
సిగ్నల్ లేక.. సకాలంలో 108 రాక..
సీతంపేట: మొబైల్ సిగ్నల్ లేక.. సకాలంలో 108 అంబులెన్స్ రాక రోడ్డు ప్రమాద బాధితుడు గంటన్నర పాటు నరకం చూసిన ఘటన సీతంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సీతంపేట మండలంలోని మారుమూలన ఉన్న బంజారుగూడ–పుట్టిగాం మధ్య ఎత్తైన ఘాట్రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో గగాలి గ్రామానికి పరామర్శకు వెళ్లి వస్తున్న కొత్తరు మండలం మెట్టూరుకు చెందిన వీరన్నకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సమయంలో అక్కడ 108కు ఫోన్ చేద్దామని ఆటోలో ఉన్న కుటుంబ సభ్యులంతా ఎంత ప్రయత్నించినా సెల్సిగ్నల్ లేకపోవడంతో వీలుపడలేదు. స్థానికులు సెల్సిగ్నల్ చోటకు పరుగుతీసి 108కు సమాచారం అందించారు. సీతంపేట, కొత్తూరు 108 అంబులెన్స్లు ఖాళీగా లేవని, భామిని అంబులెన్స్ వస్తుందని సమాచారం ఇచ్చా రు. మారుమూల ప్రాంతం కావడం, సిగ్నల్ సమ స్యతో భామిని అంబులెన్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 1.50 అయ్యింది. అంబులెన్స్ సిబ్బంది వీరన్నకు ప్రాథమిక చికిత్స అందించి సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గంటన్నర పాటు నరకం చూసిన రోడ్డు ప్రమాద బాధితుడు
ఆస్పత్రికి తరలించేందుకు అవస్థలు
ఘాట్ రోడ్లో ఆటోబోల్తా

సిగ్నల్ లేక.. సకాలంలో 108 రాక..