విజయ్‌ థాయ్‌లాండ్‌లో ఏం చేస్తున్నాడంటే..

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఓ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ కోసం విజయ్‌ థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. అయితే విజయ్‌ థాయ్‌లాండ్‌ ఎందుకోసం వెళ్లాడనేదానిపై నిర్మాత ఛార్మి స్పష్టత ఇచ్చారు. అక్కడ విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌  ట్రైనింగ్‌ తీసుకుంటున్నట్టు ఛార్మి తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top