
చైన్నెలో వలస కార్మికుడి మృతి
రేణిగుంట: పొట్టకూటి కోసం చైన్నెకి వలసవెళ్లి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న సమయంలో పిట్స్ రావడంతో తోటి కార్మికులు హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. గతంలో రేణిగుంటలో పనిచేసినట్లు తెలపడంతో గత వారం రోజులుగా రేణిగుంట పరిసర ప్రాంతాల్లో సహచర కూలీలు మృతుడి ఫొటో పట్టుకొని వెతుకుతున్నారు. రేణిగుంటలో శుక్రవారం మేస్త్రి నారయ్య మాట్లాడుతూ తనతోపాటు కొంతమంది కార్మికులను చైన్నెకి పనికి తీసుకొని వెళ్లే వాడినన్నారు. ఆ క్రమంలో రేణిగుంటలో యేసు అనే కార్మికుడు 20 రోజుల క్రితం పని కోసం తమతోపాటు చైన్నెకి వచ్చాడని, పది రోజులు పనిచేసి కూలీ డబ్బులు తీసుకొని తిరుగు ప్రయాణమయ్యే సమయంలో అతనికి పిట్స్ వచ్చాయని తెలిపారు. సమీపంలోని ప్రభుత్వ కేఎంసీ హాస్పిటల్కు తరలించకగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు తెలిపారు. పోలీసులు వస్తేనే మృతదేహం ఇస్తామని హాస్పిటల్ వారు తెలిపారని, ఎవరికై నా మృతుడి ఆచూకీ తెలిస్తే 9550349981, 7989245532 నంబర్లలో సంప్రదించాలని మేస్త్రీ కోరుతున్నారు.