కోడలు మీద పెట్రోలు పోసి సజీవ దహనం | - | Sakshi
Sakshi News home page

కోడలు మీద పెట్రోలు పోసి సజీవ దహనం

May 27 2024 6:10 PM | Updated on May 27 2024 6:10 PM

అన్నానగర్‌: రామనాథపురం జిల్లా ముత్తుకుళత్తూరు సమీపం ముత్తు విజయపురం గ్రామానికి చెందిన జేసు కుమారుడు ఆరోగ్య ప్రభాకర్‌. ఇతని భార్య ఉమ. గత 2023 సంవత్సరంలో ఆరోగ్య ప్రభాకర్‌, ఆమె చిన్న కుమార్తె జెమి థెరిస్సా అనారోగ్యంతో మరణించారు. అలా మామగారు తన పెద్ద కూతురు ఉమతో కలిసి ఉన్నారు. ఇదిలా ఉండగా ఆస్తి విభజన విషయంలో మామగారు జేసు, ఉమ మధ్య గొడవ జరిగింది. గత 20న జరిగిన వివాదంలో ఆగ్రహం చెందిన జేసు ఇంటిలో నిద్రిస్తున్న కోడలు ఉమపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. అయితే ఉమ ఆత్మహత్యకు యత్నించినట్లు జేసు నాటకీయంగా చూపించాడు. దీంతో పోలీసులు ఉమను చికిత్స నిమిత్తం రామనాథపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఉమ మృతిలో అనుమానం ఉందని ఉమ సోదరుడు దినేష్‌ కీళత్తువాల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మామ జేసు ఉమపై పెట్రోలు పోసి నిప్పు అంటించినట్లు తేలింది. దీంతో పోలీసులు వెంటనే హత్య కేసు నమోదు చేసి జేసును ఆదివారం అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement