ఆకట్టుకున్న రెండు గిరకల పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న రెండు గిరకల పోటీలు

Mar 31 2023 1:42 AM | Updated on Mar 31 2023 1:42 AM

పోటీల్లో ఎద్దులబండ్లు  - Sakshi

పోటీల్లో ఎద్దులబండ్లు

అమరచింత: శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆత్మకూర్‌ మండలం మూలమళ్లలో గురువారం సాయంత్రం రెండు గిరకల ఎద్దులబండ్ల పోటీలు నిర్వహించారు. మొత్తం 32 ఎద్దులబండ్లు పాల్గొనగా.. పోటీలను ఆత్మకూర్‌ సీఐ రత్నం ప్రారంభించారు. రాత్రి వరకు కొనసాగిన పోటీల్లో మొదటి బహుమతిని నారాయణపేట జిల్లా అనుగొండకు చెందిన రాములుగౌడ్‌ గెలుచుకోగా.. రూ.16 వేల నగదును సర్పంచ్‌ ప్రశాంతిరాజ్‌ అందజేశారు. రెండో బహుమతిని పడ్వాడ్‌ గుడిసె రంగన్న గెలుపొందగా రూ.12 వేలు, మూడో బహుమతిని కుచినెర్ల రాము గెలుపొందగా రూ.8 వేలు, నాలుగో బహుమతిని కర్నె నందిత సాధించగా రూ.ఆరు వేల నగదుతో పాటు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ బీసీసెల్‌ మండల అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ రంగారెడ్డి, ఎంపీటీసీ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement