
ఎవరెస్టు శిఖరం అధిరోహించిన లింబాద్రి
మోర్తాడ్(బాల్కొండ): భీమ్గల్ మండలం బాబానగర్ తండాకు చెందిన మలావత్ లింబాద్రి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. మలావత్ తిరుపతి కుమారుడు లింబాద్రి నూత్పల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఎవరెస్టు అడ్వెంచర్ శిబిరానికి ఎంపికై న 20 మంది విద్యార్థుల్లో లింబాద్రి ఒకరు. గత నెలలో బయల్దేరిన ఈ బృందం 5,150 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ నార్త్ బేస్క్యాంపునకు శనివారం చేరుకున్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, రాకేశ్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థుల బృందం పర్వతారోహణకు వెళ్లింది. చిన్న వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన లింబాద్రిని ఆర్సీవో సత్యనాథ్రెడ్డి, నూత్పల్లి పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్గౌడ్, పీడీ ప్రదీప్ అభినందించారు. లింబాద్రి పర్వతారోహణ విజయవంతం కావడంతో బాబానగర్ తండావాసులు, భీమ్గల్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
9 నుంచి డీఈఈ సెట్–2025
ధ్రువపత్రాల పరిశీలన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రై మరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల ప్రవేశానికి ఇటీవల నిర్వహించిన డీఈఈ సెట్–2025 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 9 నుంచి నిజామాబాద్ డైయిట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ టి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్కు హాజరు కావాలని సూచించా రు. ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పా టు డీఈఈ సెట్ హాల్ టికెట్, ర్యాంకు కా ర్డు, ఇటీవల పొందిన ఆదాయ ధ్రువీకరణ ప త్రం, ఇంటిగ్రేటెడ్ కుల ధ్రువీకరణ పత్రం, పదోతరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర రిజర్వేషన్లు (ఎన్సీసీ, క్రీడలు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు) ఉంటే సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో వెరిఫికేషన్కు హాజరు కావాలన్నారు. డీఈఈ సెట్ వెబ్సైట్లో హాజరు కావాల్సిన తేదీ, స్థలం, ఒరిజినల్ సర్టిఫికెట్ల వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర సందేహాలుంటే 63095–35759, 88864–48818 నంబర్లను సంప్రదించాలని టి శ్రీనివాస్ తెలిపారు.