బయోమైనింగ్ ప్రాజెక్టు ప్రారంభం
కాజీపేట అర్బన్: గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరి ధి రాంపూర్లోని డంపింగ్ యార్డు సమస్య శాశ్వత పరిష్కారానికి బయోమైనింగ్ లెగెస్సీ వేస్ట్ ప్రాసెసింగ్ వర్క్ తోడ్పడుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆ ర్ నాగరాజు తెలిపారు. రాంపూర్లోని డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ప్రాజెక్టును మంగళవారం మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి మా ట్లాడారని, తాను సైతం మడికొండ డంపింగ్ యా ర్డు సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపా రు. వరంగల్లోని చెరువులు, నాళాల అక్రమణల నివారణకు హైడ్రా మాదిరిగా వాడ్రా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్.దిలీప్రాజ్, మె ట్టుగుట్ట ఆలయ చైర్మన్ పైడిపాల రఘుచందర్, పార్టీ మండల అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్రెడ్డి, వస్కుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


