
విజయవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ప్రజల్ని వంచింది. సీఎం చంద్రబాబు తన సహాజ ధోరణి వీడలేదు. ప్రజల్ని నిలువునా మోసగించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా రాజ్యాంగాన్ని విస్మరించి ఏకపక్ష పాలన సాగిస్తున్నారు. ఐదేళ్లు వైఎస్సార్పీపీ ప్రభుత్వంలో ఠీవిగా జీవించిన ప్రజలు అనేక కష్టనష్టాలు చవిచూస్తున్నారు. ఏడాదికే తీవ్రస్థాయి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘వెన్నుపోటు దినం’ నిరసన విజయవంతం చేయండి. ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి బలంగా విన్పించాలి.
– ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
మోసం.. చంద్రబాబు నైజం
ప్రజల్ని మోసగించడం, అబద్ధాలతో వంచించడం సీఎం చంద్రబాబు నైజం. సూపర్ సిక్స్ పథకాల పేర్లతో పక్కాగా మోసగించాడు. 1995 నుంచి 2025 వరకూ చంద్రబాబు చరిత్ర పరిశీలిస్తే విశ్వసనీయత అనేది లేదు. ఏ అవసరానికి అనుగుణంగా ఆ గొడుగు మార్చే రకం. ఎన్టీయార్ను మొదలుకొని తోడల్లుడు దగ్గబాటి వెంకటేశ్వరరావు, బామ్మర్ది హరికృష్ణ, తుదకు జూనియర్ ఎన్టీయార్లను వాడుకొని వదిలేశారు. ప్రజల్ని కూడా తన అవసరానికి అనుగుణంగా అబద్ధాలు చెప్పి మోసగించారు. ఏడాదిగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదు. ఈ తరణంలో వైఎస్సార్సీపీ చేపడుతున్న ‘వెన్నుపోటు దినం’ జయప్రదం చేయాలి.
– పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ

విజయవంతం చేయండి