
వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
అనంతగిరి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి వీడీడీఎఫ్(వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవెలప్మెంట్ ఫోరం)ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ సాగింది. అనంతరం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే మనోహర్రెడ్డి
తాండూరు రూరల్: నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో 60 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందన్నారు. రాజీవ్ యువ వికాసం, సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సంగెంకలాన్ గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు బస్సు కూడా వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్చందు, నాయకులు వడ్డె శ్రీనివాస్, పండరి, శరుణు బసప్ప, రాజ్కుమార్, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నీ విజేత పెద్దేముల్
తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో బీఎమ్మార్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. విజేతగా పెద్దేముల్ జుట్ట, రెండో స్థానంలో గుంతబాసుపల్లి జట్లు నిలిచాయి. గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యాక్రమంలో టోర్నీ నిర్వాహకులు, క్రీడాకారులు రాము యాదవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం
ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
దోమ: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని శివారెడ్డిపల్లికి చెందిన షరీఫా బేగం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. సోమవారం నిర్వహించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీలను నెరవేరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
విత్తనాల పంపిణీ
అనంతరం గ్రామంలోని రైతులకు ఎమ్మెల్యే సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. వరి, కందులు, జొన్న విత్తనాలను ఏవో ప్రభాకర్ రావు తో కలసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గ్యామా, ఏఈవోలు పాల్గొన్నారు.
శాంతిభద్రతల
పరిరక్షణకు సహకరించాలి
మంచాల: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. మండల పరిధిలోని ఆగాపల్లిలో నాగార్జునసాగర్– హైదరాబాద్ రోడ్డుపై మంచాల పోలీసులు ఏర్పాటు చేసిన వాహన తనిఖీ శిబిరాన్ని సోమవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.

వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ