
3 కేజీల గంజాయి స్వాధీనం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగరంలో గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కడప పాత బస్టాండులోని రవీంద్రనగర్ బ్రిడ్జి వద్ద గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారంతో తమ సిబ్బందితో కలిసి పదాడి నిర్వహించామన్నారు. పఠాన్ బిలాల్ అహ్మద్, సయ్యద్ మహబూబ్ బాషా, షేక్ అర్షద్, సయ్యద్ మహమ్మద్ ఉమర్, షేక్ మహ్మద్ రఫీ అనే ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి మూడు కేజీల గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. ఈ ఐదుగురిలో ఒక్కొక్కరిపై ఒడిస్సా రాష్ట్రం, కడప వన్టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే పలు గంజాయి కేసులు ఉన్నాయన్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న పఠాన్ బిలాల్ అహ్మద్ భవన నిర్మాణ కూలీగా, సయ్యద్ మహబూబ్ బాషా, షేక్ అర్షద్ టీ హోటల్లో మాస్టర్గా, సయ్యద్ మహ్మద్ ఉమర్ ఏసీ మెకానిక్గా, షేక్ మహ్మద్ రఫీ వస్త్ర దుకాణంలో పని చేస్తూ గంజాయి విక్రయాలు సాగిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్ఐలు టి. మహేంద్ర, నరసింహారావు, సతీష్ సిబ్బంది పాల్గొన్నారు.
ఐదుగురి అరెస్టు