రాష్ట్ర విభజన దిశగా కాంగ్రెస్ అధిష్టానం మరో అడుగు ముందుకు వేసింది. తెలంగాణ డిమాండ్పై తన వైఖరేమిటో వెల్లడించకుండానే మిత్రుల మనోగతం తెలుసుకోవడానికి సిద్ధమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న సోనియాగాంధీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను పార్టీ ఇప్పటికే సిద్ధం చేసుకుంది. అయితే విభజనపై పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తుది నిర్ణయం తీసుకునే ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తెలుసుకోనుంది.
Jul 29 2013 4:13 PM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement