ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

Jun 26 2025 6:08 AM | Updated on Jun 26 2025 6:08 AM

ఉరి వ

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి వట్టిగెడ్డ పాత బ్రిడ్జి సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జీగిరాం గ్రామానికి చెందిన నూలక ప్రశాంత కుమార్‌(26) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఇది వరకే వివాహం జరిగి ఇద్దరు పి ల్లలు ఉండగా భార్యతో విడాకులు తీసుకున్నాడు. తరువాత తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రశాంత కుమార్‌ మరో అమ్మయితో ప్రేమలో పడి ఆమెను ఇంటికి తీసుకొస్తానని తల్లిదండ్రులతో చెప్పగా వద్దని మందలించారు. దీంతో ఈనెల 5వ తేదీన ఇంటి నుంచి బ్యాగ్‌తో వెళ్లిపోయి కొట్టక్కి బ్రిడ్జి వద్ద తన షర్ట్‌తో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల గ్రామాల్లో కూడా వాకబు చేశారు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో సాలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో తమ కుమారుడు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం కొట్టక్కికి చెందిన పశువుల కాపరి చెట్టు కింద కుళ్లిపోయి దుర్వాసన కొడుతూ కింద పడి ఉన్న మృతదేహాన్ని చూసి గ్రామ వీఆర్వో మహేష్‌కు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు వీఆర్వో పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వ సమాచారం అందిన వెంటనే సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు, ఏఎస్సై అప్పారావులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరివీలించారు. మృతదేహం వద్ద పడి ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంగా జీగిరాం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి బ్యాగుతో పాటు అందులో ఉన్న బట్టల ఆధారంగా తమ కుమారుడేనని గుర్తించి భోరున విలపించారు. మృతదేహం తీయలేని దుస్థితిలో ఉండడం వల్ల పోలీసు అధికారులు ఘటనా స్థలంలోనే బాడంగి సీహెచ్‌సీ వైద్యాధికారితో పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యుల సమక్షంలో అక్కడే ఖననం చేశారు. ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య1
1/1

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement