ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా? | SHE Teams caught a total of 478 people red handed for this reason | Sakshi
Sakshi News home page

ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా?

Jul 16 2025 10:07 AM | Updated on Jul 16 2025 3:31 PM

SHE Teams caught a total of 478 people red handed for this reason

మొహర్రం, బోనాల ఊరేగింపుల్లో పోకిరీలు 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఇటీవల జరిగిన మొహర్రం, బోనాలు ఊరేగింపుల్లో పోకిరీలు రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా, అనుచితంగా తాకుతూ మహిళలు, యువతులను వేధించారు. ఈ రెండు సందర్భాల్లోనూ షీ–టీమ్స్‌ నిఘాలో మొత్తం 478 మంది పట్టుబడినట్లు డీసీపీ డాక్టర్‌ ఎన్‌జేపీ లావణ్య మంగళవారం ప్రకటించారు. 

దీనికోసం షీ–టీమ్స్‌ రహస్య కెమెరాలు వినియోగించాయి. చిక్కిన పోకిరీల్లో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నారు. ఈ ఆకతాయిల్లో నలుగురిపై పెట్టీ కేసులు, నగంలోని వివిధ ఠాణాల్లో ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించారు. మిగిలిన వారిని మందలించి పంపారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement