వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐల బస్సుయాత్ర ప్రారంభం

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం బస్సు యాత్రను ప్రారంభించింది. ఈసారి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఎన్‌ఆర్‌ఐ విభాగం రంగం సిద్ధం చేసింది. రావాలి జగన్‌ కావాలి జగన్‌ అనే నినాదంతో ప్రజల్లోకి వెలుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద బస్సుయాత్రను ప్రారంభించారు. ఈ బస్సును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్‌ ప్రారంభించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top