హాకీ లెజెండ్‌ కన్నుమూత: సీఎం సంతాపం

Olympic bronze and World Cup winner hockey player Michael Kindo dies - Sakshi

భారత హాకీ దిగ్గజం మైఖేల్‌ ఖిండో కన్నుమూత

సాక్షి,ఢిల్లీ: భారత హాకీ దిగ్గజం,అర్జున అవార్డు  గ్రహీత మైఖేల్‌ ఖిండో(73) ఇకలేరు. వయసు సంబంధిత ఇబ్బందితోపాటు, కొంతకాలంగా తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్న మైఖేల్‌ గురువారం తుది శ్వాస తీసుకున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నామని తెలిపారు. అటు  ఒడిశాముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌  మైఖేల్‌ ఖిండో మృతిపై సంతాపం ప్రకటించారు.  హాకీ లెజెండ్ ఖిండో కన్నుమూతపై హాకీ ఇండియా, ఒడిశా స్పోర్ట్స్‌, మాజీ ఆటగాళ్లు సంతాపం ప్రకటించారు.  కాగా కౌలాలంపూర్‌లో 1975లో  హాకీ ప్రపంచ కప్, 1972 ఒలింపిక్స్ కాంస్య పతక విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడుగా ఉన్నారు మైఖేల్. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top