విద్యాహక్కు చట్టం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

Jun 24 2025 3:47 AM | Updated on Jun 24 2025 3:47 AM

విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

కడప ఎడ్యుకేషన్‌ : విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సోమవారం డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ను దళిత మిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామాంజనేయులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాసులుతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అడ్మిషన్లు ఫుల్‌ అయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫీజు నియంత్రణ చేయడంలో విద్యాశాఖ విఫలమైందన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ఫీజు నియంత్రణతోపాటు విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement