రాష్ట్ర స్థాయి యోగా పోటీలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి యోగా పోటీలు

Nov 26 2025 6:59 AM | Updated on Nov 26 2025 6:59 AM

రాష్ట్ర స్థాయి యోగా పోటీలు

రాష్ట్ర స్థాయి యోగా పోటీలు

ముగిసిన 69వ

జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల నుంచి అండర్‌ 14,17,19 విభాగాల్లో బాలబాలికలకు నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు మంగళవారంతో ముగిశాయి. 13 ఉమ్మడి జిల్లాల నుంచి 400 మంది పైగా క్రీడాకారులు వచ్చారు. చందలూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలురు వసతి పొందారు. బాలికలకు గ్రామంలో గ్రామస్తులు వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ప్రోత్సహించారు. చివరి రోజు అండర్‌ 19 విభాగంలో యోగా పోటీలు జరిగాయి. ఈ పోటీలకు గెలిచిన క్రీడాకారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజ అధ్యక్షతన బహుమతులు అందజేశారు.

విజేతలు వివరాలు:

– అండర్‌ 19 ఆర్టిస్టిక్‌ యోగా ఫైర్‌ బాలికల విభాగంలో విశాఖపట్నానికి చెందిన పి.రమసాహితి, పి.లక్ష్మీసాహిత్య మొదటి స్థానం సాధించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వై.ముకుందశరణ్య, వై.తమీరున్‌ రెండో స్థానం, ఈస్ట్‌ గోదావరికి చెందిన యన్‌. శరణ్య, ఎస్‌.హిమశ్రీ మూడో బహుమతి సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement