
‘డబుల్’ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి
సుభాష్నగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు వెంటనే పంపిణీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. లేదంటే ఆగస్టు 15న బీజేపీ ఆధ్వర్యంలో పేదలతో గృహప్రవేశం చేయిస్తామని హెచ్చరించారు. శుక్రవారం డబుల్ బెడ్రూం ఇళ్లను బీజేపీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దినేశ్ ప టేల్ మాట్లాడుతూ ప్రజాధనంతో నిర్మించిన డబు ల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వ వైఫల్యంతో నేటికీ పే దలకు అందించకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ఆ ఇళ్లు పేదల హక్కు అని, ఎవరి సొత్తు కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజల కు ఇవ్వకుండా మోసం చేయగా, ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై రాజకీయా లు మానుకొని, వెంటనే అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, నాయకులు జగన్రెడ్డి, శంకర్రెడ్డి, మాస్టర్ శంకర్, ఆనంద్, నరేశ్, ఆమంద్ విజయ్కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
లేదంటే ఆగస్టు 15న పేదలతో
గృహ ప్రవేశం చేయిస్తాం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దినేశ్ పటేల్ కులాచారి