
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రకటించాడు. తన ఎంపిక చేసిన జట్టుకు అనుహ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్గా సిద్దు నియమించాడు. ఈ ఏడాది సీజన్లో రోహిత్ ఏ జట్టుకు కెప్టెన్గా లేనప్పటికి.. సిద్దు మాత్రం తన ఎంచుకున్న జట్టుకు సారథిగా రోహిత్ వైపే మొగ్గు చూపాడు.
కెప్టెన్గా రోహిత్ శర్మ ఎన్నో అద్బుత విజయాలను సాధించాడని, అందుకే తన జట్టుకు నాయకుడిగా ఎంపిక చేశానని సిద్దు తెలిపాడు. కాగా ముంబై ఇండియన్స్ను ఐదు సార్లు ఛాంపియన్గా నిలిపిన హిట్మ్యాన్.. భారత్కు టీ20 వరల్డ్కప్, ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు.
ఇక సిద్దూ ఎంచుకున్న జట్టులో ఓపెనర్లగా రోహిత్, విరాట్ కోహ్లికి చోటిచ్చాడు. అదేవిధంగా మూడు, నాలుగు స్ధానాల్లో వరుసగా జోస్ బట్లర్, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు అవకాశం దక్కింది. ఐదో స్ధానంలో నికోలస్ పూరన్కు ఛాన్స్ దక్కింది. ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాకు సిద్దు అవకాశం కల్పించాడు.
స్పెషలిస్ట్ స్పిన్నర్గా నూర్ ఆహ్మద్ను ఎంపిక చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధు.. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, హాజిల్వుడ్లకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ జట్టులో ఆరెంజ్ క్యాప్ విన్నర్ సాయిసుదర్శన్, గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఐపీఎల్-2025 ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో పంజాబ్ను ఓడించి తొలి ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ సొంతం చేసుకుంది.
సిద్దు ఎంచుకున్న ఐపీఎల్ బెస్ట్ టీమ్
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, నికోలస్ పూరన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, నూర్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్వుడ్.
చదవండి: ఆర్సీబీలోకి బుమ్రా, సూర్యకుమార్, పంత్: విజయ్ మాల్యా డ్రీమ్ టీమ్