ప్రజా ప్రభుత్వంతో సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రభుత్వంతో సమస్యల పరిష్కారం

Dec 11 2023 6:06 AM | Updated on Dec 11 2023 6:06 AM

సీఎంకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఆసీఫ్‌అలీ   - Sakshi

సీఎంకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఆసీఫ్‌అలీ

కడ్తాల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డిని రేవంత్‌ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్‌అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసీఫ్‌అలీ మాట్లాడుతూ.. జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రతిపక్షంలో ఉంటూ నిరంతరం ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడిన వ్యక్తికే రాష్ట్ర ప్రజలు పట్టంకట్టారన్నారు. పార్టీ నాయకులతో కలుపుగోలుగా ఉంటూ కాంగ్రెస్‌ను అధికారంలోని తీసుకువచ్చిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. ప్రజాప్రభుత్వంతో రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ పరిష్కారామవుతాయన్నారు.

రేవంత్‌ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్‌అలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement