కడప రూరల్: ప్రభుత్వ క్యాన్సర్ కేర్ సెంటర్ ఏఓగా రాచుమల్లి గోపాల్రెడ్డి నియమితులయ్యారు. ఈయన వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై కడప ప్రభుత్వ క్యాన్సర్ కేర్ సెంటర్ ఏఓ (పరిపాలనా అధికారి)గా నియమితులయ్యారు. గోపాల్రెడ్డికి పదోన్నతి లభించడం పట్ల సహచర ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియామకాలు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో వివిధ హోదాలలో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా షేక్ షఫీవుల్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఇస్మాయిల్, రాష్ట్ర కార్యదర్శిగా ఎస్.రఘురామిరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా ఎం.గురుప్రసాద్, ఎస్.భాస్కర్రెడ్డి, రాష్ట్ర ఐటీ విభాగం ఉపాధ్యక్షులుగా వై.జనార్దన్రెడ్డిలను నియమించారు.
ఏనుగు హల్చల్
పీలేరు: మండలంలోని జాండ్ల, గూడరేవుపల్లె పరిసర గ్రామాల్లో ఒంటరి ఏనుగు హల్చల్ చేయడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. యర్రావారిపాళెం మండలంలో ఫారెస్ట్ అధికారులు సైతం గాయపడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం మండలంలోని జాండ్ల పంచాయతీలో ఒంటరి ఏనుగు సంచరించినట్లు గ్రామస్తులు గుర్తించారు. నారుమడి తొక్కిన ఏనుగు అడుగులు, అరటి తోట ధ్వంసం చేసినట్లు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు, పోలీసులు జాండ్లలో పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
2న జెడ్పీ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్
కడప సెవెన్రోడ్స్: జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పని చేస్తున్న ఎంపీడీఓల క్యాడర్ నుంచి అటెండర్/వాచ్మెన్ వరకు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 2న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 11 వరకు పరిపాలన అధికారులు, సీనియర్ సహాయకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్న 1 గంట వరకు జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.
మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రికార్డు అసిస్టెంట్లు, ఆఫీసు సబార్డినేట్లు, వాచ్ మెన్లకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు మండల పరిషత్ అఽధికారులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. కావున ఒకే కేంద్రంలో ఐదేళ్లు పని చేసిన వారు, రిక్వెస్ట్ బదిలీలు కోరిన ఉద్యోగులంతా జూన్ 2న జిల్లా పరిషత్ సమావేశ భవనంలో హాజరు కావాలని ఆమె కోరారు.

క్యాన్సర్ కేర్ సెంటర్ ఏఓగా గోపాల్రెడ్డి