
అడ్డగోలుగా నరికేద్దాం..!
పీసీపల్లి: కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలకు కొదవ లేకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యాన్ని అలుసుగా చేసుకొని గ్రామాల్లో టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు రెచ్చిపోతున్నారు. మండల పరిధిలోని గుంటుపల్లి సర్వే నంబర్ 5లో పదేళ్ల క్రితం ప్రభుత్వం 70 ఎకరాల్లో జామాయిల్ మొక్కలు నాటింది. ప్రస్తుతం జామాయిల్ చెట్లు ఏపుగా పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతల కన్ను ఈ చెట్లపై పడింది. గత 10 రోజులుగా 70 ఎకరాల్లోనూ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జామాయిల్ చెట్లను నరికేస్తున్నారు. టన్ను రూ.6 వేల నుంచి రూ.7 వేల చొప్పున అడ్డగోలుగా అమ్మేసి జేబులు నింపుకుంటున్నారు. ఒక లారీకి 20 నుంచి 25 టన్నుల కర్ర లోడ్ చేయవచ్చు. ఇలా లారీ కర్రను రూ.1.50 లక్షలకు విక్రయిస్తూ రోజుకు రెండు లారీల చొప్పున సొమ్ము చేసుకుంటున్నారు.
అక్రమ నరికివేతకు అధికారుల అండ
70 ఎకరాల్లో అక్రమంగా జామాయిల్ నరికేసి తరలిస్తున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీనిపై గ్రామస్తులు అటవీ, రెవెన్యూ శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ వైపు ఎవరూ రాకుండా అధికారులు కిందిస్థాయి సిబ్బందిని సైతం పహారా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు, అక్రమార్కులు కుమ్మకై ్క ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
అటవీ భూముల్లో అక్రమంగా జామాయిల్ నరికివేత
70 ఎకరాల్లో నరికి సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేతలు
రోజుకు రెండు లారీల కర్ర తరలింపు
గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులు