
రైతుల సంక్షేమమే ధ్యేయం
నవాబుపేట: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎల్లకొండ రైతు వేదికలో రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రైతులకు ఉచితంగా జొన్న, వరి, కంది విత్తనాలు పంపిణీ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మెన్ గీతాసింగ్నాయక్, ఏఆర్ఎస్ తాండూరు శాస్త్రవేత్త యమున, ఏడీఏ శంకర్రాథోడ్, ఏఓ జ్యోతి, మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ప్రకాశ్, ఏఈఓలు ఆదిల్, లక్ష్మి, పవన్, మల్లేశ్, రమాదేవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య