
మానసిక ఒత్తిడికి యోగాతో పరిష్కారం
నిజామాబాద్నాగారం: మానసిక ఒత్తిడిని యోగాతో దూరం చేసుకోవచ్చని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దశాబ్ధి వేడుకల్లో భాగంగా నగరంలోని కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా అధికారులకు, ఉద్యోగులకు యోగాపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఎంహెచ్వో ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘హర్ దిన్ యోగా–హర్ ఘర్ యోగా’ నినాదంతో ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలని తెలిపారు. వేడుకల్లో ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఆయుష్ నోడల్ అధికారి గంగదాస్, వైద్యులు తిరుపతి, వెంకటేష్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, డీపీఎం వందన, ఆయుష్ పారా మెడికల్ సిబ్బంది పురుషోత్తం, ఉమా ప్రసాద్, స్వాతి, రమేష్, భిక్షపతి, యోగా శిక్షకులు నమ్రత, సంగీత, విజయభాస్కర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

మానసిక ఒత్తిడికి యోగాతో పరిష్కారం