ.5 లక్షలు దాటిన తర్వాతే సూపర్ టాపప్ ప్లాన్ కింద కవరేజీ పొందగలరు. రూ.50 లక్షల వరకు బిల్లు ఎంత వచ్చినా సరే.. మొదటి రూ.5 లక్షలకు సూపర్ టాపప్లో పరిహారం రాదు. దాన్ని సొంతంగా భరించడం లేదంటే బేస్ ప్లాన్ నుంచి కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా రూ.50 లక్షల బేస్ ఇండెమ్నిటీ ప్లాన్తో పోలి్చతే.. రూ.5–10 లక్షల మేర బేస్ ప్లాన్ తీసుకుని, 50 లక్షలకు సూపర్ టాపప్ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం కొంత తగ్గుతుంది.
వీడియోలు
![Kanchanjunga Express Train Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/35.png.webp?itok=VPC57gdt)
![Kanchanjunga Express Train Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/35.png.webp?itok=VPC57gdt)
రైలు ప్రమాదంలో 15కు చేరిన మృతుల సంఖ్య
![Vijayawada Dalit Leader Protest Against Bonda Uma Rowdyism](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/34.png.webp?itok=CgHzv7WS)
![Vijayawada Dalit Leader Protest Against Bonda Uma Rowdyism](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/34.png.webp?itok=CgHzv7WS)
బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ దళిత నేత శిరోముండనం..
![Nightlife In Vizag Beach](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/33.png.webp?itok=ArWEfvGk)
![Nightlife In Vizag Beach](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/33.png.webp?itok=ArWEfvGk)
రాత్రి వేళల్లోనూ విశాఖ బీచ్ ల్లో పర్యాటకుల సందడి
![Devotees Crowd At Tirumala](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/32.png.webp?itok=6XpcLXRF)
![Devotees Crowd At Tirumala](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/32.png.webp?itok=6XpcLXRF)
తిరుమలలో కొండంత రద్దీ
![Harish Rao Satires On CM Revanth Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/31.png.webp?itok=UobXipL4)
![Harish Rao Satires On CM Revanth Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/31.png.webp?itok=UobXipL4)
2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ?
![Ganja Gang Busted In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/30.png.webp?itok=lxOz3tza)
![Ganja Gang Busted In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/30.png.webp?itok=lxOz3tza)
మాదక ద్రవ్యాలపై తెలంగాణ పోలీసుల నిఘా
![Drugs Case On DJ Siddharth](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/29.png.webp?itok=xGgqVIG8)
![Drugs Case On DJ Siddharth](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/29.png.webp?itok=xGgqVIG8)
డ్రగ్స్ ఉచ్చులో డీజే సిద్ధార్థ్
![Police Speedup Investigation In Phone Tapping Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/28_0.png.webp?itok=RCLnS06l)
![Police Speedup Investigation In Phone Tapping Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/28_0.png.webp?itok=RCLnS06l)
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
![Anantapur Mayor Waseem Gets Invitation For BRICS Summit 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/27.png.webp?itok=rkBuS4nk)
![Anantapur Mayor Waseem Gets Invitation For BRICS Summit 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/27.png.webp?itok=rkBuS4nk)
వైఎస్ఆర్ సీపీ మేయర్ కు అరుదైన గౌరవం
![West Bengal CM Mamata Banerjee Tweet On Kanchanjunga Express Train Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/26.png.webp?itok=WzP-khUu)
![West Bengal CM Mamata Banerjee Tweet On Kanchanjunga Express Train Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/26.png.webp?itok=WzP-khUu)
రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ ట్వీట్
ఫ్యామిలీ
![Anant Ambani Radhika prewedding sculpted in Gold and love letter](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Radhika_gold-dress-story.jpg.webp?itok=VzedJRVx)
అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్ను గమనించారా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్మర్చంట్, శైలా విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలే ఇందుకు నిదర్శనం. అనంత్-రాధిక నిశ్చితార్థం వేడుక మొదలు ఇటీవల, ఇటలీలో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల దాకా ప్రతీదీ అత్యంత ఘనంగా నిర్వహించారు. లగ్జరీ క్రూయిజ్లో 800మందికి పైగా అతిథులతో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన విశేషాలు రోజుకొకటి నెట్టింట విశేషంగా మారు తున్నాయి. ముఖ్యంగా కాబోయే వధువు రాధిక మర్చంట్ దుస్తులు, నగలతో పాటు, అత్తగారి హోదాలో నీతా అంబానీ లుక్, ఖరీదైన నగలు చర్చనీయాంశంగా నిలిచాయి. తాజాగా సినీ నిర్మాత రియా కపూర్ రాధిక మర్చంట్ దుస్తులకు సంబంధించిన ప్రత్యేకతలను ఇన్స్టాలో షేర్ చేశారు. రాధిక ధరించిన గౌనుపై అనంత్ లవ్ లెటర్ను అందంగా పొందుపరచడం విశేషం. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) అలాగే బంగారు పూతతో తయారు చేసిన మరో అద్భుతమైన డ్రెస్ వివరాలను కూడా రియా అందించారు. అంబానీ రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా టోగా పార్టీలో రాధిక ధరించిన గ్రేస్ లింగ్ ‘కోచర్’ని గురించి పరిచయం చేశారు. రాధిక బాడీకి అతికినట్టు సరిపోయింది అంటూ దీన్ని తయారు చేసిన టీంకు అభినందనలు తెలిపారు. అత్యాధునిక 3డీ టెక్నాలజీతో 30 మంది కళాకారులు దీన్ని తయారు చేశారట.
![Experts Said Crying Is It Good For Your Body And Mind](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/cryes.jpg.webp?itok=T6GqR498)
ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ఏడుపు అనేది శరీరం ఎదుర్కొనే సహజ ప్రతిస్పందన. ఈ ఏడుపు వల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంట. దీని కారణంగా మనసు, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తనవితీరా ఏడ్చి బాధను కన్నీటి రూపంలో పోగొట్టుకుంటే..శరీరం, మనసు రెండు బాగుంటాయని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మనసుకు ఈ ఏడుపు స్వీయ ఉపశమనం అని అంటున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందామా..!భావోద్వేగాల కారణంగా శరీరంలో సహజ ప్రతిస్పందనగా ఏడుపు వస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా ఒత్తిడి హార్మోన్లలను విడుదల చేసి భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించడానికి ఈ ఏడుపు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు ఒక రకంగా ఈ ఏడుపు మనకు సానుభూతి చూపించేలా చేసి సామాజికి బంధాలను బలోపేతం చేసుకోవడంలో సహాయపడుతుంది.ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాలు..ఇది మనసుకు, శరీరానికి మంచి ఓదార్పునిస్తుంది. ఎందుకంటే..ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది కాబట్టి మనసుకు, దేహానికి తెలియని ఓదార్పుని, స్వాంతనను ఇస్తుంది. ఇది మనసుకు ఒక మంచి రిలీప్ని అందిస్తుంది. కన్నీళ్ల వల్ల ఎండార్ఫిన్ విడుదలవ్వుతాయి. ఇవి శరీరానికి సహజ నొప్పి నివారిణిలా ప్రశాంతతను చేకూరుస్తాయి.అంటే.. ఏడుపు ద్వారా విడుదలయ్యే ఎండార్ఫిన్లు శారీరక, మానసిక నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయిని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా నొప్పిని నియంత్రించి విశ్రాంతిని కలుగుచేయడమే గాక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఏడుపు మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరచడంలో ఉపకరిస్తుంది. మంచి నిద్రకు ఉపయోగపడుతుందని కూడా చెబుతున్నారు. అలా అని నిద్ర కోసం రోజువారీగా ఏడుపుని అలవాటు చేసుకోమని కాదు. బాగా ఏడ్చినప్పుడూ ఆందోళన తగ్గిపో ప్రశాంతంగా నిద్రపోతారని అంటున్నారు. దీనివల్ల మనసు తేలిక పడి భయాందోళనలు తగ్గుతాయి. ఫలితంగా నిద్రకు భంగం ఏర్పడదని నిపుణుల చెబుతున్నారు. ఏడుపు కళ్లను లూబ్రికేట్ చేస్తుంది. ఫలితంగా పొడిబారకుండా ఉండి కార్నియాను తేమగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు ఈ ఏడుపు ద్వారా వచ్చే కన్నీళ్లు, దుమ్ము, ఇతర శిథిలాలను క్లీన్ చేయడంలో సహాయపడుతుంది కూడా. పైగా అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పిల్లల్లో ఈ ఏడుపు ఊపిరి పీల్చుకోవడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారి శ్వాసనాళాలను శుభ్రపరిచి శ్వాస ద్వారా ఎక్కువ ఆక్సిజన్ని తీసుకునేలా చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఎంత మేర ఏడవాలి అంటే..దీనికి ఎలాంటి ప్రమాణం లేదు. ఆయా వ్యక్తుల భావోద్వేగ సామర్థ్యం, కారణాలు, తట్టుకునే పరిస్థితులపై ఆధారపడి ఈ ఏడుపు రావడం అనేది ఉంటుంది. ఒకరి నుంచి మరోకరికి ఈ ఏడుపు వచ్చే విధానం వేరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏదీఏమైన ఈ ఏడుపు అనేది సహజమైన ఆరోగ్యకర భావోద్వేగ ప్రతిస్పందన. ఇది భావోద్వేగాలు, ఒత్తిడిని విడుదల చేసేందుకు ఉపయోగపడే అద్భుతమైన సాధనం. కొందరూ తరుచుగా ఏడవడంలో ఉపశమనం పొందొచ్చు. మరికొందరూ తమ భావోద్వేగాలను భిన్నంగా వ్యక్తం చేయవచ్చు లేదా వ్యక్తీకరించొచ్చు.(చదవండి:
![Actress Alia Bhatt Launches Dream Project For Kids](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Alia-Bhatt-New-Book-Launch.jpg.webp?itok=qEL5_JYV)
పిల్లల కోసం నటి ఆలియా భట్ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్ (ఫొటోలు)
![FSSAI suspends licence of Fortune Dairy after human finger found in ice cream](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/icecream-humanfinger.jpg.webp?itok=psUiMHq3)
ఐస్క్రీమ్లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్ రద్దు
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్క్రీమ్లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పందించింది. వివాదానికి కారణమైన ఐస్క్రీమ్ తయారీదారు లైసెన్సును రద్దు చేసింది. దీనిపై దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) అధికారులు శుక్రవారం పుణేకు చెందిన ఐస్క్రీమ్ యూనిట్లను సందర్శించారు. నమూనాలను సేకరించారని అధికారులు తెలిపారు. అనంతరం ఫార్చ్యూన్ డెయిరీకి చెందిన యమ్మో కంపెనీ లైసెన్స్ను రద్దు చేసినట్టు పూణే రీజియన్ ఎఫ్డిఎ జాయింట్ కమిషనర్ సురేష్ అన్నపురే తెలిపారు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రాలేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఐస్క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్కు కక్కొచ్చినంత పనైంది!తన సోదరి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్క్రీమ్లో మనిషి వేలు కనిపించిందంటూ ముంబైలోని మలద్ ప్రాంతానికి చెందిన వైద్యుడు బ్రెండన్ ఫిర్రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం కోన్ ఐస్క్రీమ్ తింటుండగా గట్టిగా ఏదో తగిలింది. వెంటనే అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి చూడగా చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఇది చూసి షాకైన ఫిర్రావ్ ఇన్స్టాగ్రామ్లో కంపెనీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో మలద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆ ముక్కను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఫిర్రావ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ స్టోరీ నెట్టింట్ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే..
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయొచ్చు, ఎన్నికల్లో వీటిని ఉపయోగించొద్దు... స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పష్టీకరణ... ఈవీఎంలు బ్లాక్బాక్సుల్లాంటివేనన్న రాహుల్ గాంధీ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
మీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు, ‘విద్యుత్’ కమిషన్ నుంచి వైదొలగండి.. జస్టిస్ నరసింహారెడ్డికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేద్దాం... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులకు బిగుస్తున్న ఉచ్చు... ఏసీబీతో పాటు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం... 24 మందితో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు.. విద్యుత్ రంగ నిర్ణయాల్లో పాత్రపై జారీ చేసినట్లు జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధాని కార్యాలయం మోదీ పీఎంవో కాదు, అది ప్రజా పీఎంవో అని మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/688_1.jpg.webp?itok=4PnK1EZj)
ఎర్రగడ్డ ఆస్పత్రి పైనుంచి దూకి మానసిక రోగి ఆత్మహత్య
రహమత్నగర్: చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరబండ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి నాంపల్లి ఓంనగర్కు చెందిన నర్సింగరావు50) మానసిక వ్యాధితో బాధపడుతూ పదేళ్లుగా ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం తన కుమారుడు దీపక్తో కలిసి ఆస్పత్రికి వచ్చిన నర్సింగరావు వాష్ రూంకు వెళ్తున్నట్లు కుమారుడికి చెప్పి మొదటి అంతస్తు పై నుంచి కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బోరబండ పోలీసులు పేర్కొన్నారు.
![Assault on a woman volunteer](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/attack.jpg.webp?itok=4GcqdA5W)
మహిళా వలంటీర్పై దాడి
వేమూరు: గ్రామ వలంటీర్పై టీడీపీ కార్యకర్తలు మహిళలతో దాడి చేయించి కొట్టిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పమిడిపాగుల జ్యోతి అనే మహిళ గ్రామ వలంటీర్గా పని చేస్తోంది. వలంటీర్లపై కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్నికల ముందు ఆమె రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల్లో గెలిచాక టీడీపీ కార్యకర్తలు జ్యోతిని లక్ష్యంగా చేసుకుని వేధించటం మొదలుపెట్టారు. నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు. ‘మీ వైఎస్సార్సీపీ పార్టీ గెలవాలని ఓట్లు వేయించి తెగపాకులాడావుగా గొప్ప వాలంటీరు. ఇప్పుడు మాది రాజ్యం. నీ అంతు చూస్తాం. జై టీడీపీ, జై కూటమి’ అంటూ ఆ ఇంటి గోడపై పోస్టర్ అతికించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. మరుసటి రోజునుంచి స్కూల్కెళ్తున్న జ్యోతి పిల్లలను దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బజారు నుంచి ఇంటికెళ్తున్న జ్యోతిపై కొందరు మహిళలతో టీడీపీ నాయకులు దాడి చేయించి కొట్టించారు. కిందపడిపోయిన జ్యోతిని వేమూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్పృహ కోల్పోవటంతో 108 అంబులెన్స్లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్బాబు హుటాహుటిన వేమూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి జ్యోతిని పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటిపై రాళ్లురువ్వి పోస్టర్ అతికించినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవటంపై పోలీసులను ప్రశ్నించారు. ఆ కేసుతో పాటు ఆదివారం జరిగిన దాడిపై కేసులోనూ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తేనే పోలీస్ స్టేషన్ నుంచి వెళతానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఎఫ్ఐఆర్ తర్వాత ఇస్తామని ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతపై దాడి.. వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని బచ్చులవారిపాలెంలో వైఎస్సార్సీపీ నేత బచ్చుల బంగారు బాబు పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో శనివారం రాత్రి గంగమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. అదే అదునుగా గ్రామంలో టీడీపీకి చెందిన ప్రధాన నాయకుడు వారి అనుచరులు నలుగురికి మద్యం తాగించి బంగారుబాబుపై దాడికి తెగబడ్డారు. దీంతో బంగారుబాబు తలకు తీవ్రగాయం అయ్యింది. అక్కడే ఉన్న కొంతమంది మహిళలు దాడిని అడ్డుకోవడంతో అతడిని వదిలేశారు. కాగా, బంగారుబాబు వైఎస్సార్సీపీ తరఫున గ్రామంలో ప్రచారం చేసి ఓట్లు వేయించాడు. టీడీపీ చెందిన ఒక నాయకుడు గ్రామంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మన సామాజిక వర్గం నాయకుడు కొండయ్యకు గ్రామం మొత్తం ఓట్లు వేద్దామని బంగారు బాబును అడిగారు. అందుకు అతను ఒప్పుకోకపోగా వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో టీడీపీ ఓట్లు చీలుస్తావా అని చెప్పి వారికి సంబంధించిన కొంత మందికి మద్యం తాగించి బంగారు బాబుపై దాడి చేయించాడు. తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. తనకు, తన వర్గం వారికి రక్షణ కల్పించాలని కోరుతూ వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
![Fast track court on Katnapalli incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/katnapalli.jpg.webp?itok=4oYa_k5c)
కాట్నపల్లి ఘటనపై ఫాస్ట్ట్రాక్ కోర్టు
సుల్తానాబాద్ రూరల్(పెద్దపల్లి), పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని రైస్మిల్లు సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ పై హత్య చేసిన దారుణ ఘటనలో నిందితుడికి సత్వరమే శిక్ష పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క, ఐటీ, పురపాలక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.సీఎం రేవంత్రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి వర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కాట్నపల్లిలోని ఓ రైస్మిల్లులో పనిచేస్తున్న దంపతుల ఆరేళ్ల కూతురిని బీహార్కు చెందిన యువకుడు ఈనెల 14న అపహరించి హత్యాచారం చేసిన ఘటన తమను కలచివేసిందన్నారు. మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆదివారం రైస్మిల్లు సమీపంలోని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ, హత్యాచార ఘటనపై సీఎంతోపాటు మంత్రివర్గం, ఎంపీ, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. నిందితునికి త్వరగా శిక్ష పడేలా చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు చర్యలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.8లక్షలు బాధిత కుటుంబానికి రైస్మిల్లు యాజమాన్యం నుంచి రూ.5.50లక్షలు ఇప్పించాలని, ప్రభుత్వం ద్వారా మరో రూ.2.50లక్షలు పరిహారం అందించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. అదే విధంగా చిన్నారి తండ్రికి ఉద్యోగావకాశం కల్పించడంతో పాటు సొంతిల్లు మంజూరు చేసేలా వారి స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్తో చర్చించామని ఆయన తెలిపారు. మంత్రుల వెంట కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్ ఉన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం తెలంగాణను డ్రగ్స్రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది కాట్నపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీతక్క స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా, విక్రయాలపై నిరంతర నిఘా పెంచి వాటిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. మంత్రులు పెద్దపల్లిలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, మత్తులో ఉండడంవల్లే సుల్తానాబాద్ రైస్మిల్లులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగిందని భావిస్తున్నామన్నారు.
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/558.jpg.webp?itok=f_VuZysm)
తల్లి కాటికి.. తండ్రి కటకటాలకు...!
మంచిర్యాలక్రైం: శుభకార్యం జరగాల్సిన ఇంట్లో తల్లి తొందరపాటు నిర్ణయం విషాదం మిగిల్చింది. రెండు రోజుల్లో కూతురి నూతన వస్త్రాలంకరణ కోసం అలంకరణ వస్తువులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసింది. ఫంక్షన్ నిర్వహణ విషయమై భార్యభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు ఆ ఇంటి ఇల్లాలిని బలితీసుకుంది. తల్లి కాటికి వెళ్లగా, తండ్రి కటకటాలపాలయ్యాడు. దీంతో రెండు రోజుల్లో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. .13 ఏళ్లుగా వేధింపులు..ఎస్సై మహేందర్, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని హమాలీవాడకు చెందిన బుర్రి రాజమోహన్–సుగుణ కూతురు స్నేహశీల(36) మందమర్రికి చెందిన మహేశ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మహేశ్ ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. దీంతో పెళ్లయిన ఏడాది నుంచే కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. 13 ఏళ్లుగా భర్త వేధింపులు భరించిన స్నేహశీల కూతురి శారీ ఫంక్షన్ విజయంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన స్నేహశీల ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఉపాధ్యాయురాలిగా..స్నేహశీల పీజీ, బీఈడీ చదివింది. కుటుంబ పోషణకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాద్యాయురాలిగా పనిచేస్తూ ఇద్దరు ఆడపిల్లలను, భర్తను పోషిస్తోంది. ఇటీవలే ప్రిన్సిపాల్గా పదోన్నతి సాధించింది. దీంతో మంచిర్యాలలోని హమాలీవాడలోని ఓ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి అద్దెకు ఉంటుంది. మహేశ్ నిత్యం మద్య తాగివచ్చి భార్యతో గొడవ పడేవాడు. మద్యానికి, పేకాటకు డ బ్బులు కావాలని డిమాండ్ చేసేవా డు. దీంతో స్నేహశీ ల తన ఏటీఎం కా ర్డు, బ్యాంకు పాస్ బుక్ భర్తకే అప్పగించింది. అయినా వే ధింపులు అగలేదు.రెండు రోజుల్లో శారీ ఫంక్షన్..ఇక మహేశ్–స్నేహశీల దంపతుల పెద్ద కూతురు మనస్వికి రెండు రోజుల్లో శారీ ఫంక్షన్ చేసేందుకు స్నేహశీల తాను పనిచేస్తున్న స్కూల్ యాజమాన్యం వద్ద నెలసరి వేతనంతోపాటు మరి కొంత డబ్బు అడ్వాన్స్ రూపంలో తీసుకుంది. ఫంక్షన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి మహేశ్ మద్యం సేవించి ఇంటికి వచ్చి కూతురు ఫంక్షన్కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని స్నేహశీలతో గొడవ పడ్డాడు. తనకూ డబ్బులు కావాలని విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన స్నేహశీల ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు కాసేపటి తర్వాత వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించింది. దీంతో కిందకు దింపి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.భర్త వేధింపులే కారణమని..స్నేహశీల మృతికి భర్త మహేశ్ కారణమ ని ఆమె తల్లి సుగుణ, తమ్ముడు రాఘవ ఆరోపించారు. మహేశ్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. మహేశ్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. స్నేహశీల మృతి వార్త తెలుసుకున్న ఆమె పనిచేసే పాఠశాల ఏజీఎం రాజు ఆస్పత్రి కి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చా రు. కూతుళ్లకు అండగా ఉంటామని, అన్నివిధాలా ఆదుకుంటానని తెలిపారు.