ఆందోళనలో ఉపాధ్యాయులు
అరకొర నిధులు..
● పైసలు విదల్చకుండా పండగ ఎలా..?
● మెగా పేరెంట్టీచర్స్డేకు నిధులు చాలవంటున్న ఉపాధ్యాయులు
● పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు విడుదల చేయాలని
ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
విజయనగరం అర్బన్ / వీరఘట్టం:
మన ఇంటిలో జరిగే ఓ శుభకార్యానికి షామియానా వేసి... మైక్సెట్ పెట్టి.. ఓ 30 మంది బంధుమిత్రులను పిలిచి వారికి అన్ని మర్యాదలు చేయాలంటే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం సుమారు రూ.10 వేలు వరకు ఖర్చు అవుతుంది. అదే బంధువుల సంఖ్య పెరిగితే ఖర్చు రూ.వేల నుంచి రూ.లక్షలకు చేరుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. మరి అలాంటప్పుడు ప్రతి పాఠశాలలో ఈ నెల 5న నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ (పీటీఎం)3.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం అరకొర నిధుల కేటాయింపుపై అయ్యవార్లు పెదవివిరుస్తున్నారు. 30 మంది విద్యార్థులున్న పాఠశాలకు రూ.900 నిధులు కేటాయిస్తే ఎక్కడ సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టికాకుండా మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నిధుల కోసం దాతల వద్ద చేయిచాచమని పరోక్షంగా అయ్యవార్లకు చంద్రబాబు సర్కారు సూచిస్తోందంటూ మండిపడుతున్నారు.
● డబ్బులు లేకుండా పండగ ఎలా?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 5న పీటీఎంను పండగలా నిర్వహించాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆహ్వానించి స్కూల్ ప్రగతిని చాటి చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రొగ్రెస్ను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం పీటీఎం నిర్వహణకు నిధులు చాలవని చెబుతున్నారు.
● ఇదీ పరిస్థితి....
ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో 3,386 సర్కారు బడులు ఉన్నాయి. ఇందులో విజయనగరం జిల్లాలో 1796, పార్వతీపురం మన్యం జిల్లాలో 1590 సర్కారు బడులు ఉన్నాయి. వీటిలో పీటీఎంల నిర్వహణకు విజయనగరం జిల్లాకు రూ.38,20,500లు, పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.25,12,800లు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం చెప్పిన ప్రకారం కార్యక్రమం చేయాలంటే ఈ నిధులు చాలవని హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. నిధుల కేటాయింపును పెంచాలని కోరుతున్నారు.
ఈనెల 5న
నిర్వహించనున్న మెగా పీటీఎం
3.0 ఎజెండా
రాజకీయనాయకులను ఆహ్వానిస్తే ఇబ్బందులు
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు స్థానిక రాజకీయ నాయకులను ఆహ్వానించాలని చెప్పడం సరికాదు. తల్లిదండ్రుతో పాటు వారు కూడా మీటింగ్కు హాజరైతే రాజకీయ వాతావరణం అనివార్యం అవుతుంది. ఈ పరిస్థితులు వివాదాలకు దారితీసి పీటీఎం లక్ష్యాలు సాధించలేం. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా తల్లిదండ్రులతో మాత్రమే నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలి.
– డి.శ్యాం, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
సింగిల్ టీచర్లకు నిర్వహణ భారం
సింగిల్ టీచర్లున్న పాఠశాలలో పీటీఎం నిర్వహణ భారంగా మారుతుంది. తల్లిదండ్రులతో పాటు స్థానిక రాజకీయ నాయకులు, వాళ్లతో వచ్చే కార్యకర్తలు భారీగా ఉంటారు. అందరినీ ఆహ్వానిస్తూ కార్యక్రమం నిర్వహించడం ఒక్క ఉపాధ్యాయునికి సాధ్యం కాదు. మరోవైపు అరకొర నిధులతో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మధ్యాహ్నం భోజనాలు పెట్టాలంటే ఆర్థికంగా ఇబ్బందికరం.
– జేఏవీఆర్కే ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్
తల్లిదండ్రులు గైర్హాజరు
కాకుండా చూసుకోవాలి
మెగా పీటీఎంకు తల్లిదండ్రులు ఎవరూ గైర్హాజరుకాకుండా చూసుకోవాలి. మీటింగ్ ఉద్దేశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రికి తెలియజేయాలి. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభించి 12.45 గంటలకే ముగించి మధ్యాహ్న భోజనం పెట్టాలి. తల్లిదండ్రులతో అకడమిక్ చర్చలు తప్పనిసరిగా నిర్వహించి విజయవంతం చేయడానికి ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలి.
– యు.మాణిక్యంనాయుడు,
డీఈఓ, విజయనగరం
నిధుల కేటాయింపు ఇలా...
పాఠశాలల్లో 0–30 మంది విద్యార్థులుంటే రూ.900, 31–100 మంది మధ్య విద్యార్థులున్న పాఠశాలకు రూ.2,250, 101–250 మధ్యన రూ.4,500, 251–1000 మంది విద్యార్థులుంటే రూ.6,750, వెయ్యి మంది విద్యార్థులు కంటే ఎక్కువ ఉండే పాఠశాలకు రూ.9 వేలు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు.
ఆందోళనలో ఉపాధ్యాయులు
ఆందోళనలో ఉపాధ్యాయులు
ఆందోళనలో ఉపాధ్యాయులు
ఆందోళనలో ఉపాధ్యాయులు
ఆందోళనలో ఉపాధ్యాయులు
ఆందోళనలో ఉపాధ్యాయులు
ఆందోళనలో ఉపాధ్యాయులు


