సబ్సిడీ కందుల బ్యాగులు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ కందుల బ్యాగులు పంపిణీ

Jul 3 2025 7:39 AM | Updated on Jul 3 2025 7:39 AM

సబ్సిడీ కందుల బ్యాగులు పంపిణీ

సబ్సిడీ కందుల బ్యాగులు పంపిణీ

హుస్నాబాద్‌: వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కేడం లింగమూర్తి అన్నారు. బుధవారం పట్టణంలోని రైతు వేదికలో సబ్సిడీపై కందుల బ్యాగులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుల సాగు చేయడం వల్ల ఎకరానికి 6క్వింటాళ్ల పైగా దిగుబడి వస్తుందన్నారు. మార్కెట్‌లో పప్పు దినుసులకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో భూములు ఎక్కువగా ఉన్న రైతులు ఆయిల్‌ పామ్‌ను సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని వరికి ప్రత్యామ్నాయంగా లాభభసాటి పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కంది తిరుపతి రెడ్డి, వైస్‌ చెర్మన్‌ చందు, డైరెక్టర్లు యాదవ రెడ్డి, బిక్యానాయక్‌, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement