పీఏసీఎస్‌ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలి

May 27 2025 1:50 AM | Updated on May 27 2025 1:50 AM

పీఏసీఎస్‌ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలి

పీఏసీఎస్‌ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలి

గరిడేపల్లి: మండల పరిధిలోని రాయినిగూడెం పీఏసీఎస్‌ చైర్మన్‌ జుట్టుకొండ సత్యనారాయణ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సోమవారం సంఘం పరిధిలోని రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో కీతవారిగూడెంలోని సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధిలో రాయినిగూడెం సంఘం రెండో స్థానంలో ఉందని, అలాంటి సంఘాన్ని చైర్మన్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో నేడు నష్టాల పాలైందని విమర్శించారు. రాయినిగూడెం సొసైటీ ఉప విభాగమైన వెలిదండ సొసైటీలో ప్రహరీ నిర్మాణం చేపట్టి రూ. 6.65లక్షలు డ్రా చేశారని, కేవలం రూ.70వేలతో ప్రహరీ నిర్మించి చేతులు దులుపుకున్నారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చైర్మన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సంఘం సీఈఓ కనకయ్య మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారని చైర్మన్‌పై విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించారన్నారు. ధర్నాలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ డివిజన్‌ కార్యదర్శి పోటు లక్ష్మయ్య, వివిధ పార్టీల నాయకులు, పెండెం వీరస్వామి, మేకల కనకారావు, బాలకృష్ణ, రాపోలు నవీన్‌, కామళ్ల నవీన్‌, గడ్డం అనిల్‌, మాశెట్టి అంజయ్య, బాదే నరసయ్య, గుంటి వెంకటేశ్వర్లు, గండు మల్లయ్య, కామల్ల ఆంథోని, ప్రసాద్‌, అంజయ్య, రవి, సోమయ్య, శ్రీను, భిక్షం, రాంబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కీతవారిగూడెంలోని సంఘం

కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement