ఎలుగు బాధిత కుటుంబాలను ఆదుకోవాలి | Sakshi
Sakshi News home page

ఎలుగు బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

Published Fri, Mar 29 2024 2:05 AM

మృతుల కుటుంబాన్ని పరామర్శిస్తున్న ప్రతినిధులు  - Sakshi

వజ్రపుకొత్తూరు రూరల్‌: మండలంలోని చీపురపల్లి పంచాయతీ అనకాపల్లిలో ఇటీవల ఎలుగుబంట్ల దాడిలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే అదుకోవాలని బీసీ సంఘ ప్రతినిధులు కోరారు. గురువారం మానవ హక్కుల వేదిక ప్రతినిధులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం అటవీ శాఖాధికారులను కలిసి వారితో మాట్లాడారు. ఉద్దాన ప్రాంతంలో ఎలుగులు నిత్యం దాడి చేస్తున్నా చర్యలు చేపట్టకపోవడం సరి కాదన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు బి.ఢిల్లీరావు, పోతనపల్లి కామేశ్వరరావు, కోనారి ఈశ్వరమ్మ, ఇరోతు గురుమూర్తి, గండు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement